Homeఆంధ్రప్రదేశ్‌Janga Krishna Murthy: వైసీపీకి మరో ఎమ్మెల్సీ గుడ్ బై!

Janga Krishna Murthy: వైసీపీకి మరో ఎమ్మెల్సీ గుడ్ బై!

Janga Krishna Murthy: వైసీపీకి మరో ఎమ్మెల్సీ ఝలక్ ఇచ్చారు. ఆ పార్టీకి చెందిన సీనియర్ బీసీ నాయకుడు జంగా కృష్ణమూర్తి వైసీపీకి గుడ్ బై చెప్పారు. వైసీపీ ఆవిర్భావం నుంచి కృష్ణమూర్తి జగన్ వెంట నడుస్తున్నారు. 2014 ఎన్నికల్లో గురజాల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కృష్ణమూర్తి ఓడిపోయారు. 2019లో మాత్రం జగన్ కృష్ణమూర్తిని తప్పించి కాసు మహేష్ రెడ్డిని తెరపైకి తెచ్చారు. ఆయన గెలుపు కోసం కృషి చేసిన కృష్ణమూర్తికి అన్ని విధాలా న్యాయం చేస్తామని చెప్పుకొచ్చారు. కానీ కొద్దిరోజుల కిందట ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. అయినా కృష్ణమూర్తి సంతృప్తిగా లేరు. గురజాల నుంచి పోటీకి సన్నద్ధమయ్యారు. కానీ జగన్ మాత్రం కాసు మహేష్ రెడ్డి వైపు మొగ్గు చూపారు. దీంతో జంగా కృష్ణమూర్తి పార్టీని వీడారు. త్వరలో ఆయన టిడిపిలో కానీ, జనసేనలో కానీ చేరతారని ప్రచారం జరుగుతోంది.

జంగా కృష్ణమూర్తి బలమైన బీసీ నాయకుడు. 2009లో ఎమ్మెల్యే అయ్యారు. జగన్ పిలుపుమేరకు వైసీపీలో చేరారు. వైసిపిలో బీసీ విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ వచ్చారు. గత ఎన్నికల్లో కాసు మహేష్ రెడ్డి గెలుపునకు కృషి చేశారు. రాజ్యసభ తో పాటు ఇతర నామినేటెడ్ పదవుల భర్తీ సమయంలో జంగా కృష్ణమూర్తి పేరు బలంగా వినిపించేది. కానీ చివరకు మొండి చేయి చూపేవారు. కొద్ది నెలల కిందటే ఆయన్ను ఎమ్మెల్సీ చేశారు. అయినా సరే గురజాల నియోజకవర్గం పై కృష్ణమూర్తి ఆశలు పెట్టుకున్నారు. కానీ జగన్ కాసు మహేష్ రెడ్డి వైపే మొగ్గు చూపారు. మరోవైపు గురజాల నియోజకవర్గంలో తనను అడుగడుగున అవమానించడంపై కృష్ణమూర్తి రగిలిపోయారు. ఇక టిక్కెట్ దక్కదని తెలుసుకున్నాక వైసీపీలో ఉండడం భావ్యం కాదని ఒక నిర్ణయానికి వచ్చారు.

కొద్ది రోజుల కిందట వైవి సుబ్బారెడ్డి టీటీడీ పదవి నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. అప్పుడు బలమైన బీసీ నాయకుడుగా ఉన్న జంగా కృష్ణమూర్తికి అవకాశం ఇస్తారని ప్రచారం జరిగింది. దాదాపు కృష్ణమూర్తి పేరు ఖరారు అయిందని టాక్ నడిచింది. తనకు టీటీడీ పదవి ఇవ్వాలని కృష్ణమూర్తి సైతం సీఎం జగన్ కు విజ్ఞప్తి చేశారు. కానీ కృష్ణమూర్తి అభ్యర్థనను పట్టించుకోని జగన్.. ఆ పదవిలో కరుణాకర్ రెడ్డి ని నియమించారు. అప్పటినుంచి మరింత కోపంతో రగిలిపోయిన కృష్ణమూర్తికి… ఇటీవల గురజాల నియోజకవర్గం విషయంలోజగన్ క్లారిటీ ఇచ్చారు. కాసు మహేష్ రెడ్డికి లైన్ క్లియర్ చేశారు. దీంతో కృష్ణమూర్తి వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఆయనకు షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ నుంచి సైతం ఆహ్వానం ఉంది. అయితే ఆయన తెలుగుదేశం పార్టీలో కానీ, జనసేనలో కానీ చేరతారని ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....
Oktelugu Epaper
Exit mobile version