spot_img
Homeజాతీయ వార్తలుKaleshwaram: మళ్లీ కాళేశ్వరం ఎత్తిపోతలు షురూ..

Kaleshwaram: మళ్లీ కాళేశ్వరం ఎత్తిపోతలు షురూ..

Kaleshwaram: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్‌ మండలం కాలేశ్వరం ప్రాజెక్టు పరిధి లక్ష్మి పంపు హౌస్‌లో గోదావరి నీటి ఎత్తిపోతలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఇంజినీఇంగ్‌ అధికారులు మధ్యాన్నం 12:30 గంటల ప్రాంతంలో మూడు మోటార్లు ఆ¯Œ చేసి నీటి లిఫ్టింగ్‌ ప్రారంభాంచారు. దాదాపు ఏడాది తర్వాత ఎత్తిపతలను పునఃప్రారంభించారు.

-బ్యారేజీలు ఖాళీ కావడంతో..
కాళేశ్వరం ప్రాజెక్టు పురిధిలోని సర్వతి, గాయత్రి, ఎల్లంపల్లి బ్యారేజీలు పూర్తి స్థాయిలో ఖాళీ అయ్యాయి. మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ను గత ఫిబ్రవరిలో సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. 50 టీఎంసీల నీటి సామర్థ్యం గల ఈ బ్యాంరేజీలో ఈ ఏడాది 30 టీఎంసీల నీటిని నింపాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒకేసారీ పూర్తిస్థాయిలో నీటిని నింపితే సీపేజీ కారణంగతా రిజర్వాయర్‌ కట్టపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గతేడాది గోదావరి నదిలో వరద రూపంలో చేరిన నీటిని లిఫ్ట్‌ చేస్తూ.. మల్లన్నసాగర్‌కు తరలిస్తున్నారు. ప్రస్తుతం మల్లన్న సాగర్‌లో నిర్దేశిత మేరకు నీటి మట్టం చేరుకోలేదు. ఈ క్రమంలో కాలేశ్వరం పరిధిలోని కొండపోచమ్మ, శ్రీరాజరాజేశ్వర మధ్యమానేరు ప్రాజెక్టు, ఎల్లంపల్లి బ్యారేజీ, గాయత్రి, సరస్వతి రిజర్వాయర్లు ఖాళీ అయ్యాయి. ఎల్లంపల్లి రిజర్వాయర్లో ప్రస్తుతం నీటిమట్టం కనీస స్థాయికి పడిపోయింది. మిడ్‌మానేరుకు ఎస్సారెస్పీ నుంచి వరద కాలువ ద్వారా నీరు రావడం లేదు. ఈ నేపథ్యంలో మిడ్‌మానేరు నుంచి కొండపోచమ్మకు నీటిని తరలించేందుకు కాళేశ్వరం ఎత్తిపోతలను మళ్లీ ప్రారంభించారు. లక్ష్మీ బ్యారేజి నుంచి లిఫ్ట్‌ చేసిన నీటిని ఎల్లంపల్లి, మధ్యమానేరు మీదుగా కొండపోచమ్మకు తరలించనున్నారు. అక్కడి నుంచి మళ్లన్న సాగర్‌కు లిఫ్ట్‌ చేస్తారు.

-మల్లన్నసాగర్‌ కోసమే..
ప్రస్తుతం యాసంగి పంటలు చివరి దశకు చేరుకున్నాయి. నీటి వినియోగం క్రమంగా తగ్గుతోంది. అయినప్పటికీ ప్రభుత్వం కాళేశ్వరం ఎత్తిపోతలను పునఃప్రారంభించింది. కేవలం మల్లన్న సాగర్‌ను నింపేందుకే ఎత్తిపోతలు ప్రారంభించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాళేశ్వరం లిఫ్ట్‌ ద్వారా విద్యుత్‌ బిల్లు ప్రభుత్వానికి భారంగా మారుతోంది. గతేడాది వేసవిలో లిఫ్ట్‌ చేసిన గోదావరి నీటిని మొత్తం వర్షాకాలంలో వచ్చిన వరదలకు దిగువకు వదిలారు. దీంతో విద్యుత్‌ ఖర్చులు వృథా అయ్యాయి. గత అనుభవాల నేపథ్యంలో మళ్లీ నీటిని లిఫ్ట్‌ చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది మల్లన్నసాగర్‌ను నింపుకునేందుకే కాళేశ్వరం ఎత్తిపోతలు పునఃప్రారంభించారని కొంతమంది అభిప్రాయపడుతుండగా.. మరికొందరు నీటిని లిఫ్ట్‌ చేయడం ద్వారా చేతికి వచ్చిన పంటలు మళ్లీ నీటమునుగుతాయని, వరి కోతలకు ఇబ్బంది అవుతుందని పేర్కొంటున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Naga Chaitanya

Naga Chaitanya: పెళ్ళైన రెండేళ్ల తర్వాత నాగచైతన్య సంచలన పోస్ట్.. ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు..

Naga Chaitanya: అక్కినేని నాగచైతన్య , శోభిత జంట పెళ్లి చేసుకొని అప్పుడే రెండేళ్లు కావొస్తుంది. నిన్న గాక మొన్ననే వీళ్ళు పెళ్లి చేసుకున్నట్టు అనిపిస్తోంది కదూ , కాలం ఎంత వేగంగా...
Hardik Pandya

Hardik Pandya: నిండా మునిగాక హార్దిక్ కు క్రికెట్ గుర్తుకొచ్చింది..

Hardik Pandya: మనం ఎంతటి గొప్ప స్థానాలకు వెళ్లినా సరే దానికి కారణమైన మూలాన్ని అస్సలు వదిలిపెట్టకూడదు. పైగా దానిని ఏమాత్రం విస్మరించకూడదు. కొమ్ములు వచ్చాయి కదా అని చెవులను విస్మరిస్తే మొదటికే...
Team India

Team India: బంగారు పళ్లెంలో పెట్టి ఇస్తే కిందపడేసుకున్నారు.. ఈ నలుగురి కెరియర్ గోదారిలో కలిసినట్టే..

Team India: టీమిండియాలో చోటు లభించడమే చాలా కష్టం. పైగా ఒక స్థానానికి చాలామంది పోటీ పడుతున్నారు. ఈ ఫార్మాట్ అయినా సరే పోటీ అత్యంత ఎక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో...
AP Rain Forecast

AP Rain Forecast: మళ్లీ నైరుతి.. ఏపీకి చల్లటి కబురు!

AP Rain Forecast: రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎల్ నినో ప్రభావం స్పష్టంగా ఉంది. గత ఏడాదికంటే సాధారణ వర్షపాతం తక్కువగానే నమోదయింది.. జూన్లో లోటు కనిపించింది. జూలైలో సైతం కొనసాగింది....
Oktelugu Epaper