Homeజాతీయ వార్తలురూటు మార్చిన కేసీఆర్.. పల్లెలకు ప్రకటించనున్న వరాలు?

రూటు మార్చిన కేసీఆర్.. పల్లెలకు ప్రకటించనున్న వరాలు?

KCRసీఎం కేసీఆర్ రూటు మర్చారు. పల్లె ప్రగతిపై దృష్టి సారించారు. ఇప్పటికే పల్లెప్రగతి అభివృద్ధిపై స్వయంగా తనిఖీ చేస్తానని చెప్పిన సీఎం గ్రామాల దత్తత తీసుకునేందుకు ముందుకు కదులుతున్నారు. తెలంగాణలో కేసీఆర్ వ్యూహాలు మారుతున్నాయి. ప్రతి అడుగులో రాజకీయం ముడిపడి ఉంటోంది. ఆయన దృష్టి యాదాద్రి జిల్లాలోని వాసాలమర్రి అనే గ్రామాన్ని ఎంచుకున్నారు.

గ్రామసర్పంచ్ కు ఫోన్ చేసి దావత్ చేసుకుందామని స్థలం చూడాలని సూచించారు. ఆ ఫోన్ సంభాషణ మీడియాకు అందేలా చేశారు. యాదాద్రి జిల్లాలోని తుర్కపల్లి వాసాలమర్రి గ్రామానికి ఈనెల 22న వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. గ్రామ అభివృద్ధిపై ప్రజలతో చర్చించి అక్కడే గ్రామస్తులతో కలిసి భోజనం చేయాలని సంకల్పించారు.

ఆ గ్రామాన్నిదత్తత తీసుకోవాలని గతంలో ప్రకటించారు. తరువాత మరిచిపోయారు. ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నికలో మరే కారణమో కాని గ్రామాన్నిదత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. దీంతో వాసాలమర్రి గ్రామ రూపురేఖలు మారనున్నాయని గ్రామస్తులు అభిలషిస్తున్నారు.

ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా గ్రామాలపై వందల కోట్ల వరాలు ప్రకటిస్తున్నారు. వాటి అమలుపై పట్టించుకోవడం లేదు. దీనిపై ఎవరు స్పందించడం లేదు. ప్రాజెక్టుల విషయంలో, గిరిజనుల పోడు భూముల విషయంపై తానే జిల్లాలు తిరిగి పరిష్కరిస్తానని చెప్పుకుంటుంటారు. వాసాలమర్రికి ఎన్ని వరాలు ప్రకటిస్తారో వేచి చూడాల్సిందే.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version