Homeఆంధ్రప్రదేశ్‌Nara Lokesh- Nadendla Manohar: తండ్రులను గుర్తుచేసిన లోకేష్, నాదెండ్ల మనోహర్.. ఫొటో వైరల్

Nara Lokesh- Nadendla Manohar: తండ్రులను గుర్తుచేసిన లోకేష్, నాదెండ్ల మనోహర్.. ఫొటో వైరల్

Nara Lokesh- Nadendla Manohar: గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఓ ఫోటో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇద్దరు నేతలు కలిసి కరచలనం చేసిన ఫోటో ఒకటి ఆకట్టుకుంటుంది. ఆ నేతల వారసులు అంటూ వైసిపి సోషల్ మీడియా వింత ప్రచారానికి తెరతీసింది. ఇంతకీ ఆ నేతలు ఎవరంటే అందరికీ సుపరిచితులే. ఆ ఇద్దరూ మాజీ సీఎంల కుమారులే.

ఇటీవల టిడిపి, జనసేన సమన్వయ కమిటీల సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీతో పొత్తు అనంతరం నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో జనసేన సమన్వయ కమిటీని ప్రకటించింది. అటు తెలుగుదేశం పార్టీ సైతం సీనియర్ నేతలతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. తొలిసారిగా పవన్, లోకేష్ ల ఆధ్వర్యంలో రాజమండ్రిలో రెండు పార్టీల సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. తాజాగా మరోసారి విజయవాడలో రెండు సమన్వయ కమిటీల సంయుక్త సమావేశం ఏర్పాటు చేశారు. కానీ ఈసారి పవన్ హాజరు కాలేదు. జనసేన తరుపున నాదెండ్ల మనోహర్ లీడ్ తీసుకున్నారు. లోకేష్ సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆ ఇద్దరు నేతలు కరచలనం చేశారు. ఆ ఇద్దరూ మాజీ ముఖ్యమంత్రుల కుమారులు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే వీరిద్దరి తండ్రులు ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన వారేనంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం అవుతోంది. వైసీపీ శ్రేణులు ట్రోల్ చేస్తున్నాయి.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు ఆ పార్టీలో చేరారు. ఎన్టీఆర్కు అన్ని విధాలా సహకారం అందించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో నమ్మకంతో కొన్ని బాధ్యతలను ఎన్టీఆర్ నాదెండ్ల భాస్కరరావుకు అప్పగించారు. ఈ తరుణంలోనే టిడిపి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో… ఎన్టీఆర్ విదేశాల్లో ఉండగా.. నాదెండ్ల భాస్కరరావు పార్టీని హస్తగతం చేసుకున్నారు. ఎన్టీఆర్ పై తిరుగుబాటుబావుట ఎగురవేశారు. అయితే ఈ కుట్రను ఎన్టీఆర్ ఛేదించారు. పార్టీని తిరిగి పొందగలిగారు. నాదేండ్ల ఎపిసోడ్ తర్వాత 1995 ఆగస్టులో మరో సంక్షోభం ఎదురైంది. చంద్రబాబు రూపంలో ఎన్టీఆర్ కు జలక్ తగిలింది. పార్టీ శ్రేణులతో తిరుగుబాటు బావుట ఎగరవేసిన చంద్రబాబు ఎన్టీఆర్ నుంచి టిడిపిని హస్తగతం చేసుకోగలిగారు. ఈ రాష్ట్రానికి సీఎం కాగలిగారు. అయితే ఈ పరిణామంతో కొద్ది రోజులకే ఎన్టీఆర్ మృతి చెందారు.

తాజాగా నాదెండ్ల మనోహర్, లోకేష్ కలయికలతో వైసీపీ తన చేతికి పని చెప్పింది. తండ్రులు ఇద్దరు అలా.. కుమారులు ఇద్దరు ఇలా.. అంటూ సెటైరికల్ గా ఫోటో జత చేస్తూ తెగ ప్రచారం చేస్తోంది. ఎన్టీఆర్ కి ఎదురైన పరిణామాలు గుర్తుకు తెచ్చేలా సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతుంది. ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరల్ గా మారింది. నెటిజెన్లు విభిన్నంగా కామెంట్స్ పెడుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version