
కరోనా ప్రభావంతో రాష్ట్ర ఆర్థిక వనరులు తగ్గిపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు, పెన్షన్ లలో 50 శాతం మాత్రమే చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ అంశంపై వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ముఖ్యంగా పెన్షనర్ల పెన్షన్ లో కోత విధించడాన్ని అన్ని వర్గాలు తప్పుబట్టయి. దీంతో పెన్షన్ పూర్తి స్థాయిలో చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఆర్ధిక శాఖ జి.ఓ 37 ను ఆదివారం జారీ చేసింది. రేపటి నుంచి జీతాల బిల్లులు చేసుకునే అవకాశం.
పెన్షన్లపై కోత విధించడాన్ని ఆ సంగం తరుపున కొందరు కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 22వ తేదీన సీఎం జగన్ కు లేఖ రాశారు. ఎట్టకేలకు ప్రభుత్వం
దిగి వచ్చింది.