టీడీపీ మంత్రులు వైసీపీ ప్రభుత్వం వేటాడేస్తోంది. ఇప్పటికే టీడీపీ హయాంలో మంత్రులుగా చేసిన అచ్చెన్న సహా జేసీ ప్రభాకర్ రెడ్డిలను అరెస్ట్ చేసిన జగన్ సర్కార్ తాజాగా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావ్ కు షాకిచ్చింది.
Also Read: బహిర్గతమైన టీడీపీ దశ్చర్య.. హవ్వా.. మరీ ఇంత ఘోరమా…?
బుధవారం రాత్రి తాజాగా కళా వెంకట్రావ్ తోపాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. విజయనగరం జిల్లా రామతీర్థం పర్యటనకు వెళ్లిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వాహనంపై రాళ్లు, చెప్పులతో దాడి చేసిన ఘటనలో భాగంగా పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా రాజాంలోని తన నివాసంలో ఉన్న మాజీ మంత్రి కళా వెంకట్రావ్ ను రాత్రి పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది. అరెస్ట్ చేసిన అనంతరం వెంకట్రావ్ ను చీపురుపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Also Read: ఏబీ వెంకటేశ్వరరావుకు జగన్ మరో షాక్?
గత నెల 29న రామతీర్థంలోని కోదండరాముడి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఈనెల 2న చంద్రబాబు , వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇద్దరూ ఒకేరోజు పర్యటనకు వెళ్లారు. విజయసాయిరెడ్డి పైకి రాళ్లు, చెప్పులు విసిరారు. తోపులాట ఘర్షణ చోటుచేసుకుంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. అందులో భాగంగానే తాజాగా కళా వెంకట్రావ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్