Homeజాతీయ వార్తలులోకేష్ పై వాలింటీర్ ని పెట్టి గెలిపిస్తా

లోకేష్ పై వాలింటీర్ ని పెట్టి గెలిపిస్తా

వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ మరోమారు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్ లపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు పీఎం మోదీకి ఫోన్ ట్యాపింగ్ గురించి లేఖ రాశారని ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఏవైనా ఆధారాలు ఉంటే చూపించాలని అన్నారు. చంద్రబాబు హైదరాబాద్ లో కూర్చుని పీఎంకు, సీఎస్ కు లేఖలు రాస్తున్నారని ఆయన దివాళా తీసిన తెలుగుదేశం పార్టీకి అధ్యక్షులు అని అన్నారు.

Also Read : నారా లోకేష్.. గెలుపు పొందేవరకు అలుపు లేదట!

కొన్ని పత్రిల్లో వచ్చిన కథనాల ఆధారంగా చంద్రబాబు లేఖ రాశారని… సీఎం జగన్ ఇళ్ల పట్టాల పంపిణీని చంద్రబాబు అడ్డుకుంటున్నారని చెప్పారు. 30 లక్షల మంది మహిళల జీవితాల్లో నిప్పులు పోసిన చంద్రబాబు అవినీతి సంఘానికి అధ్యక్షుడు అని అన్నారు. జగన్ చేసే కార్యక్రమాలను కోర్టుకు వెళ్లి శిఖండిలా చంద్రబాబు అడ్డుకున్నారని చెప్పారు. నరకాసురుడిలా చంద్రబాబు అడ్డు పడినా ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి తీరతామని అన్నారు.

చంద్రబాబు స్కాం బాబు అని చినబాబు సూట్ కేసు బాబు అని వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. కరోనా సమయంలో సైతం చంద్రబాబు, లోకేష్ హైదరాబాద్ వదిలి బయటకు రాకుండా అక్కడి నుంచే జూమ్ మీటింగుల్లో పాల్గొంటున్నారని అన్నారు. గ్రామ, వార్డ్ వాలంటీర్ వ్యవస్థపై లోక జ్ఞానం లేని లోకేష్ విమర్శలు చేస్తున్నాడని… అ, ఆలు కూడా రాని లోకేష్ ను చంద్రబాబు మంత్రిని చేశారని చెప్పారు.

వార్డ్ మెంబర్ గా కూడా గెలవలేని లోకేష్ పై వాలంటీర్ ను పోటీగా నిలబెట్టి గెలిపిస్తామని చెప్పారు. లోకేష్ కనీసం వార్డ్ మెంబర్ గా కూడా గెలవలేరని విమర్శలు చేశారు. జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

Also Read : అత్యుత్సాహంతో జగన్ ను ఇరుకున పెట్టేసిన వల్లభనేని వంశీ..!

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Exit mobile version