Homeఆంధ్రప్రదేశ్‌అదే జరిగితే జగన్‌ ప్రభుత్వం కూలడం ఖాయమా..?

అదే జరిగితే జగన్‌ ప్రభుత్వం కూలడం ఖాయమా..?

AP CM Jagan
జగన్‌ అధికారం చేపట్టినప్పటి నుంచి ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం.. దానిని వ్యతిరేకిస్తూ హైకోర్టులో ఎవరో ఒకరు పిల్‌ వేయడం సాధారణమైపోయింది. చివరికి హైకోర్టులోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు రావడం చూశాం. అయితే.. వీటన్నింటినీ లైట్‌ తీసుకున్న జగన్‌ సర్కార్‌‌కు ఒక్క పిటిషన్‌ మాత్రం గుదిబండలా మారిందట. దానిపై న్యాయమూర్తి దూకుడుగా ఉండటం టెన్షన్‌కు గురి చేస్తోంది. అదే రాజ్యాంగ విచ్ఛిన్న పిటిషన్.

Also Read: మూడు రాజధానులు: జగన్‌కు మోడీ సాయం చేస్తున్నారా?

ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసులు ప్రైవేటు సైన్యంగా మారి.. కొంత మంది కిడ్నాపులు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలా అదృశ్యమైన కొంత మంది కుటుంబసభ్యులు హైకోర్టులో దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలు చేశారు. ఒకటి రెండు కాకుండా పదుల సంఖ్యలో అలాంటి పిటిషన్లు దాఖలు కావడంతో హైకోర్టు సైతం ఆశ్చర్యపోయింది. రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోందంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందని భావించింది. ఆ దిశగా వాదనలు వినిపించాలని అటు పిటిషనర్ల తరపు న్యాయవాదులతోపాటు ఇటు ప్రభుత్వ న్యాయవాదులను ఆదేశించింది.

ఇదిలా ఉండగా.. ప్రభుత్వం తరఫు న్యాయవాదులు మాత్రం రాజ్యాంగ విచ్ఛిన్నం అంశంపై విచారణ నిలిపివేయాలంటూ మంగళవారం ఓ పిటిషన్ వేశారు. దీనిని హైకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. మరోవైపు తాము సుప్రీంకోర్టుకు వెళ్తామని ప్రభుత్వం పేర్కొంది. సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్పీ వేసి.. విచారణను వాయిదా వేయాలని హైకోర్టును అభ్యర్థించారు. స్పెషల్ లీవ్ పిటిషన్ పై సుప్రీంకోర్ట్ ఉత్తర్వులు ఇస్తే అప్పుడు నిలిపివేస్తామని ఈలోపు వాదనలు వినిపించాలని ధర్మాసనం ఆదేశించింది.

Also Read: ‘రైతుబంధు’ కోసం ఎదురుచూపులేనా?

రాజ్యాంగ విచ్ఛిన్నానికి సంబంధించి ఏ అంశాలపై వాదనలు వినిపించాలో తాము ముందే స్పష్టం చేశానని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే మౌఖికంగా మాత్రమే చెప్పారని, లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వలేదని ప్రభుత్వ న్యాయవాది వివరించారు. రాజ్యాంగ విచ్ఛిన్నానికి సంబంధించి ఏ అంశాల్లో జరిగిందో లిఖిత పూర్వకంగా ఆదేశాలు ఇస్తే వాదనలు వినిపిస్తామని ప్రభుత్వ న్యాయవాది వివరించారు. ఈ విషయంలో ప్రభుత్వ తరపు న్యాయవాదాలు.. న్యాయమూర్తుల్ని బెదిరించేలా మాట్లాడటం కలకలం రేపుతోంది. రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందని హైకోర్టు తీర్పునిస్తే.. అది ప్రభుత్వ రద్దుకు దారి తీస్తుంది. అందుకే ప్రభుత్వ న్యాయవాదులు.. ఆ పిటిషన్‌ను విచారిస్తున్న జస్టిస్ రాకేష్ కుమార్ పై వ్యక్తిగతంగా ఫిర్యాదులు చేస్తున్నారు. డిసెంబర్ 31న జస్టిస్ రాకేష్ కుమార్ రిటైర్ కానున్నారు. ఆ లోపే ఈ కేసును పరిష్కరించాలని ఆయన పట్టుదలతో ఉండగా.. అడ్డుకోవాలని ప్రభుత్వం చూస్తోంది. చివరకు పిల్‌ ఎటు దారితీస్తుందో తెలియకుండా ఉంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

1 COMMENT

Comments are closed.

Exit mobile version