Homeఆంధ్రప్రదేశ్‌National Surveys On AP: జాతీయ సర్వేల్లో విశ్వసనీయత ఎంత.. ఏపీలో ఇది నిజం అవుతా

National Surveys On AP: జాతీయ సర్వేల్లో విశ్వసనీయత ఎంత.. ఏపీలో ఇది నిజం అవుతా

National Surveys On AP: ఉగాది నాడు రాజకీయ పార్టీలు చెప్పించుకునే పంచాంగ శ్రవణాలకు, ఎన్నికల సర్వేలకు పెద్దగా తేడాలు కనిపించడం లేదు. ఎవరి పంచాంగం వారిదే అన్నట్టు.. ఎవరి సర్వేలు వారివే అన్నట్టు మారుతున్నాయి. ఇప్పుడు సర్వేలు సైతం రాజకీయ వ్యూహంలో భాగంగా మారిపోయాయి. ఎవరి డప్పు వారు కొట్టుకున్న మాదిరిగా తయారయ్యాయి. ఏపీలో ఇటీవల విడుదలైన రెండు సర్వేలు విరుద్ధ ఫలితాలను వెల్లడించాయి. జాతీయ మీడియా అయిన టైమ్స్ నౌ సర్వేలో వైసిపి ప్రభంజనం అని తేలింది. ఏపీలో 25 ఎంపీ స్థానాలు గాను.. అన్ని సీట్లు వైసిపి యే దక్కించుకుంటుందని టైమ్స్ నౌ తేల్చేసింది. ఇక ఆత్మసాక్షి అనే సంస్థ సర్వే ఫలితాలను వెల్లడించింది. తెలుగుదేశం, జనసేన కూటమి అద్భుత విజయం దక్కించుకుంటుందని తేల్చింది. వైసిపి 43% ఓట్లు దక్కించుకుంటుందని.. టిడిపి, జనసేన కూటమి 54 శాతం ఓట్లు దక్కించుకుంటాయని సర్వేలో తేల్చింది.

టైమ్స్ నౌ సర్వేను ఒకసారి పరిశీలిద్దాం. ఇదే సంస్థ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు మూడుసార్లు సర్వేలను వెల్లడించింది. అన్నింటిలోనూ వైసీపీకి ఏకపక్ష విజయాన్ని కట్టబెట్టింది. అయితే ఈ సర్వే సంస్థ మూలాలు తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పైగా టైమ్స్ నౌ సంస్థ ఏపీ సర్కార్ ప్రచార బాధ్యతలు తీసుకున్నట్లు తెలుస్తోంది. యాట ఇందుకుగాను ఐదు కోట్ల రూపాయలు ముట్ట చెబుతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు జగన్ సర్కార్ సదరు సంస్థకు 25 కోట్లు సమర్పించుకున్నట్లు వ్యతిరేక మీడియా ఆరోపిస్తోంది. అందుకే ఏకపక్ష విజయాలను కట్టబెడుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో ఉన్న అన్ని లోక్సభ స్థానాలను వైసీపీ దక్కించుకుంటుందన్నది టైమ్స్ నౌ సంస్థ సర్వే సారాంశం. అయితే అది సాధ్యమా? అంటే మాత్రం కాదనే సమాధానం వినిపిస్తోంది. గత ఎన్నికల మాదిరిగా జగన్కు అనుకూలమైన వాతావరణం లేదని విశ్లేషణలు వెలబడుతున్నాయి. ఇటువంటి తరుణంలో 25 లోక్సభ స్థానాలు ఆ పార్టీ దక్కించుకుంటుందని చెబుతుండడం మాత్రం వాస్తవ విరుద్ధమని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆత్మసాక్షి సంస్థ ఏపీలో టిడిపి, జనసేన ఓటమి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంటుందని తేల్చింది. 54% ఓట్లతో మంచి మెజారిటీ సాధిస్తుందని చెప్పుకొస్తుంది. రెండు సంవత్సరాల కిందట ఇదే ఆత్మ సాక్షి సర్వేలో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని తేలింది. ఇప్పుడు మరోసారి తెలుగుదేశం పార్టీకి అనుకూల ఫలితాలు ఇవ్వడం విశేషం. వైసీపీకి 43% ఓట్లు, టిడిపికి 44, జనసేనకు 10% ఓట్లను ఈ సర్వే కట్టబెట్టింది. తెలుగుదేశం,జనసేన మధ్య పొత్తు కుదిరిన నేపథ్యంలో ఓటు శాతం పెంచుకునే అవకాశాలు ఉన్నాయని చెబుతోంది. చంద్రబాబు అరెస్టు తరువాత సానుభూతి పెరిగిందని.. దాని ఫలితంగానే ఈ కూటమి వైపు ప్రజలు మొగ్గు చూపినట్లు స్పష్టం చేసింది. అయితే ఆత్మసాక్షి అనేది టిడిపి అస్మదీయ సంస్థ అని వైసీపీ చెబుతోంది. అదంతా టిడిపికి అనుకూలత ఏర్పరచడానికి ఆ సంస్థ బోగస్ సర్వేలను బయటపెడుతోందని వైసీపీ లైట్ తీసుకుంటుంది.

రాజకీయ వ్యూహకర్తలు వచ్చిన తర్వాత.. ఈ సర్వేలు, అభిప్రాయ సేకరణలు పెరిగిపోయాయి. గతంలో సర్వే చేపట్టే సంస్థకు నిర్దిష్టమైన ప్రామాణికత ఉండేది. తాము ఎలా సర్వే చేసి ఫలితాలు వెల్లడించింది.. సదరు సంస్థలు బయట పెట్టేవి. గణాంకాలతో సహా వివరించేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కొన్ని మీడియా సంస్థలతో ఏజెన్సీలు ఒప్పందం చేసుకుని సర్వేలు చేస్తున్నాయి. ప్రజల నుంచి శాంపిల్స్ సేకరిస్తున్నాయి. అయితే ఇక్కడే లెక్క తప్పుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాజకీయ పార్టీల ప్రలోభాలకు లొంగి ఫలితాలను తారుమారు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అందుకే ప్రజలు సైతం సర్వేలు, ఎగ్జిట్ పోల్స్, అభిప్రాయాల సేకరణను లైట్ తీసుకుంటున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Oktelugu Epaper
Exit mobile version