https://oktelugu.com/

ఈ విధ్వంసం వెనుక ఆయనున్నారు: డీజీపీకి బాబు లేఖ

చిత్తూరు జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. బడా లీడర్లను గ్రుహ నిర్బంధం చేశారు.. అంతేకాకుండా జిల్లాలోని అంగళ్ల గ్రామంలో 144 సెక్షన్ విధించి ఎవరినీ అటువైపు రాకుండా కట్టడి చేస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు డీజీపీ ఓ లేఖ రాశారు. రాష్ట్రంలో అరాచకాలను అడ్డుకునేవారు లేరా..? అంటూ లేఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు. Also Read: ఏపీ మంత్రికి కంట్లో నలుసుగా మారిన జనసేన […]

Written By: , Updated On : December 12, 2020 / 01:32 PM IST
Chandrababu Naidu
Follow us on

Chandrababu Naidu

చిత్తూరు జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. బడా లీడర్లను గ్రుహ నిర్బంధం చేశారు.. అంతేకాకుండా జిల్లాలోని అంగళ్ల గ్రామంలో 144 సెక్షన్ విధించి ఎవరినీ అటువైపు రాకుండా కట్టడి చేస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు డీజీపీ ఓ లేఖ రాశారు. రాష్ట్రంలో అరాచకాలను అడ్డుకునేవారు లేరా..? అంటూ లేఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: ఏపీ మంత్రికి కంట్లో నలుసుగా మారిన జనసేన నేత..!

చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లెకు చెందిన టీడీపీ కార్యకర్త ఒకరు మరణించగా ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు శుక్రవారం టీడీపీ నేతలు బయలుదేరారు. ఈ క్రమంలో కురబలకోట మండలం అంగళ్లులో టీడీపీ నేతలపై దాడి జరిగింది. వైసీపీ నేతలే ఈ దాడి చేశారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో శనివారం ‘చలో తంబళ్లపల్లె’కు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు టీడీపీ నేతలను అరెస్టు చేశారు. అంతేకాకుండా టీడీపీ నాయకులు నరసింహాయాదవ్, పలమనేరులో మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి, కలికిరిలో నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి తదితర నేతలను హౌజ్ అరెస్టు చేశారు.

Also Read: 700 ట్రాక్టర్లలో రైతులు ఢిల్లీకి: రహదారి దిగ్బంధనం చేసిన రైతులు..

ఈఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు ప్రజాస్వామ్యానికి గండి కొడుతున్నారని విమర్శించారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ కే ఓ లేఖ రాశారు. అందులో ‘తంబళ్లపల్లెలో మాఫియా పడగ విప్పింది. కురబల కోట మండలం అంగళ్లు వద్ద అధికార పార్టీకి చెందిన 200 మంది టీడీపీ నాయకుల వాహనాలపై దాడి చేసి గాయపర్చారు. ఈ విధ్వంసక దాడి అంతటితో ఆగకుండా ఓ జర్నలిస్టుపై దాడి చేశారు.’ అని పేర్కొన్నారు.

అంతేకాకుండా చిత్తూరు జిల్లా పుంగనూరు అసెంబ్లీకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నాడని ఆయన ప్రొద్భలంతోనే దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్