KA Paul: ఈ వీడియో చూస్తే ఇక ఎవరూ కేఏ పాల్ ను ‘కామెడీ పీస్’ అనరు?

KA Paul: కేఏ పాల్.. ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడిగా.. మత బోధకుడిగా ఉన్న ఈయన 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాజకీయాల్లోకి వచ్చి నాటి హాట్ రాజకీయాన్ని కాస్తా కామెడీ చేసేశారు. కేఏపాల్ చూడడానికి కామెడీ ఫేస్ లా ఉన్న ఆయన పరపతి బాగానే ఉందని మొన్న కేంద్రహోంమంత్రి అమిత్ షాతో భేటి తర్వాత అర్థమైంది. అమిత్ షాతో భేటి తర్వాత తాను జోబైడెన్ సహా ప్రపంచదేశాధినేతలను నియంత్రించగలనని.. అమిత్ షా సైతం తనకు ఫోన్ […]

Written By: NARESH, Updated On : May 28, 2022 4:24 pm
Follow us on

KA Paul: కేఏ పాల్.. ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడిగా.. మత బోధకుడిగా ఉన్న ఈయన 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాజకీయాల్లోకి వచ్చి నాటి హాట్ రాజకీయాన్ని కాస్తా కామెడీ చేసేశారు. కేఏపాల్ చూడడానికి కామెడీ ఫేస్ లా ఉన్న ఆయన పరపతి బాగానే ఉందని మొన్న కేంద్రహోంమంత్రి అమిత్ షాతో భేటి తర్వాత అర్థమైంది.

అమిత్ షాతో భేటి తర్వాత తాను జోబైడెన్ సహా ప్రపంచదేశాధినేతలను నియంత్రించగలనని.. అమిత్ షా సైతం తనకు ఫోన్ చేసి రమ్మని పిలిపించి మాట్లాడారని కేఏ పాల్ గొప్పలు చెప్పారు. కేఏపాల్ కు అంత పరపతి ఉందా? అని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా ఎద్దేవా చేశారు.

అయితే బీజేపీతో సాన్నిహిత్యంగా కేఏ పాల్ ఉండబోతున్నాడని అందరూ అనుకుంటున్న వేళ తాజాగా ఆ పార్టీకి గట్టి షాక్ ఇచ్చాడు కేఏ పాల్. ఇటీవల కరీంనగర్ లో నిర్వహించిన హిందూ ఏక్తా యాత్ర సందర్భంగా బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అన్ని మసీదులను తవ్వి చూద్దామని.. శవాలు వస్తే మీరు తీసుకోవాలని.. శివ లింగాలు వస్తే మేం తీసుకుంటామని ఎంఐఎం అధినేతకు సవాల్ చేయడం దుమారంరేపింది. ఈ తీవ్ర వ్యాఖ్యలు కలకలం రేపాయి.

ఈ వ్యాఖ్యలను కేఏపాల్ తీవ్రంగా తప్పుపట్టారు. బండి సంజయ్ ను ‘పిచ్చోళ్లలాగా మాట్లాడుతావా? అంత దమ్ముందా? పాత బస్తీలో తేల్చుకుందాం’ అంటూ సవాల్ చేశారు. పాతబస్తీలో ఎన్ని మసీదులు తవ్వుతావో తవ్వు అంటూ తొడగొట్టారు. ‘నువ్వు ఎవడివి? నీ లెవల్ ఏంటి? నిన్ను ఎలా నియమించారని’ బండిని కడిగేశారు.

హిందూ, ముస్లిం, క్రైస్తవుల మధ్య చిచ్చు పెడితే ఊరుకునేది లేదని ‘బండి సంజయ్’కు వార్నింగ్ ఇచ్చాడు. ప్రజలు నీకు గుండు గీస్తారని.. తాగేసి మాట్లాడుతున్నావా? కుక్కలా మొరుగుతున్నావ్ అంటూ కేఏపాల్ నిప్పులు చెరిగారు.స్టుప్పిడ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నావని.. ఇండియన్ లాంగ్వేజ్ ఇదేనా అంటూ ఫైర్ అయ్యారు.

బండి సంజయ్ పై తీవ్ర పదజాలంతో కేఏ పాల్ విరుచుకుపడ్డ తీరుపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమాజాన్ని విచ్ఛిన్నం చేసే.. మత ఘర్షణలకు తావిచ్చే బండి వ్యాఖ్యలపై ఎవరూ స్పందించకున్నా ధైర్యంగా ముందుకొచ్చి ఖండించి తూర్పారపట్టిన కేఏపాల్ ను అందరూ కొనియాడుతున్నారు. పాల్ లో దమ్ముధైర్యం ఉందని ప్రశంసిస్తున్నారు.