spot_img
Homeజాతీయ వార్తలుMinister Malla Reddy: మంత్రి మల్లారెడ్డికి ఐటీ మరో షాక్‌.. ఆ లేఖతో రంగంలోకి ఈడీ!!

Minister Malla Reddy: మంత్రి మల్లారెడ్డికి ఐటీ మరో షాక్‌.. ఆ లేఖతో రంగంలోకి ఈడీ!!

Minister Malla Reddy: తెలంగాణలోకి సీబీఐ రావొద్దని ప్రభుత్వం గత సెప్టెంబర్‌లో జీవో 51 విడుదల చేసింది. దీంతో అదే సీబీఐ రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రను ఢిల్లీకి రప్పించుకుంది. ఇంకా కొంతమంది ఢిల్లీబాట పట్టనున్నట్లు సమాచారం. ఇక ఇంతటితో ఆగకుండా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఐటీ, ఈడీ తెలంగాణలో దూకుడు పెంచాయి. ఇప్పటికే మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను ఈడీ ఫోకస్‌ చేసింది. మల్లారెడ్డిని ఐటీ టార్గెట్‌ చేసింది. ఇటీవలో మూడు రోజులు మల్లారెడ్డి ఆస్తులను సోదా చేసింది. అంతటితో ఆగకుండా విచారణకు పిలుస్తోంది.. ఇప్పటికే తీవ్రమైన ఒత్తిడితో ఉన్న మంత్రికి ఐటీ మరో షాక్‌ ఇచ్చింది. ఇప్పటి వరకు సోదాలు – విచారణ చేసిన ఆదాయపు ఐటీ అధికారులు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు లేఖ రాసినట్లు తెలుస్తోంది. అందులో పేర్కొన్న అంశాలు మంత్రి మల్లారెడ్డికి షాక్‌ ఇవ్వబోతున్నాయి.

Minister Malla Reddy
Minister Malla Reddy

 

వెంటాడుతున్న దర్యాప్తు సంస్థలు..
మంత్రి మల్లారెడ్డి కేంద్ర దర్యాప్తు సంస్థలు వెంటాడుతున్నాయి. వరుసగా మూడు రోజుల పాటు ఐటీ అధికారులు నిర్వహించిన సోదాలతో రాజకీయంగా కలకలం చోటు చేసుకుంది. మంత్రి నివాసంతో పాటుగా ఆయన బంధువుల నివాసాల్లోని ఐటీ అధికారులు సుదీర్ఘ సోదాలు నిర్వహించారు. కుమార్తె – కుమారుడు– అల్లుడుతో పాటుగా బంధువుల నివాసాలు– కార్యాలయాల్లోనూ ఈ సోదాలు జరిగాయి. పెద్ద మొత్తంలో నగదును, బంగారంతో పాటుగా కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ప్రస్తుతం ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారులు మంత్రి కుటుంబాన్ని, సన్నిహితులు, కార్యాలయాల్లో పనిచేస్తున్న వారిని విచారిస్తున్నారు. కాగా, మల్లారెడ్డి సంస్థల్లో సోదాల సమయంలో తాము గుర్తించిన అక్రమాల పైన ఐటీ అధికారులు ఈడీకి లేఖ రాయటం కలకలం రేపుతోంది. మల్లారెడ్డి విద్యాసంస్థల్లో ఫీజులు వసూలుపై ఐటీ షాకిచ్చింది. దీనికి సంబంధించి అక్రమాలు జరిగినట్లు ఆధారాలను సేకరించినట్లుగా తెలుస్తోంది.

