Homeజాతీయ వార్తలుManmohan singh : నేషనల్ టీవీ యాంకర్ టంగ్ స్లిప్.. ప్రధాని మోడీ మరణించారంటూ.. వైరల్...

Manmohan singh : నేషనల్ టీవీ యాంకర్ టంగ్ స్లిప్.. ప్రధాని మోడీ మరణించారంటూ.. వైరల్ వీడియో..

Manmohan singh : ప్రముఖ వ్యక్తులకు సంబంధించి వార్తలు చదివే సమయంలో బాగా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే దేశ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటిదే ఇబ్బందులనే ఇటీవల ఒక నేషనల్ టీవీ ఛానల్ ఎదుర్కొంది. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణాన్ని నివేదిస్తూ ఆజ్ తక్ యాంకర్ పొరపాటున ప్రధాని నరేంద్ర మోదీ మరణించారని గురువారం రాత్రి ప్రైమ్-టైమ్ ప్రసారంలో షాకింగ్ ఆన్ – ఎయిర్ గాఫ్ చూసింది . యాంకర్ వెంటనే , ‘మేము మీకు ఎయిమ్స్ నుంచి వచ్చిన పత్రికా ప్రకటనను చూపుతున్నాము, అందులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 92 సంవత్సరాల వయస్సులో-మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 92 సంవత్సరాల వయస్సులో మరణించారని పేర్కొనబడింది.’ ఈ గాఫ్ సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్‌కు దారితీసింది. ఇక్కడ యాంకర్‌ను, ఛానెల్‌ను ఎగతాళి చేస్తున్నారు. అదే యాంకర్‌పై విరుచుకుపడడం ఇది మొదటి సందర్భం కాదు. గతంలో ఆమె కొత్త రూ. 2,000 నోట్లు మార్కెట్లోకి వచ్చిన సందర్భంలో ఆ నోట్లలో ‘చిప్’ ఉందని చెప్పింది. అయితే, ఈ విషయాన్ని ప్రభుత్వం గానీ, టెక్నీషియన్స్ గానీ ఎవరూ దృవీకరించకుండానే ఆమె చెప్పింది. ఆ సందర్భంలో ఆమెను నెటిజన్లు విపరీతంగా ట్రోల్స్ చేశారు. ఇది భారీ విమర్శలను అందుకుంది. ఆ తర్వాత ఆ న్యూస్ ను ఆజ్ తక్ తొలగించింది. ఈ సందర్భంగా ఛానల్ ను చూసిన వారు విపరీతంగా విమర్శించారు. ఇలాంటిది సరైన పద్ధతి కాదని, సమాజానికి రాక్ మెసేజ్ వెళ్తుందని నేషనల్ ఛానల్ ఇలాంటి తప్పిదాలకు అవకాశం కల్పించవద్దని హెచ్చరించారు. ప్రస్తుత ప్రభుత్వంపై పక్షపాతం అని కూడా కొందరు విమర్శించారు.

భారతదేశం 14వ ప్రధానమంత్రి, దేశంలో ఆర్థిక సంస్కరణల రూపశిల్పి డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం 92 సంవత్సరాల వయస్సులో ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించారు. వృద్ధాప్య సంబంధిత వ్యాధుల కారణంగా ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరిన ఆయనకు చికిత్స అందించారు. చికిత్స పొందుతూనే తుది శ్వాస విడిచారు.

ఎయిమ్స్ ఈ విషయాన్ని ప్రకటన రూపంలో రిలీజ్ చేసింది. ‘ప్రగాఢమైన దుఃఖంతో, 92 సంవత్సరాల వయస్సులో భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణాన్ని మేము తెలియజేస్తున్నాము. అతను వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో పోరాడుతూ చికిత్స పొందుతున్నాడు. చికిత్స జరుగుతున్న సమయంలో మరణించాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, అతన్ని బతికించలేకపోయాము. గురువారం రాత్రి 9:51 గంటలకు మరణించినట్లు’ ఎయిమ్స్ ప్రకటనలో పేర్కొంది.

కాంగ్రెస్ నేతృత్వంలోని మన్మోహన్ సింగ్ రెండు దఫాలుగా ప్రధానమంత్రిగా కొనసాగారు. 2004 నుంచి 2014 వరకు యూపీఏ ప్రభుత్వంలో ప్రధానిగా పని చేసిన ఆయన 2014లో యూపీఏ ఓటమితో అప్పటి నుంచి ఇంటికే పరిమితమయ్యారు.

Mahi
Mahihttp://oktelugu.com
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....
Oktelugu Epaper
Exit mobile version