Kodali Nani: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో సంభవించిన మరణాలపై అసెంబ్లీ వేదికగా పెద్ద దుమారమే రేగుతోంది. నాటుసారా తాగడం వల్లే మృత్యువాత పడ్డారని టీడీపీ సభ్యులు ఆందోళన చేయడంతో వైసీపీ సభ్యులు తిప్పికొడుతున్నారు. టీడీపీ విధానాల వల్లే రాష్ట్రం అధోగతి పాలైందని ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై రెండు వర్గాలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఇక వ్యక్తిగత విమర్శలకు దారి తీస్తోంది. చంద్రబాబు హయాంలో తీసుకొచ్చిన మద్యం బ్రాండ్లతోనే నష్టం జరుగుతోందని ఎదురుదాడి చేస్తోంది.

దీనిపై పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు. వారి హయాంలో 240 మద్యం బ్రాండ్లకు అనుమతి ఇవ్వడంతో ప్రజలు ఎంత నష్టాలు పడ్డారో తెలిసిందేనన్నారు. తెలుగుదేశం పార్టీ చెబుతున్నవన్ని అబద్దాలేనని జీవోలు సైతం రుజువు చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఇందుకు తగిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో మద్యం వ్యవహారం రెండు పార్టీల్లో రాజకీయ యుద్ధానికి కారణమవుతోంది.
Also Read: KCR Politics: ఆ వ్యతిరేక ముద్ర పోగొట్టుకునేందుకు కేసీఆర్ మరో ప్లాన్
వైసీపీ నేతలు వ్యక్తిగత విమర్శలకు సైతం దిగుతున్నారు. దీంతో రాజకీయం ఎటు వైపు తిరుగుతుందో తెలియడం లేదు. సారా వ్యవహారంలో మొదలైన వివాదం ప్రస్తుతం తారా స్థాయికి చేరింది. టీడీపీ పొత్తుల కోసం దారలు తెరుస్తున్నా ఏ పార్టీ కూడా దానికి సహకరించట్లేదని తెలుస్తోందన్నారు. అందుకే రాబోయే రోజుల్లో టీడీపీ సర్వనాశనం కావడం ఖాయమేనని జోస్యం చెప్పారు. నేతల మధ్య వైరం ఇంకా ఎంత దూరం వెళుతుందో తెలియడం లేదు.

చంద్రబాబును నమ్ముకుని కార్యకర్తలు నట్టేట మునిగారని ఆరోపిస్తున్నారు. తమ తప్పులను చూపిస్తూ ఇంకా తప్పు చేస్తున్నారని మండిపడుతున్నారు. మొత్తానికి నాటుసారా వ్యవహారం శాసనసభను కుదిపేసింది. టీడీపీ సభ్యులపై వైసీపీ నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. పరస్పర దూషణలకు దిగుతున్నారు. ఇది ఎందాక వెళ్తుందో తెలియడం లేదు. రెండు పార్టీల మధ్య వివాదం ఇంకా పెరుగుతోంది. నాటుసారా విషయం ప్రస్తుతం రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోంది.
Also Read: పోలవరం కాంట్రాక్టర్ వర్సెస్ ఇసుక కాంట్రాక్టర్.. సీఎం జగన్ దగ్గర పంచాయితీ
[…] India Russia Relations: ఆవులు ఆవులు తన్నుకుంటూ దూడల కాళ్లు విరిగినట్లుగా ఉంది వ్యవహారం. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు భారత్ మెడకు చుట్టుకుంటోంది. విడుమంటే పాముకు కోపం మింగుమంటే కప్పకు కోపం అన్నట్లుగా మారింది ఇండియా పరిస్థితి. ఉక్రెయిన్ విషయంలో భారత్ రష్యాను ఎందుకు నిలదీయడం లేదని అమెరికా వాదిస్తోంది. ఇలాగైతే కష్టమని హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో ఇండియా వ్యవహరిస్తున్న తటస్థ వైఖరి ఇప్పుడు ప్రమాదకరంగా మారనుంది. […]
[…] Electricity Charges Hike: మోడీ సార్ యేనా పెంచేది.. ఏ నేను పెంచలేనా? అని అనుకున్నాడేమో కానీ కేసీఆర్ సార్ కూడా బాదుడు మొదలుపెట్టేశాడు. కానీ కొంచెం తెలివిగా ప్రజలకు ‘షాక్’ ఇవ్వబోతున్నాడు. తగ్గేదేలే అంటూనే పెంచేస్తున్నాడు. తెలంగాణ ప్రజలకు షాక్ ఇచ్చేందుకు కేసీఆర్ రెడీ అయ్యారు. రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంచేందుకు రంగం సిద్ధం చేశారు. చార్జీల పెంపుపై కొంతకాలంగా కసరత్తు జరుగుతోంది. తాజాగా విద్యుత్ చార్జీల పెంపునకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) పచ్చజెండా ఊపింది. విద్యుత్ చార్జీలను 14 శాతం పెంచేందుకు టీఎస్ ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డొమెస్టిక్ విద్యుత్ యూనిట్పై 40 నుంచి 50 పైసలు పెంచారు. ఇక ఇతర కేటగిరీలపై యూనిట్కు రూపాయి పెంచారు. చార్జీలను 19 శాతం పెంచుకునేందుకు వీలు కల్పించాలని ఈఆర్సీకి డిస్కంలు విజ్ఞప్తి చేశాయి. అయితే చార్జీలను 14 శాతం మేర పెంచుకునేందుకు ఈఆర్సీ అనుమతి ఇచ్చింది. దాదాపు ఏడేళ్ల తర్వాత విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు ఇచ్చాయి. చార్జీల పెంపుతో డిస్కంలకు రూ.6,831 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈ భారమంతా ప్రజలపైనే పడనుంది. […]
[…] Funny Moments In Wedding: కాపురం చేసే కళ కాలు తొక్కేనాడే తెలుస్తుంటారు. వివాహానికి ఉన్న బంధం అలాంటిది. నూరేళ్లు కలిసి జీవించే జంట అయినందునే పెళ్లి వేడుక ఓ ఉత్సవంలా నిర్వహిస్తారు. బంధుమిత్రుల కలయికతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారు. ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాల ప్రభావంతో వివాహ వేడుక కొత్త పుంతలు తొక్కుతోంది. క్షణాల్లో పెళ్లి తంతు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతూ లక్షల లైకులు, కోట్ల పోస్టులతో దూసుకుపోతున్నాయి. వేప కాయంత వెర్రి వేయి రకాలుంటుందంటారు. అందులో భాగంగానే పుర్రెకో గుణం జిహ్వకో రుచి అంటారు. […]