ఈడీ ఇన్‌ఫర్మేషన్‌..
మంత్రి మల్లారెడ్డి విద్యా సంస్థల్లో నిర్వహించిన సోదాల్లో ప్రధానంగా ఫీజలు వసూలుపైనే అధికారులు ఫోకస్‌ పెట్టారు. అక్రమాలు జరిగినట్లుగా గుర్తించారని చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం విచారణ సమయంలోనూ ఆరా తీస్తున్నారు. దీంతో, మనీ లాండరింగ్‌ జరిగిందనే కోణంలో ఐటీ అధికారులు ఈడీకి లేఖ రాశాారని సమాచారం. మల్లారెడ్డి కుటుంబ సభ్యుల లాకర్లు నుంచి రూ.18 కోట్లు నగదు.. కీలక పత్రాల స్వాధీనం చేసుకున్న అధికారులు.. ఫీజలు విషయంలో తాము కోరని సమాచారంపై స్పష్టత రాలేదని ఈడీకి రాసిన లేఖలో వివరించినట్లు తెలుస్తోంది. దీని పైన ఈడీ మరింత లోతుగా విచారణ చేయటం ద్వారా మరిన్ని కీలక అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉందని సూచించినట్లు సమాచారం. ఈ లేఖ పైన ఈడీ ఏ రకంగా స్పందిస్తుందనేది తెలియాల్సి ఉంది.

Minister Malla Reddy
Minister Malla Reddy

సీట్లు – డొనేషన్లలో అవకతవకలు
మల్లారెడ్డి విద్యా సంస్థల్లో సీట్ల కేటాయింపు.. డొనేషన్ల స్వీకరణలో భారీగా అవకతవకలు జరిగాయనేది ఐటీ అధికారుల అభియోగం. దీనికి సంబంధించి కొంత సమాచారం సేకరించినా.. లోతైన అధ్యయనం అవసరమని భావిస్తున్నారు. దీంతో, ఇప్పుడు ఐటీ అధికారుల లేఖ ఆధారంగా ఈడీ విచారణ చేయాల్సి ఉంటుంది. ఐటీ అధికారుల లేఖ ఆధారంగా ఈడీ రంగంలోకి దిగేముందే నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలోని టీఆర్‌ఎస్‌ నేతలే లక్ష్యంగా అనేక అంశాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ సాగుతున్న సమయంలో.. తాజాగా మల్లారెడ్డికి సంబంధించి ఐటీ అధికారులు రాసిన లేఖ కలకలం రేపుతోంది. ఇప్పుడు మల్లారెడ్డి వ్యవహారంలో ఈడీ స్పందన ఏంటనేది చూడాలి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Rahul Gandhi : అశాంతి, అరాచకం, అస్థిరత్వం దిశగా ఆందోళన.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టత లేని...

Rahul Gandhi : ప్రతిపక్ష రాజకీయాల్లో విమర్శలు సహజం. అధికార పక్షాన్ని ప్రశ్నించడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం ప్రతిపక్ష బాధ్యత కూడా. అయితే ఆ విమర్శలు వాస్తవాలు, స్పష్టమైన ఆధారాలు, ప్రత్యామ్నాయ సూచనలతో...
Balakrishna Family Entertainer

Nandamuri Balakrishna : ప్రత్యేక విమానంలో బాలయ్య ని హైదరాబాద్ కి తరలిస్తున్న డాక్టర్లు.. వీడియో వైరల్..

Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ రీసెంట్ గానే NBK111 షూటింగ్ లో గాయాలపాలైన సంగతి అందరికీ తెలిసిందే. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్న సమయం లో అదుపు తప్పి...
CM Vijay viral assembly video

Tamil Nadu CM Vijay : సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. దెబ్బకు మారిపోయిన రాజకీయ సమీకరణాలు..

Tamil Nadu CM Vijay : గత రెండు మూడు రోజులుగా ఢిల్లీ పార్లమెంట్ వద్ద జరుగుతున్న ఉద్రిక్త పరిణామాలను గమనిస్తూనే ఉన్నాం. నీట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు లీక్ అవ్వడం...
Sujeeth Director

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ ,...
Jr NTR

Jr NTR: నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సినిమా రద్దు అయ్యినట్టేనా!

Jr NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత , క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది జూనియర్...
Oktelugu Epaper