Cyclone Dana : తీరం దాటిన ‘దానా’… ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో విధ్వంసం.. భారీ వర్షాలతో అతలాకుతలం

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో నాలుగు రోజుల క్రితం ఏర్పడిన దానా తుపాన్‌ ఎట్టకేలకు తీరం దాటింది. తుపాను తీరం దాటడంతో ఒడిశాలో కుంభవృష్టి కురుస్తోంది. బలమైన గాలులు వీస్తుండడంతో తీరప్రాంత జిల్లా ప్రజలు చిగురుటాకులా వణుకుతున్నారు.

Written By: Raj Shekar, Updated On : October 25, 2024 11:12 am

Cyclone Dana

Follow us on

Cyclone Dana :  పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిత దానా తుఫాన్‌ తీవ్రరూపం దాల్చింది. శుక్రవారం అర్ధరాత్రి 12:10 గంటలకు తీరాన్ని తాకింది. భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం తుపాను తీరం దాటిన నేపథ్యంలో తెల్లవారు జాము నుంచి ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లోని తీరప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని తెలిపింది. మయూర్‌భంజ్, కటక్, జాజ్‌పూర్, బాలాసోర్, భద్రక్, కేంద్రపారా మరియు జగత్‌సింగ్‌పూర్‌ అనే ఏడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరిక జారీచేసింది. ఖుర్దా, నయాగర్‌ మరియు ధెంకనల్‌తో సహా ఐదు జిల్లాలకు ‘ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

సురక్షిత ప్రాంతాలకు ప్రజలు..
దానా తుఫాను ప్రభావిత జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను ఒడిశా, పశ్చిమబెంగాల్‌ అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఒడిశా సీఎం మోహన్‌ చరణ్‌మాఝీ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. బుధవారం నుంచే ముంపు బాధితుల తరలింపు చేపట్టాలని ఆదేశించారు. డేంజర్‌ జోన్‌లో ఉన్న 30 శాతం మందిని(సుమారు 4 లక్షల మంది)తరలించారు. సాయం కోసం హెల్ఫ్‌లైన్‌ నంబర్లు ఏర్పాటు చేశారు. టోల్‌ ఫ్రీ నంబర్‌– 1929, ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సపోర్ట్‌ సిస్టమ్‌: 112, బాలేసోర్‌: 06782–262286 / 261077, మయూర్‌భంజ్‌: 06792–2527941,252756 81, జాజ్‌పూర్‌: 06728–222648, కేంద్రపాడ: 06727–232803 , కియోంఝర్‌: 06766–255437, జగత్‌సింగ్‌పూర్‌: 06724–220368, కటక్‌: 0671–2507842, ధెంకనల్‌: 06762–226507 / 221370, 62727

పశ్చిమ బెంగాల్‌లో కూడా హెల్ప్‌లైన్‌ నంబర్‌లు
హెల్ప్‌లైన్‌: 2214 3526, వెస్ట్‌ బెంగాల్‌ పోలీస్‌: 033 22145486 / 22141988, కోల్‌కతా మునిసిపల్‌ కార్పొరేషన్‌: 91 33 2286– 1212/ 14143/ 14143

అధికారుల సూచనలు..
– దానా తుపాను ఒడిశా తీరానికి చేరువవుతున్నందున, పూరీలోని జగన్నాథ ఆలయాన్ని దర్శించుకోవద్దని అధికారులు భక్తులకు సూచించారు. తుఫాను ప్రభావాన్ని తగ్గించేందుకు 12వ శతాబ్దపు ఆలయాన్ని రక్షించేందుకు సన్నాహాలు వేగవంతం చేస్తున్నారు. పూరి జిల్లా కలెక్టర్‌ సిద్ధార్థ్‌ ఎస్‌ స్వైన్‌ మాట్లాడుతూ, నెల రోజుల పాటు జరిగే ‘కార్తీక బ్రత’ ఆచారాన్ని పాటించే భక్తులతో సహా, భద్రతా చర్యగా ఆలయాన్ని సందర్శించడం మానుకోవాలని అన్నారు.

– నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ ఒడిశా జిల్లాలైన మహాకల్పా, కేంద్రపరా వంటి వాటిల్లో అవగాహన ప్రచారాలను ప్రారంభించింది, దానా తుఫాను గురించి ప్రజలకు తెలియజేయడానికి ఇంటింటికీ వెళ్లి లౌడ్‌ స్పీకర్లను ఉపయోగిస్తుంది.

– ఒడిశా తీరప్రాంతాల్లో గురువారం ఉదయం భారీ వర్షాలు, బలమైన గాలులు వీచాయి, అయితే ’దానా’ తుఫాను రాష్ట్ర తీరప్రాంతానికి దగ్గరగా వెళ్లడంతో సముద్ర పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నాయి.

– వాతావరణ శాఖ ప్రకారం, పశ్చిమ బెంగాల్‌లోని అనేక జిల్లాలు గురువారం ఉదయం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

– తుఫాను కోసం అధికారులు సిద్ధమవుతున్నందున గురువారం ఉదయం డేంజర్‌ జోన్ల నుంచి తరలింపు ప్రయత్నాలు జరుగుతున్నాయి.