spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Janasena Yuvashakti: ‘రణ’స్థలి సిద్ధం... అందరి అడుగులు అటువైపే...

Janasena Yuvashakti: ‘రణ’స్థలి సిద్ధం… అందరి అడుగులు అటువైపే…

Janasena Yuvashakti: ‘రణ’స్థలి సిద్ధమైంది. రాష్ట్రం యావత్తూ రణస్థలం వైపే చూస్తోంది. అందరి అడుగులు రణస్థలం వైపే పడుతున్నాయి. జనసేన యువశక్తి కార్యక్రమం కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమ నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జాతీయ రహదారి చెంతనే 35 ఎకరాల ప్రైవేటు స్థలంలో వేదిక సిద్ధమైంది. పవన్ తో పాటు 100 మంది యువ ప్రతినిధులు వేదికపై కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. వీఐపీలు,వీర మహిళలు, కీలక నాయకులకు వేర్వేరుగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి లక్షలాది మంది యువత వస్తారన్న అంచనాల నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు. తొక్కిసలాటలకు అవకాశం లేకుండా బారికేడ్లు ఏర్పాటుచేశారు. అటు సభకు వచ్చేవారికి భోజనం, తాగునీరు, ఇతరత్రా వసతులను సమకూర్చనున్నారు. గురువారం వేకువజాము నుంచే ఆహార తయారీ ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి.

Janasena Yuvashakti
Janasena Yuvashakti

.ఇప్పటికై పవన్ ఉత్తరాంధ్రకు చేరుకున్నారు. బుధవారం అర్ధరాత్రి విజయనగరం జిల్లా భోగాపురంలోని సన్ రే రిసార్ట్స్ లో పవన్ బస చేశారు. సాయంత్రం ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్న పవన్ కు ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం లభించింది. అక్కడ నుంచి రోడ్డు మార్గం గుండా సన్ రే రిసార్ట్స్ కు పవన్ చేరుకున్నారు. పవన్ షెడ్యూల్ ఖరారు కావడంతో వేలాది మంది యువత, జన సైనికులు రిసార్ట్స్ వద్దకు చేరుకున్నారు. పవన్ కు ఘన స్వాగతం పలికారు. అందరికి అభివాదం చేస్తూ పవన్ ముందుకు సాగారు. ఉదయం 11 గంటలకు రిసార్ట్స్ నుంచి బయలుదేరి పవన్ సభా వేదికకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ యువశక్తి కార్యక్రమంలో పవన్ పాల్గొనున్నారు.

Janasena Yuvashakti:
Janasena Yuvashakti:

ఉత్తరాంధ్ర నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి జన సైనికులు రణస్థలానికి చేరుకున్నారు. ఎటుచూసిన జనమే కనిపిస్తున్నారు. ఇటు విశాఖ, అటు శ్రీకాకుళం వైపు కిలోమీటర్ల మేరవాహనాలు బారులుదీరుతూ కనిపించాయి. చాలా మంది బుధవారం సాయంత్రానికి విశాఖ, శ్రీకాకుళం చేరుకున్నారు. లాడ్జిలు, హోటళ్లలో విడిది చేశారు. గురువారం ఉదయం 7 గంటలకే సభా ప్రాంగణానికి చేరుకోవడం కనిపించింది. ఉత్తరాంధ్రలోని 33 నియోజకవర్గాల నుంచి ప్రత్యేక వాహనాల్లో జనసేన శ్రేణులు తరలివస్తున్నారు. కార్యక్రమ నిర్వహణకు సంబంధించి రవాణా, భద్రత, ఆహార, ఆహ్వాన కమిటీలను ఏర్పాటుచేశారు. కీలక నాయకులకు ఆ బాధ్యతలు అప్పగించారు. వేలాది మంది వలంటీర్లు సేవలందిస్తున్నారు. ఎక్కడా ఎటువంటి లోపాలకు తావివ్వకుండా ఏర్పాట్లు చూస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper