Homeజాతీయ వార్తలుతెలంగాణ‌లో ఉద్యోగాలుః ఎన్నిక‌ల స‌వాళ్లేనా? చిత్తశుద్ధి ఉందా?

తెలంగాణ‌లో ఉద్యోగాలుః ఎన్నిక‌ల స‌వాళ్లేనా? చిత్తశుద్ధి ఉందా?

Unemployees in Telangana
తెలంగాణలో రెండు ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గాలకు త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో డిగ్రీ పూర్త‌చేసిన‌ ఉద్యోగులు, నిరుద్యోగులు ఓటు వేయ‌నున్నారు. దీంతో.. ఇప్పుడు రాష్ట్రంలో ఉద్యోగాల క‌ల్ప‌న విష‌యం తీవ్ర చ‌ర్చ‌కు దారితీస్తోంది. నిజానికి తెలంగాణ ఉద్య‌మం సాగిన ప్ర‌ధాన అంశాల్లో ఉద్యోగాల క‌ల్ప‌న ఒక‌టి. ‘నీళ్లు, నిధులు నియామకాలు’ అనే మూడు లక్ష్యాలను సాధించుకునే దిశగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కొనసాగింది. చివరకు విజయం సాధించింది కూడా. అయితే.. రాష్ట్రం ఏర్పడిన ఆరు సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు కల్పించారనే విషయమై ఈ ఎన్నికల వేళ వాదోపవాదాలు సాగుతున్నాయి. రాజకీయ పార్టీలు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నాయి.

Also Read: వార్త‌ల్లో ఏపీ మంత్రులు.. టార్గెట్ అయ్యారా?!

ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఓ జాబితా రిలీజ్ చేశారు. రాష్ట్రం ఇప్ప‌టి వ‌ర‌కూ లక్షా ముఫ్పై వేల ఉద్యోగాలకుపైగా భర్తీ చేశామని ప్రకటించారు. ఈ మేర‌కు ఉద్యోగాల భర్తీపై బహిరంగలేఖ రాశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆరేళ్లలో 1,32,899 ఉద్యోగాల‌ను వివిధ‌ శాఖల్లో భర్తీ చేసినట్టు ప్ర‌క‌టించారు. ఆ పోస్టుల వివరాలను కూడా తన లేఖలో ఉంచారు కేటీఆర్. విప‌క్షాలు అస‌త్యాలు చెబుతున్నాయ‌ని, యువత ఈ విష‌యాన్ని గుర్తించాల‌ని అన్నారు. వారికి స్పష్టత ఇచ్చేందుకే ఈ వివరాలను వెల్లడిస్తున్నట్లు చెప్పారు మంత్రి.

పైన చెప్పిన లెక్క కేవ‌లం ప్ర‌భుత్వ రంగానిది మాత్ర‌మేన‌ని.. ప్రైవేటు రంగంలో మరో 14లక్షల పైచిలుకు ఉద్యోగాలు క‌ల్పించామ‌ని కేటీఆర్ చెప్పుకొచ్చారు. దీనిపై విప‌క్షాలు స్పందించాయి. కేటీఆర్ చెబుతున్న లెక్క‌ల‌న్నీ అవాస్త‌వాల‌ని కొట్టిపారేశాయి. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ బరిలో నిలిచిన అభ్య‌ర్థులంతా కేటీఆర్ లెక్క‌ల‌ను త‌ప్పుబ‌ట్టారు. ఈ విషయంలో చ‌ర్చించేందుకు సిద్ధ‌మ‌ని, కేటీఆర్ ఎక్క‌డికి పిలిస్తే అక్క‌డి వ‌స్తామ‌ని స‌వాల్ విసిరారు.

Also Read: అడ‌క‌త్తెర‌లో పోక‌చెక్క‌లా ఏపీ బీజేపీ..!

పట్టభద్రుల ఎన్నికల్లో నిరుద్యోగుల ఓట్లే కీలకంగా మారిన విష‌యం తెలిసిందే. దీంతో వారిని ఆక‌ర్షించేందుకు అటు అధికార పార్టీ.. ఇటు విప‌క్షాలు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నాయి. అయితే.. తెలంగాణ యువ‌త ఆశించిన స్థాయిలో ఉద్యోగాలు రాలేద‌న్న‌ది నిర్వివాదం. ఈ విష‌యమై చాలా కాలంగా ప్ర‌భుత్వం విమ‌ర్శ‌లు ఎదుర్కొంటూనే ఉంది. అయితే.. ప్ర‌భుత్వం చెబుతున్న‌ట్టు ఎంత మందికి ఉద్యోగాలు క‌ల్పించింద‌నేది రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు తెలియాల్సిన అవ‌స‌రమైతే ఉంది. మ‌రి, ఈ నేత‌లు చేస్తున్న స‌వాళ్లు కేవ‌లం ఎల‌క్ష‌న్ స్టంట్ మాత్ర‌మేనా..? చిత్తశుద్ధి ఉందా? అని ప్ర‌శ్నిస్తోంది తెలంగాణ యువ‌త‌.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
Oktelugu Epaper
Exit mobile version