JNU anti India allegations: ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ భారత వ్యతిరేక కార్యకలాపాలకు కేంద్రంగా ఉంటూ వచ్చింది. తుకిడే గ్యాంగులు ఇందులోనే ఉన్నాయి. పాకిస్తాన్ అనుకూల నినాదాలు బలంగా వినిపించేవి. అక్కడి ప్రొఫెసర్లు కూడా తప్పుడు చరిత్రను నేర్పించారు. పాలస్తీనాకు అనుకూలంగా విద్యార్థుల మైండ్ మార్చి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అయితే ఈ యూనివర్సిటీలో కనీ విని ఎరుగని సంఘటన జరిగింది. ఈ యూనివర్సిటీలో విద్యార్థుల ఇష్టారాజ్యం కొనసాగేది. కానీ, గతంలోలాగా ఇప్పుడు నడదు అని అధికారులు షాక్ ఇచ్చారు.
లైబ్రరీలో విధ్వంసం కారణంగా..
గతేడాది నవంబర్ 20న యూనివర్సిటీ లైబ్రరీలో విద్యార్థులు ఫేసియల్ రికగ్నిషన్ వ్యవస్థను ధ్వంసం చేశారు. ఆవేశ ప్రసంగాలు చేశారు. అడ్డుకోబోయిన ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లపై దాడి చేశారు. అయితే తాము ఏం చేసినా చెల్లుతుందనే విధంగా వ్యవహరించారు. కానీ, అధికారులు దీన్ని తీవ్రంగా తీసుకుని ప్రాక్టోరియల్ విచారణ ఆదేశించారు.
నివేదిక ఆధారంగా యాక్షన్..
విచారణ నివేదిక అందిన తర్వాత అధికారులు చర్యలు మొదలు పెట్టారు. ఫిబ్రవరి 8న ఐదుగురు విద్యార్థులపై ఏడాది రస్టికేషన్ విధించారు. వీరిలో స్టూడెంట్స్ యూనియన్ సెక్రటరీ గోపిక బాబు, అధ్యక్షురాలు అతిధి మిశ్రా, సునీల్ యాదవ్, డానిస్ అలీ, నితీష్ కుమార్ ఉన్నారు. ఫిబ్రవరి 13 వరకు వర్సిటీ ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశించారు. శిక్ష పూర్తయిన తర్వాత కూడా రూ.19 వేల జరిమానా చెల్లించాలని పేర్కొన్నారు.
విద్యా వాతావరణ మార్పు
జేఎన్యూలో భారత వ్యతిరేక కార్యకలాపాలు, తప్పుడు చరిత్ర బోధన, పాక్ అనుకూల నినాదాలు గతంలో సంచలనం చేశాయి. అధికారులు రాజకీయ జోక్యాలు ఆగమాత్రమే కారణంగా కఠిన చర్యలు తీసుకున్నారు. ఆశ్రయం ఇచ్చినవారిపై కూడా చర్యలు హెచ్చరిక. అయితే విద్యార్థులపై చర్యలను నిరసిస్తూ ఒకరోజు బంద్ పాటించారు. కానీ, ఈ చర్యలు జేఎన్యూలో మార్పు తీసుకువస్తాయని నిపుణులు భావిస్తున్నారు.