అష్ట దిగ్బంధంలో 3 జిల్లాలు! ఎందుకంటే..

తెలంగాణాలో మూడు జిల్లాలు అష్ట దిగ్బంధంలో ఉన్నాయి. ఆ జిల్లాల నుండి ఎవరు బయటకు రాకూడదు, బయటి జిల్లాల వారు కూడా ఆ జిల్లాలోకి వెళ్ళడానికి అనుమతి ఇవ్వడం లేదు. మిగతా జిల్లాలతో పోల్చినప్పుడు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ అత్యంత ప్రమాదకారిగా మారినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ జిల్లాలను రెడ్‌ జోన్లుగా ప్రకటించారు. అందువల్ల ఆ జిల్లాల్లో ఇతరులు వెళ్లరాదని ఆయన విజ్ఞప్తి చేశారు. పైగా, ఈ జిల్లాల్లో సమూహ వ్యాప్తి (కమ్యూనిటీ స్ప్రెడ్) […]

Written By: Neelambaram, Updated On : May 8, 2020 1:57 pm
Follow us on


తెలంగాణాలో మూడు జిల్లాలు అష్ట దిగ్బంధంలో ఉన్నాయి. ఆ జిల్లాల నుండి ఎవరు బయటకు రాకూడదు, బయటి జిల్లాల వారు కూడా ఆ జిల్లాలోకి వెళ్ళడానికి అనుమతి ఇవ్వడం లేదు. మిగతా జిల్లాలతో పోల్చినప్పుడు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ అత్యంత ప్రమాదకారిగా మారినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ జిల్లాలను రెడ్‌ జోన్లుగా ప్రకటించారు. అందువల్ల ఆ జిల్లాల్లో ఇతరులు వెళ్లరాదని ఆయన విజ్ఞప్తి చేశారు. పైగా, ఈ జిల్లాల్లో సమూహ వ్యాప్తి (కమ్యూనిటీ స్ప్రెడ్) జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

తెలంగాణాలో ఇప్పటివరకు నమోదైన మొత్తం 1122 కేసుల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ ప్రాంతాల్లోనే ఏకంగా 741 కరోనా కేసులు నమోదయ్యాయి. చనిపోయిన వారి సంఖ్య 29 కాగా అందులో 25 మంది ఈ మూడు జిల్లాలకే చెందిన వారు కావడం గమనార్హం. అందువల్ల మూడు జిల్లాల్లో కఠినమైన ఆంక్షలు విధించినట్టు సీఎం తెలిపారు.

రాష్ట్రంలో కరోనా వైరస్ జోరుకు బ్రేకులు పడ్డాయని చెప్పొచ్చు. గత కొన్ని రోజులుగా అతి తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్రంలో మద్యం షాపులు కూడా తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. కేంద్రం మార్గదర్శకాల మేరకు తెలంగాణాలో అన్ని సంస్థలు, కార్యాలయాలు పని చేయనున్నాయి.