నన్ను కలలో రేప్ చేశాడు..! పోలీసులకు మహిళ ఫిర్యాదు..

పోలీస్ స్టేషన్లకు ఈమధ్య విచిత్ర కేసులు వస్తున్నాయి. తమకు న్యాయం చేయాలని వింత వింత కేసులు పెట్టాలని వేడుకోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ.. ఓ మాంత్రికుడు తనపై రేప్ చేశాడని ఫిర్యాదు చేసి అతనిపై కేసు పెట్టాలని కోరింది. అయితే ఆయన అత్యాచారం చేసింది కలలోనట. తనకు రోజూ కలలో వచ్చి వేధింపులకు గురి చస్తున్నాడని, అతని పోరు పడలేకపోతున్నానని వివరించింది. దీంతో ఆ పోలీసులు మహిళ నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. మరి […]

Written By: NARESH, Updated On : June 25, 2021 8:09 am
Follow us on

పోలీస్ స్టేషన్లకు ఈమధ్య విచిత్ర కేసులు వస్తున్నాయి. తమకు న్యాయం చేయాలని వింత వింత కేసులు పెట్టాలని వేడుకోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ.. ఓ మాంత్రికుడు తనపై రేప్ చేశాడని ఫిర్యాదు చేసి అతనిపై కేసు పెట్టాలని కోరింది. అయితే ఆయన అత్యాచారం చేసింది కలలోనట. తనకు రోజూ కలలో వచ్చి వేధింపులకు గురి చస్తున్నాడని, అతని పోరు పడలేకపోతున్నానని వివరించింది. దీంతో ఆ పోలీసులు మహిళ నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. మరి ఆ మాంత్రికుడిని ఏం చేశారంటే..?

బీహార్ లోని ఔరంగాబాద్ జిల్లా కుథ్వా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ తన కొడుకుతో కలిసి జీవిస్తోంది. తన కుమారుడు అనారోగ్యంగా మారడంతో ఓ మాంత్రికుడి దగ్గరికి తీసుకెళ్లింది. అయితే ఆయన ర!కరకాల పూజలు చేశాడు. కానీ మహిళ కుమారుడు బతకలేదు. కొన్ని రోజుల తరువాత ఆనారోగ్యం తీవ్రమై మరణించాడు. దీంతో ఆ మహిళ తన కుమారుడు ఎందుకు మరణించాడని ఆ మాంత్రికుడిని నిలదీసింది. అయితే అలా వెళ్లిన మహిళపై మాంత్రికుడు అత్యాచారం చేశాడని మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

మహిళ నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణ చేపట్టారు. మాంత్రికుడిని విచారించగా తనను కలుసుకోవడం ఇదే మొదటి సారి అని, తనెవరో తెలియదని తెలిపాడు. అయితే పోలీసులు సైతం ఇంకా లోతుగా విచారించినా మాంత్రికుడికి వ్యతిరేకంగా సాక్షాలు లభించలేదు. దీంతో ఆ మాంత్రికుడి సైన్ తీసుకొని పంపించారు. అయితే నిత్యం ప్రజా సంక్షేమం కోసం తీరిక లేకుండా పనిచేస్తున్న పోలీసులకు ఇలాంటి కేసులు తలనొప్పిగా మారుతున్నాయని చర్చించుకుంటున్నారు.