హిట్లరే పతనమైపోయాడు.. మీరెంత: నాగబాబు

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ‘మన నుడి మన నది’ కార్యక్రమంలో పాల్గొన్న రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు నాగబాబు గారు మాట్లాడుతూ.. “స్థానిక ఎన్నికల్లో నామినేషన్‌ వేస్తున్నవారిని తన్నడం, కత్తులతో పొడవడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. అయినప్పటికీ స్థానిక ఎన్నికల్లో జనసేన నామినేషన్లు వేశారు. భయపడకండి ఇటువంటి బెదిరింపులు మామూలే. ఎందుకంటే హిట్లర్‌ కంటే గొప్పోడు ఎవరూ లేడిక్కడ. అటువంటి వాడే పతనమైపోయాడు. ఇది కూడా ఎంతో కాలం పట్టదు’ అని చెప్పారు. 99 దెబ్బలకు […]

Written By: Neelambaram, Updated On : March 15, 2020 1:29 pm
Follow us on

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ‘మన నుడి మన నది’ కార్యక్రమంలో పాల్గొన్న రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు నాగబాబు గారు మాట్లాడుతూ.. “స్థానిక ఎన్నికల్లో నామినేషన్‌ వేస్తున్నవారిని తన్నడం, కత్తులతో పొడవడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. అయినప్పటికీ స్థానిక ఎన్నికల్లో జనసేన నామినేషన్లు వేశారు. భయపడకండి ఇటువంటి బెదిరింపులు మామూలే. ఎందుకంటే హిట్లర్‌ కంటే గొప్పోడు ఎవరూ లేడిక్కడ. అటువంటి వాడే పతనమైపోయాడు. ఇది కూడా ఎంతో కాలం పట్టదు’ అని చెప్పారు. 99 దెబ్బలకు పగలని బండ రాయి వందో దెబ్బకి పగిలి తీరుతుంది. మన పవన్‌ కల్యాణ్ గారు చాలా దెబ్బలు కొట్టారు. ఒకరోజు కుళ్లిన రాజకీయాలు అనే బండరాయి బద్దలయ్యే రోజు వస్తుంది. నాలుగేళ్లలో జనసేన అధికారంలోకి వస్తుంది” అన్నారు.