
చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. కరోనా మహ్మమరి దెబ్బకు మెజార్టీ దేశాలు లాక్డౌన్ అమలు చేస్తున్నాయి. దీంతో ఎక్కువ రోజులకు ఇంటికే పరిమితమవడంతో ప్రజలు ఒత్తిడికి గురవుతున్నారు. ఇది దంపతుల మధ్య చిచ్చుపెడుతుంది. కరోనా వైరస్ హత్యలకు, కుటుంబ కలహాలు దారితీస్తుండటం శోచనీయంగా మారింది. లండన్లో జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఉత్తర లండన్లోని ఎడ్మాంటన్లో ఇద్దరు దంపతులు నివాసం ఉంటున్నారు. హుస్సేయిన్ ఎగాల్(65), మార్యన్ (57) భార్యభర్తలు. సాఫీగా సాగుతున్న వీరి కాపురంలో కరోనా వైరస్ చిచ్చు రేపింది. ఎగాల్ కు కరోనా లక్షణాలు ఉండటంతో అతని భార్య తనకు కూడా వైరస్ సోకుంతుందనే భయంతో ఇంట్లో నుంచి వెళ్లిపోమ్మని చెప్పింది. దీంతో ఆవేశానికి గురైన ఎగాల్ తన భార్యను కొట్టి చంపాడు. ఎగాల్ పై అనుమానం వచ్చిన చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అతడిని విచారించగా తన భార్యను తానే చంపినట్లు ఒప్పుకున్నాడు.
కరోనా వల్ల తన భార్య తనను ఇంటి నుంచి వెళ్లిపోమ్మని చెప్పినందుకే హత్య చేశానని చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. కాగా పోలీసులు అతడికి వైద్య పరీక్షలు చేయించగా అతడికి నిజంగా కరోనా పాజిటివ్ వచ్చింది. పోలీసులు అతడిని ఆన్ లైన్ వీడియో కాల్ ద్వారా కోర్టు ఎదుట హాజరుపర్చగా కేసును జూన్ 14కు న్యాయమూర్తి వాయిదా వేశారు.