Homeఆంధ్రప్రదేశ్‌CM Jagan: రాష్ట్ర ప్రయోజనాలపై జగన్ రాజీ పడుతున్నారా?

CM Jagan: రాష్ట్ర ప్రయోజనాలపై జగన్ రాజీ పడుతున్నారా?

CM Jagan: కృష్ణా జలాల వ్యవహారంలో జగన్ సర్కార్ వైఖరి విమర్శల పాలవుతోంది. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశమవుతోంది. కృష్ణా జలాల పంపిణీ విషయంలో పున సమీక్షకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి పునః సమీక్ష కోసం చాలా సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ వస్తుంది. అయితే తాజాగా తెలంగాణకు ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో… పున సమీక్ష బాధ్యతను బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు అప్పగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కానీ సీఎం జగన్ మాత్రం కేంద్రానికి లేఖలతో సరిపెడుతున్నారు. అటు కేంద్రం, ఇటు తెలంగాణ ప్రభుత్వంతో లాలూచీ పడుతున్నట్లు విమర్శలు ఎదుర్కొంటున్నారు.

సీఎం జగన్ రాష్ట్ర అధికారులతో అత్యున్నత సమావేశం నిర్వహించారు. మరోసారి కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయడానికి నిర్ణయించారు. అయితే దీనిని ఎక్కువ మంది తప్పుపడుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు గండి పడినప్పుడు నేరుగా రంగంలోకి దిగాల్సింది పోయి.. తూతూ మంత్రంగా ఈ లేఖలు రాయడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇది విపక్షాలకు అస్త్రంగా మారుతుంది. వాస్తవానికి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత.. విభజన అంశాల్లో పొందుపరిచిన తర్వాత.. ఇలా పున సమీక్ష నిర్వహించడం నిబంధనలకు విరుద్ధం. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసేందుకు అవకాశం ఉంది. కానీ కేంద్రంతో ఉన్న సత్సంబంధాల దృష్ట్యా జగన్ సర్కార్ అంతటి సాహసం చేయలేకపోతుందని ప్రచారం జరుగుతుంది.

రాష్ట్ర విభజన తర్వాత విభజన అంశాల్లో స్పష్టంగా పొందుపరిచారు. నదీ జలాల వినియోగం పై స్పష్టతనిచ్చారు. ఇప్పుడు తెలంగాణలో రాజకీయ ప్రయోజనాల కోసం.. నదీ జలాల పంపకం విషయంలో పున సమీక్ష జరుపుతామని చెప్తుండడం ఏపీకి అన్యాయం చేసినట్లే. విభజనకు సంబంధించి చాలా వరకు హామీలు ఏపీ విషయంలో అమలు కావడం లేదు. అటు తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిలు సైతం విడుదల కావడం లేదు. కానీ దీనిపై కేంద్రం కఠిన నిర్ణయాలకు దిగడం లేదు. మరోవైపు తెలంగాణ సర్కార్ తో ఏపీ ప్రభుత్వానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అటు కెసిఆర్, ఇటు జగన్ ల మధ్య మంచి సంబంధాలే కొనసాగుతున్నాయి. ఇటువంటి తరుణంలో జగన్ రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల ముంగిట ఇదో ప్రతికూల అంశం గా మారే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది.

ఒకవైపు కేంద్రం, మరోవైపు తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ ప్రయోజనాలకు సంబంధించి పెద్ద నాటకమే జరుగుతోంది. కేంద్ర పెద్దలకు జగన్ సన్నిహితుడు, అటు తెలంగాణ సీఎం కేసీఆర్కు సైతం నిజమైన మిత్రుడు, అదే సమయంలో కెసిఆర్ కు కేంద్ర పెద్దలకు బహిర్గత వైరమే కానీ, అంతర్గతంగా సహకరించుకున్నట్లు పరిస్థితులు తెలియజేస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల దృష్ట్యా కృష్ణా జలాల పంపకాల పునః సమీక్ష కు కేంద్రం నోటిఫికేషన్ ఇవ్వడం రాజకీయాల్లో భాగమే. ఈ విషయంలో జగన్ పోరాడకపోవడం రాష్ట్రానికి శాపం గా మారింది. ఈ విషయంలో కానీ జగన్ చొరవ చూపకపోతే ఏపీ ప్రజల్లో పలుచన కావడం ఖాయం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version