హైదరాబాద్ ఇక ఆంధ్ర రాజధాని కానట్టేనా?

2014లో ఏపీ తెలంగాణ విడిపోయిన సందర్భంలో విభజన చట్టం ప్రకారం.. ‘హైదరాబాద్’ పదేళ్లు ఉమ్మడి రాజధాని అని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ నుంచే అవిభాజ్య ఏపీని పాలించుకునే వెసులుబాటును ఆంధ్రా ప్రభుత్వాలకు ఇచ్చింది. కానీ నాడు చంద్రబాబు ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని రాత్రికి రాత్రి అమరావతి రాజధానికి తరలిపోయాడు. అలా ఏడేళ్లు గడిచిపోయే సరికి ఉమ్మడి రాజధాని కాస్తా.. తెలంగాణకే సపరేట్ అయిపోయింది. అదే ఇప్పుడు ఏపీ ప్రజల పాలిట శాపంగా మారింది. […]

Written By: NARESH, Updated On : May 14, 2021 5:01 pm
Follow us on

2014లో ఏపీ తెలంగాణ విడిపోయిన సందర్భంలో విభజన చట్టం ప్రకారం.. ‘హైదరాబాద్’ పదేళ్లు ఉమ్మడి రాజధాని అని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ నుంచే అవిభాజ్య ఏపీని పాలించుకునే వెసులుబాటును ఆంధ్రా ప్రభుత్వాలకు ఇచ్చింది. కానీ నాడు చంద్రబాబు ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని రాత్రికి రాత్రి అమరావతి రాజధానికి తరలిపోయాడు. అలా ఏడేళ్లు గడిచిపోయే సరికి ఉమ్మడి రాజధాని కాస్తా.. తెలంగాణకే సపరేట్ అయిపోయింది. అదే ఇప్పుడు ఏపీ ప్రజల పాలిట శాపంగా మారింది.

తాజాగా తెలంగాణలోని ఆస్పత్రులపై అధిక భారం పడుతోందనే నెపంతో ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న అంబులెన్స్‌లను అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం మరోసారి నిలిపివేయడం కలకలం రేపింది. హైకోర్టు చెప్పినా వినకుండా ఇలా వ్యవహరించడం ఏపీ ప్రజల్లో ఆగ్రహావేశాలకు కారణమవుతోంది. రాయలసీమ ప్రాంతం నుండి వచ్చే కనీసం 40 అంబులెన్స్‌లను తెలంగాణలోకి ప్రవేశించడానికి అనుమతి లేదని చెప్పి కర్నూలు-జోగులంబా గద్వాల్ అంతర్రాష్ట్ర సరిహద్దులోని పుల్లూర్ టోల్ ప్లాజా వద్ద ఆపివేశారు. వారిలో కొందరికి ఆంధ్ర పోలీసుల అనుమతి ఉన్నప్పటికీ, అంబులెన్స్‌లలోని రోగులకు హైదరాబాద్, తెలంగాణలోని ఇతర ప్రాంతాల ఆసుపత్రుల అనుమతి లేదని తెలంగాణ పోలీసులు అడ్డుచెప్పడం గమనార్హం.

హైదరాబాద్‌లోని ఆస్పత్రులపై అధిక ఒత్తిడి ఉన్నందున, ఇతర రాష్ట్రాల నుండి ఎక్కువ మంది రోగులకు వసతి కల్పించలేమని.. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఇచ్చిన సూచనల మేరకు ఏపీ నుంచి వచ్చే రోగులను అడ్డుకున్నట్టు తెలంగాణ పోలీసులు తెలిపారు. ఆరోగ్య అధికారులు.. ఆసుపత్రి నుంచి అనుమతి పొందిన తరువాత మాత్రమే వారు వాహనాలను సరిహద్దు దాటడానికి అనుమతిస్తున్నారు. రాష్ట్ర రాజధానిలో ఆక్సిజన్ మద్దతు ఉన్న పడకల కొరతతో సహా వివిధ కారణాలను చూపుతూ తెలంగాణ పోలీసుల నుండి ఆన్‌లైన్ అనుమతి పొందిన వారిని కూడా తిరిగి పంపించారు.

దీనిపై ఆంధ్రా ప్రజలు, మేధావులు, నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. హైదరాబాద్.. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఉమ్మడి రాజధాని అని.. అప్పుడే తెలంగాణ రాజధాని అయిపోయిందా? అని ఆంధ్ర మరియు రాయలసీమ నుండి చాలా మంది ప్రశ్నిస్తున్నారు. “కనీసం మరో మూడేళ్లపాటు మాకు హైదరాబాద్‌పై హక్కు ఉంది. హైదరాబాద్ లోని ఆసుపత్రులు తెలంగాణ ప్రజలకు మాత్రమే కాదు. దేశంలోని ఏ ప్రాంతం నుండైనా ఎవరైనా ఇక్కడకు వచ్చి చికిత్స తీసుకోవచ్చు ”అని ఆంధ్రకు చెందిన ఒక రోగి నినదించారు.

నిజానికి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను పదేళ్లు కేంద్రం ప్రకటించింది. మరో మూడేళ్ల పాటు ఆంధ్రులకు హైదరాబాద్ పై సంపూర్ణ హక్కులున్నాయి. కానీ ఇక్కడి ఆంధ్రా అధికార, ప్రతిపక్షాలు స్వార్థ రాజకీయాలతో, అలిగేషన్స్ తో ధైర్యంగా తెలంగాణ ప్రభుత్వాన్ని, కేసీఆర్ ను అనే పరిస్థితుల్లో లేవు. ఎవరి లూప్ హోల్స్ వారు వెనకడుగు వేస్తున్నారు. దీంతో ఏపీ రోగులు అన్యాయం అయిపోతున్నారు.

ఈ విషయాన్ని తెలంగాణ సీఎంతో మాట్లాడి వెంటనే తీసుకొని సమస్యను పరిష్కరించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆంధ్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని తెలుగు దేశం పార్టీ కోరింది. ఏపీ రోగులకు అవకాశం కల్పించేలా చూడాలని సూచించింది.