విజయవంతంగా మరో మిస్సైల్ పరీక్ష

పొరుగుదేశాలైన చైనా, పాకిస్తాన్ లలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ మిస్సైళ్ల తయారీ, పరీక్షలకు ప్రాధాన్యం ఏర్పడింది.అన్నిరకాల వాతావరణాల్లో పనిచేస్తే ‘క్విక్ రియాక్షన్ సర్ఫేస్ -ఎయిర్ మిస్సైల్ (క్యూఆర్ సామ్) క్షిపణుల్ని భారత్ విజయవంతంగా పరీక్షించింది. Also Read: లాలూ జీవితం ఇక ముగిసినట్టేనా? ఒడిషాలోని చందీపూర్ లోగల ఇంటిగ్రేడెట్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి మొబైల్ లాంచర్ల ద్వారా మధ్యాహ్నం 3.40 గంటలకు అధునాతన క్షిపణులను పరీక్షించారు. గాలిలో ప్రయాణిస్తోన్న పైలట్ రహిత బన్షీ విమానాన్ని […]

Written By: NARESH, Updated On : November 14, 2020 4:34 pm
Follow us on

పొరుగుదేశాలైన చైనా, పాకిస్తాన్ లలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ మిస్సైళ్ల తయారీ, పరీక్షలకు ప్రాధాన్యం ఏర్పడింది.అన్నిరకాల వాతావరణాల్లో పనిచేస్తే ‘క్విక్ రియాక్షన్ సర్ఫేస్ -ఎయిర్ మిస్సైల్ (క్యూఆర్ సామ్) క్షిపణుల్ని భారత్ విజయవంతంగా పరీక్షించింది.

Also Read: లాలూ జీవితం ఇక ముగిసినట్టేనా?

ఒడిషాలోని చందీపూర్ లోగల ఇంటిగ్రేడెట్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) నుంచి మొబైల్ లాంచర్ల ద్వారా మధ్యాహ్నం 3.40 గంటలకు అధునాతన క్షిపణులను పరీక్షించారు. గాలిలో ప్రయాణిస్తోన్న పైలట్ రహిత బన్షీ విమానాన్ని లక్ష్యంగా నిర్ధేశించగా.. ఆ విమానాన్ని క్యూఆర్ సామ్ మిస్సైల్ గురితప్పకుండా పేల్చింది.

యుద్ధరంగంలో శత్రు విమానాలను కూల్చగల ఈ క్షిపణి పరిధి 30 కిలోమీటర్లు. దీని స్వల్ప రేంజ్ క్షిపణిని ఆర్మీ, వైమానికదళం పరీక్షించనుంది. ఆ తర్వాత ఉత్పత్తిలోకి వెళ్లేముందు మరోసారి పరీక్షలు చేస్తారు.

Also Read: ఫరూక్ అబ్దుల్లా.. నువ్వు అసలు భారతీయుడివేనా?

భారత దేశ రక్షణ కోసం పూర్తిస్థాయి క్షిపణి వ్యవస్థను సిద్ధం చేసే దిశగా భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) మరో భారీ ముందడుగు వేసింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన కీలక క్షిపణులను శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్