Homeఆంధ్రప్రదేశ్‌Glass Symbol Janasena: 15 ఏళ్ల జనసేన.. గాజు గ్లాస్’ కోసం ఇంకా ఫైటింగ్ యేనా?

Glass Symbol Janasena: 15 ఏళ్ల జనసేన.. గాజు గ్లాస్’ కోసం ఇంకా ఫైటింగ్ యేనా?

Glass Symbol Janasena: ఏపీలో జనసేన ఆవిర్భవించి సుదీర్ఘకాలం అవుతోంది. కానీ ఇంతవరకు సరైన విజయం దక్కలేదు. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో టిడిపికి, కేంద్రంలో బిజెపికి పవన్ మద్దతు తెలిపారు. ఆ ఎన్నికల్లో రెండు పార్టీలు విజయం సాధించాయి. గత ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుంచి టిడిపి బయటకు వెళ్ళింది. దీంతో పవన్ సైతం గత ఎన్నికల్లో ఒంటరి పోరు చేశారు. టిడిపి, బిజెపి, జనసేన ఎవరికి వారుగా పోటీ చేయగా.. మూడు పార్టీలకు ఓటమి ఎదురైంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పవన్ ఎన్డీఏ లో చేరారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. బిజెపిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు రాష్ట్రంలో, అటు జాతీయస్థాయిలో గుర్తింపు దక్కించుకున్న జనసేన.. పార్టీ గుర్తు విషయంలో మాత్రం తడబడుతోంది. గాజు గ్లాసు గుర్తును దక్కించుకునేందుకు పడరాని పాట్లు పడుతోంది.

2014 ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. కానీ ఎలక్షన్ కమిషన్ మాత్రం రిజిస్టర్డ్ పార్టీగా జనసేనకు గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. 2019 ఎన్నికల్లో 130 మందికి పైగా అభ్యర్థులు జనసేన తరఫున అసెంబ్లీ స్థానాలకు పోటీ చేశారు. సగానికి పైగా ఎంపి నియోజకవర్గాల నుంచి జనసేన అభ్యర్థులు బరిలో దిగారు. గాజు గ్లాస్ గుర్తుపై పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో జనసేన ఒకే అసెంబ్లీ స్థానానికి పరిమితమైంది.దీంతో ఎన్నికల నిబంధనల ప్రకారం.. నిర్ణీత ఓట్లు, సీట్లు దక్కకపోయేసరికి జనసేన గాజు గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలోకి చేర్చుతూ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది.

జనసేన పోటీ చేయబోయే నియోజకవర్గాల్లో మాత్రమే గాజు గ్లాస్ గుర్తును కేటాయిస్తూ.. స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉండే చోట సైతం వారికి గాజు గ్లాస్ గుర్తులు కేటాయించే వీలుగా ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చారు. ఇది ఇబ్బందికరంగా మారనుండడంతో జనసేన ఎలక్షన్ కమిషన్ కు ప్రత్యేక వినతి సమర్పించింది. గత ఏడాది డిసెంబర్ 12న జనసేన నుంచి వినతి రావడంతో ఎలక్షన్ కమిషన్ ఆ పార్టీకి గాజు గ్లాస్ గుర్తు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై రాజమండ్రి కి చెందిన రాష్ట్రీయ కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గాజు గ్లాస్ గుర్తు కోసం తాము ఈసీకి దరఖాస్తు చేసుకున్నామని.. తమ తరువాత దరఖాస్తు చేసుకున్న జనసేనకు ఆ గుర్తు కేటాయించారని పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై ఈసీ వివరణ ఇచ్చింది. జనసేన నుంచి డిసెంబర్ 12న వినతి వచ్చిందని.. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ నుంచి డిసెంబర్ 20న దరఖాస్తు వచ్చిన విషయాన్ని ప్రస్తావించింది. దీంతో కోర్టు విచారణను నేటికి వాయిదా వేసింది.

అయితే జనసేన ఆవిర్భవించి సుదీర్ఘకాలం అవుతోంది.సరైన విజయం దక్కలేదు. ఈ ఎన్నికల్లో ఉనికి చాటుతుందని అంతా భావిస్తున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే గాజు గ్లాస్ గుర్తుపై వివాదం జరగడంతో జనసైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనసేన చుట్టూ నిత్యం కుట్రలు జరుగుతూనే ఉన్నాయని వాపోతున్నారు. హైకోర్టులో తనకు తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అయితే జనసేనకు గుర్తు వివాదం వీడడం లేదు. మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో సైతం జనసేన ను టార్గెట్ చేసుకొని ఇండిపెండెంట్లు బరిలో దిగారు. గాజు గ్లాస్ గుర్తును పోలి ఉన్న బకెట్ గుర్తును దక్కించుకున్నారు.దాంతో జనసేనకు నష్టం జరిగింది. ఇప్పుడు కూడా ఏపీ ఎన్నికల్లో గుర్తు వివాదాన్ని తెరపైకి తేవడం విశేషం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....

Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత: కడవరకు తెలంగాణ వాదిగానే.. తెలంగాణ వచ్చినంకనే పెండ్లి..

Peddi Sudarshan Reddy: ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం మరింత ఇష్టం.. అందువల్లే ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాలో గులాబీ జెండాను నెత్తిన...
Oktelugu Epaper
Exit mobile version