Homeఆంధ్రప్రదేశ్‌Jagan Targets Kapu Leaders: కాపు ఎమ్మెల్యేలు, మంత్రులను జగన్ టార్గెట్ చేశాడా?

Jagan Targets Kapu Leaders: కాపు ఎమ్మెల్యేలు, మంత్రులను జగన్ టార్గెట్ చేశాడా?

CM Jagan Targets: ఏపీలో సీఎం జగన్ బాధితులు చాలా మంది ఉన్నారు. అన్ని పార్టీల్లో ఉన్నారు. చివరకు సొంత పార్టీలో సైతం దెబ్బతిన్న వారూ ఉన్నారు. అందులో ప్రధానంగా కాపు సామాజికవర్గం నేతలే ఉండడం విశేషం. వారికి తెలియకుండానే… వారి రాజకీయ భవిష్యత్ ను పణంగా పెట్టి ప్రత్యర్థులపై పైచేయి సాధించే పనిలో జగన్ ఉన్నారు. ఈ విషయంలో ఇప్పటివరకూ సక్సెస్ అవుతూ వచ్చారు. మరీ ముఖ్యంగా పవన్ విషయంలో కాపు నేతలను చాలా చక్కగా వినియోగించుకున్నారు. పవన్ అయినా, చంద్రబాబు అయినా.. మరే ఇతర నేతలైనా ప్రభుత్వానికి విమర్శించినా, జగన్ పై మాట్లాడినా ముందుగా తెరపైకి వచ్చేది వైసీపీలోని కాపు మంత్రులు, ఎమ్మెల్యేలే. విచిత్రమేమిటంటే ప్రభుత్వ పాలసీలు, పార్టీ విధానాలపై మాట్లాడేది రెడ్డి సామాజికవర్గం వారైతే… ఇతర కులాల నాయకులపై తిట్ల దండకానికి మాత్రం కాపు నేతలే జగన్ కు కనిపిస్తున్నారు.

Jagan Targets Kapu Leaders
YCP Kapu Leaders

అయితే కాపులు, కాపు నాయకుల విషయంలో జగన్ ఒక వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. కాపు రిజర్వేషన్ల విషయంలో అధికారంలో వచ్చిన తొలిరోజుల్లోనే కళ్లు తేలేశారు. రిజర్వేషన్లు తన పరిధిలో లేవని తేల్చేశారు. అటు రాజ్యాధికారం తన వద్ద పెట్టుకొని మంత్రులుగా కొంతమంది నోరున్న కాపు నాయకులను నియమించుకున్నారు. వారితోనే తన రాజకీయాలను నెరుపుతున్నారు. తన నాయకత్వాన్ని అడిక్ట్ చేసేశారు. ఎంతలా అంటే పేర్ని నాని వంటి వారు సొంత సామాజికవర్గాన్నితిట్టించేటంతగా.. చివరకు తాను సీఎం జగన్ కుటుంబానికి పెద్ద పాలేరు అని కూడా చెప్పించారు. వివాదాస్పద ఏ నిర్ణయం అయినా కాపు మంత్రులతోనే చెప్పిస్తున్నారు.

తమ భుజంపై తుపాకీ పెట్టి జగన్ ప్రత్యర్థులను కాల్చుతున్న వైఖరి కొందరు కాపు పెద్దలకు తెలుసు. కానీ తాత్కాలికంగా అధికారానికి వారంతా దాసోహమవుతున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పవన్ విమర్శించిన ప్రతిసారి కాపు మంత్రులు గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు వంటి మంత్రుల బృందం రంగంలోకి దిగుతుంది. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఆదేశాలను అమలుచేస్తుంది. అది మంచైనా, చెడైనా ఆలోచించకుండా నోటికి ఎంతపడితే అంత వ్యాఖ్యలు చేస్తుంటారు. కానీ జగన్ సామాజికవర్గానికి చెందిన వారు.. ఆయన ఆత్మీయ బంధువులు ఎవరూ రంగంలోకి దిగకపోవడాన్ని మాత్రం గుర్తించలేకపోతున్నారు. జగన్ రాజకీయ తంత్రాన్ని గుర్తించలేకపోతున్నారు. తమ రాజకీయ భవిష్యత్ ను పణంగా పెడుతున్న విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. మొన్న విశాఖ ఎపిసోడ్ ను కూడా జగన్ కాపు మంత్రులతో రక్తికట్టించాలని చూశారు. అందుకే దానికి పవన్ కూడా దీటైన కౌంటర్ ఇచ్చారు.

Jagan Targets Kapu Leaders
Jagan
Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper