రుణమాఫీ సొమ్ముపై మరో కీలక నిర్ణయం!

తెలంగాణలోని రైతాంగాన్ని ఆదుకోవడానికి రూ.25 వేల లోపు ఉన్న రుణాలను ఒకేసారి మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నగదును నిన్న ఆర్థిక శాఖ విడుదల చేసింది. రుణమాఫీ సొమ్మును రైతులకు చెక్కుల రూపంలో అందించాలని ప్రభుత్వం ముందుగా భావించింది. కానీ.. ప్రస్తుతం లాక్‌ డౌన్‌ నేపథ్యంలో రైతుల ఖాతాల్లోకే డబ్బులను నేరుగా బదిలీ చేయాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు. రైతుల సంక్షేమానికి టిఆర్ఎస్ […]

Written By: Neelambaram, Updated On : May 8, 2020 3:22 pm
Follow us on

తెలంగాణలోని రైతాంగాన్ని ఆదుకోవడానికి రూ.25 వేల లోపు ఉన్న రుణాలను ఒకేసారి మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నగదును నిన్న ఆర్థిక శాఖ విడుదల చేసింది. రుణమాఫీ సొమ్మును రైతులకు చెక్కుల రూపంలో అందించాలని ప్రభుత్వం ముందుగా భావించింది. కానీ.. ప్రస్తుతం లాక్‌ డౌన్‌ నేపథ్యంలో రైతుల ఖాతాల్లోకే డబ్బులను నేరుగా బదిలీ చేయాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు. రైతుల సంక్షేమానికి టిఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన ట్వీట్‌ చేశారు. రైతు రుణమాఫీకి రూ.1200 కోట్ల విడుదలకు సీఎం కేసీఆర్‌ ఆదేశించిన నేపథ్యంలో రైతు రుణమాఫీ కింద 5.50 లక్షల మంది లబ్ధి పొందుతారని పేర్కొన్నారు. వానాకాలం రైతుబంధుకు కూడా రూ. 7 వేల కోట్ల విడుదల చేయడంతో ఈ పథకం కింద 57 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. రైతుల ఖాతాల్లో రెండు, మూడు రోజుల్లో నగదు జమ కానుందని కేటీఆర్‌ తెలిపారు.