పిల్లలకు ఉరివేసి.. తాను ఉరేసుకుని..

కర్నూల్‌ జిల్లాలో కరెంట్‌ షాక్‌తో తల్లి, ఇద్దరు చిన్నారులు శనివారం చనిపోయినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ.. అది ప్రమాదం వల్ల జరిగిన దుర్ఘటన కాదని.. కావాలని చేసిందేనని విచారణలో వెల్లడైంది. ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉండటానికి ఇష్టంలేని తల్లే ఈ ఘాతానికి పాల్పడినట్టు విచారణలో తేలింది. తాను చనిపోతే పిల్లలు అనాథలవుతారని… వారిని చంపి ఆమెకు కూడా ఆత్మహత్యకు పాల్పడింది. Also Read: లంబసింగికి పోయొద్దామా.. హాలహర్వి మండలం గూళ్యం గ్రామానికి చెందిన సతీష్‌కు కర్ణాటకలోని సండూరుకు […]

Written By: Srinivas, Updated On : December 20, 2020 10:18 am
Follow us on


కర్నూల్‌ జిల్లాలో కరెంట్‌ షాక్‌తో తల్లి, ఇద్దరు చిన్నారులు శనివారం చనిపోయినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ.. అది ప్రమాదం వల్ల జరిగిన దుర్ఘటన కాదని.. కావాలని చేసిందేనని విచారణలో వెల్లడైంది. ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉండటానికి ఇష్టంలేని తల్లే ఈ ఘాతానికి పాల్పడినట్టు విచారణలో తేలింది. తాను చనిపోతే పిల్లలు అనాథలవుతారని… వారిని చంపి ఆమెకు కూడా ఆత్మహత్యకు పాల్పడింది.

Also Read: లంబసింగికి పోయొద్దామా..

హాలహర్వి మండలం గూళ్యం గ్రామానికి చెందిన సతీష్‌కు కర్ణాటకలోని సండూరుకు చెందిన సవిత (35)తో వివాహమైంది. సతీష్‌ ఉమ్మడి కుటుంబంలో ఉంటూ గ్రామంలోనే కిరాణ దుకాణం నడుపుతున్నారు. వీరికి ఇద్దరు కుమారులు నిశ్చల్‌ (9), వెంకటసాయి (6) ఉన్నారు. ఉమ్మడి కుటుంబంలో ఉండటం ఇష్టం లేదని వేరుకాపురం పెట్టాలని ఎన్నోసార్లు సవిత భర్తతో గొడవ పడింది. దీనికి సతీష్‌ ఒప్పుకోలేదు. ఉమ్మడి కుటుంబంతోనే కలిసుండాలంటూ ఆమె మాటను తిరస్కరించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సవిత శనివారం తన ఇద్దరు కుమారులకు ఉరివేసి, అనంతరం తానూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సవిత, పిల్లలు విద్యుదాఘాతంతో చనిపోయినట్లు తొలుత కుటుంబసభ్యులు చెప్పారు. అయితే.. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Also Read: మూడు రాజధానులపై వైసీపీ యూటర్న్‌ తీసుకోబోతోందా..?

శీతాకాలం కావడంతో సవిత రోజూ మాదిరిగానే శనివారం ఉదయం నీళ్లు వేడియచేయడానికి బకెట్‌ నీటిలో వాటర్ హీటర్‌ పెట్టిందని, అవి వేడెక్కాయా, లేదా అనే విషయం పరిశీలించడానికి ప్రయత్నించడంతో ప్రమాదవశాత్తు చేయి వాటర్‌ హీటర్‌కు తగిలిందని కుటుంబం తొలుత చెప్పింది. హీటర్‌కు చేయి తగలడంతో కవిత కరెంట్ షాక్‌కు గురైందని, ఒక్కసారిగా అరవడంతో పక్కనే ఉన్న చిన్నారులు నిశ్చల్‌ కుమార్‌ (11), వెంకటసాయి (8) తల్లి వద్దకు పరుగెత్తుకొచ్చి ఆమెను పట్టుకున్నారని చెప్పారు. దీంతో ముగ్గురూ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారని తెలిపారు. అయితే, పోలీసుల విచారణలో మాత్రం ఆత్మహత్యగా తేలింది. వేరే కాపురం పెట్టాలని అడిగినందుకు.. భర్త విననందుకు తనతోపాటు తన పిల్లలనూ బలి చేయడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్