Homeజాతీయ వార్తలుRam Mandir: అయోధ్య రాముడి ప్రాణప్రతిష్టకు ముస్లిం కుటుంబం పూలు.. తోట యజమాని మతసామరస్యం

Ram Mandir: అయోధ్య రాముడి ప్రాణప్రతిష్టకు ముస్లిం కుటుంబం పూలు.. తోట యజమాని మతసామరస్యం

Ram Mandir: శ్రీరాముడు నడయాడిన నేలలో నాడు రాముని పట్టాభిషేకమంత వైభవంగా అయోధ్యలో నిర్మించిన రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్టకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముహూర్తం దగ్గర పడుతుండడంతో అయోధ్య అంతా రామమయంగా మారుతోంది. దేశమంతా రామనామ స్మరణతో మార్మోగుతోంది. ఈ క్రమంలో ప్రాణప్రతిష్ట ఉత్సవాలు మంగళవారం(జనవరి 16)నుంచి ప్రారంభమయ్యాయి. అయోధ్యలోని హనుమాన్‌ ఆలయాల్లో సుందరకాండ పారాయణం జరుగుతోంది.

రామునికి అనిస్‌ పూలు..
ఇక బాలరాముడి ప్రాణప్రతిష్ట రోజు రాముడికి అవసరమైన పూలు అందించేందుకు ఓ ముస్లిం ముందుకు వచ్చాడు. అయోధ్యలో భారీ పూలతోట ఉన్న మహ్మద్‌ అనిస్ శ్రీరాముని పూజకు అవసరమైన పూలు ఉచితంగా ఇస్తానని ప్రకటించారు. తనకు అవకాశం కల్పించిన రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌కు అనిస్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉండడగా ఐదు తరాలుగా అనిస్‌ కుటుంబం రామ్‌లల్లా, హనుమాన్ గర్హి, అయోధ్యలోని ఇతర ఆలయాలకు పూలు అందిస్తోంది.

మతసామరస్యంతో..
అయోధ్యంలో హిందువులు, ముస్లింలు మతసామరస్యంగా ఉంటామని అనిస్‌ తెలిపారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని పేర్కొన్నాడు. రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట రోజు తన తోటలోని గులాబీలను శ్రీరామునికి సమర్పించడం సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. అయోధ్య భక్తిని చాటి.. ఐక్యతను ప్రదర్శిస్తుందని వెల్లడించాడు.

18న సెక్యూరిటీ రిహార్సల్స్‌..
ఇదిలా ఉండగా, అయోధ్యలో ఈనెల 22న నిర్వహించే రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సుమారు 7 వేల మంది వరకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో భద్రత పరంగా ఎలాంటి లోపాలు తలెత్తకుండా కేంద్ర, రాష్ట్ర భద్రతా బలగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. ఈమేరకు జనవరి 18న ఒకసారి సెక్యూరిటీ రిహార్సల్స్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రతా పరంగా ఎలాంటి వైఫల్యం లేకుండా కమాండోలు పహారా కాస్తున్నారు. ఇప్పటికే అయోధ్య నగరం పోలీసుల నిఘా నీడలోకి వెళ్లిపోయింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
Oktelugu Epaper
Exit mobile version