Telangana Congress : తెలంగాణలో కాంగ్రెస్ కు ఎందుకు ఓటెయ్యాలో ఒక్క కారణం చెబుతారా?

తెలంగాణలో కాంగ్రెస్ కు ఎందుకు ఓటెయ్యాలో ఒక్క కారణం చెబుతారా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : November 11, 2023 6:20 pm

Telangana Congress : తెలంగాణలో కాంగ్రెస్ గెలవాలని సోషల్ మీడియా బలంగా కోరుకుంటున్నట్టు కనిపిస్తోంది. కేసీఆర్ వ్యతిరేకుల్లో కూడా ఎక్కువమంది కోరుకుంటున్నారు. ఎందుకు కాంగ్రెస్ కు ఓటేయాలో ఒక్క కారణం చెప్పగలరా? 1200 బలిదానాలు తీసుకొని తెలంగాణను కాంగ్రెస్ ఇచ్చింది. ఎందుకంటే కాంగ్రెస్ లక్షణం అదీ.. తెలంగాణ సాయుధ పోరాటంలో ఎంతోమంది చనిపోయారు. ఆర్య సమాజ్, సహా కమ్యూనిస్టులు ఎంతో మంది పోరాడి సాధించుకున్నారు.

అప్పటి వరకూ నిజాం సంస్థానంలో జాగీర్దార్లుగా, పట్వారీలుగా ఉన్న వారంతా నిజాం హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అయ్యాక కాంగ్రెస్ ఖద్దరు టోపీలు ధరించి నాయకులుగా రూపాంతరం చెందారు. చరిత్రలో ఇది మర్చిపోగలమా? కాంగ్రెస్ లక్షణమే అదీ.. తెలంగాణ ఉద్యమంలో ఇంత మంది బలిదానం అయ్యాక మేమే ఇచ్చామని కాంగ్రెస్ నేతలు చంకలు గుద్దుకుంటున్నారు.

సోనియానే తెలంగాణ ఇచ్చింది అనుకుందాం.. మరి సోనియా తెలంగాణకు వచ్చి ముఖ్యమంత్రి కాగలదా? కనీసం సోనియా తరుఫు వాళ్లు కేంద్రంలో ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందా? ఇప్పుడున్న దాని ప్రకారం చూస్తే రేవంత్ రెడ్డినే కాంగ్రెస్ కు ఓటు వేస్తే ముఖ్యమంత్రి అవుతారు. ఆయన 50 లక్షలు లంచం ఇచ్చి ఎమ్మెల్యేలను కొంటూ అడ్డంగా దొరికిపోయాడు. ఆయన మాటల్లో.. చేతల్లో ఎంతటి అహంకారం చూస్తున్నాం.. స్టేజీ మీద నుంచి జనాలను కాలితో తన్నుతున్నాడు. రెడ్డిలే అర్హులు అన్న దానికి ఇవ్వాలా?

తెలంగాణలో కాంగ్రెస్ కు ఎందుకు ఓటెయ్యాలో ఒక్క కారణం చెబుతారా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.