తిరుపతి బైపోల్‌లో గ్లామర్‌‌ షో

మరికొద్ది రోజుల్లో తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగబోతోంది. అయితే.. తిరుపతి సీటు అంటే కేరాఫ్‌ సినీ గ్లామర్‌‌. ఎందుకంటే ఇక్కడి ఓటర్లు ఏ ఎన్నికల్లో అయినా సినీ గ్లామర్‌‌ వాళ్లకే పట్టం కట్టారు. ఎన్టీఆర్‌, చిరంజీవి తిరుపతి నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారే. గెలుపోటములను పక్కనపెడితే వారి పోటీ ప్రభావం సమీప నియోజకవర్గాలపైనా పడింది. ఇప్పుడు బీజేపీ కూడా అదే ప్లాన్ చేస్తోంది. అలనాటి హీరోయిన్లను బీజేపీలో చేర్చుకుని తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల ప్రచారానికి […]

Written By: Srinivas, Updated On : January 9, 2021 3:29 pm
Follow us on


మరికొద్ది రోజుల్లో తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగబోతోంది. అయితే.. తిరుపతి సీటు అంటే కేరాఫ్‌ సినీ గ్లామర్‌‌. ఎందుకంటే ఇక్కడి ఓటర్లు ఏ ఎన్నికల్లో అయినా సినీ గ్లామర్‌‌ వాళ్లకే పట్టం కట్టారు. ఎన్టీఆర్‌, చిరంజీవి తిరుపతి నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారే. గెలుపోటములను పక్కనపెడితే వారి పోటీ ప్రభావం సమీప నియోజకవర్గాలపైనా పడింది. ఇప్పుడు బీజేపీ కూడా అదే ప్లాన్ చేస్తోంది. అలనాటి హీరోయిన్లను బీజేపీలో చేర్చుకుని తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల ప్రచారానికి గ్లామర్‌ వచ్చేందుకు సిద్ధమైంది. అంతేకాదు.. వైసీపీ ఫైర్‌బ్రాండ్‌ రోజా దూకుడుకు కళ్లెం వేయడానికి పెద్ద ఎత్తగడనే అమలు చేయబోతోంది.

Also Read: ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం

చిత్తూరు ఉప ఎన్నికల్లో మరోసారి గ్లామర్‌‌ షో కనిపించబోతోంది. ఇప్పటికే వైసీపీలో రోజా ఉండగా.. తాజాగా నాటి హీరోయిన్లు వాణీ విశ్వనాథ్‌, ప్రియారామన్‌లు బీజేపీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. పార్టీలో తగిన ప్రాధాన్యం ఇస్తామని వారికి హామీ సైతం ఇచ్చారట కమలనాథులు. ముఖ్యంగా నగరిలో రోజాకు పోటీగా వచ్చే ఎన్నికల్లో వాణీ విశ్వనాథ్‌ను బరిలో దించుతారని చెవులు కొరుక్కుంటున్నారు. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక నుంచే దీనికి సంబంధించిన రోడ్‌ మ్యాప్‌ను సిద్ధం చేయబోతున్నారట.

మరోవైపు.. నగరి నియోజకవర్గానికి కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఈ నియోజకవర్గం కంప్లీట్‌గా తమిళనాడుకు సరిహద్దుల్లో ఉంటుంది. ఇక్కడి ఓటర్లలో సగానికిపైగా తమిళులే ఉంటారు. అందుకే.. గతంలో ఇక్కడ టీడీపీ పలు ప్రయోగాలు చేసింది. టీడీపీ నుంచి 1994లో నిర్మాత దొరస్వామిరాజు గెలిచారు. తర్వాత టీడీపీ నుంచి హీరోయిన్‌ రోజా బరిలో దిగినా సక్సెస్ కాలేదు. అయితే అదే రోజా వైసీపీలో చేరాక 2014, 2019 ఎన్నికల్లో వరసగా గెలిచారు. 2019లోనే వాణీ విశ్వనాథ్‌ టీడీపీలో చేరుతారనే ప్రచారం జరిగింది. అప్పట్లో సీఎం చంద్రబాబుతోనూ ఆమె భేటీ అయ్యారు. నగరిలో రోజాపై వాణి విశ్వనాథ్‌ పోటీ చేస్తారని అనుకున్నారు. ఆ సమయంలో రోజా, వాణీ విశ్వనాథ్‌ మధ్య మాటల తూటాలు పేలాయి. అయితే గాలి ముద్దుకృష్ణమనాయుడు కుటుంబానికి చంద్రబాబు టికెట్‌ ఇవ్వడంతో ఆమె టీడీపీలో చేరలేదు.

Also Read: ఆలయాలపై దాడులు..: తెలంగాణ పోలీసులు ఎంక్వైరీ చేయాలంట

ఇప్పటివరకు టీడీపీ వేసిన ప్లాన్‌ను ఇప్పుడు బీజేపీ అమల్లోకి తీసుకు రాబోతోంది. రోజా ఎక్కడ ప్రచారం చేస్తే అక్కడ వాణీ విశ్వనాథ్‌ను ప్రచారానికి పంపాలని డిసైడ్‌ అయ్యారట. వాణీ విశ్వనాథ్‌ కూడా ఈ ఛాన్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ జార విడుచుకోవద్దని భావిస్తున్నట్టు సమాచారం. ఎమ్మెల్యే రోజాకు సరైన కౌంటర్‌ ఇచ్చేందుకు తాను సిద్ధమని బీజేపీ నేతలకు చెప్పినట్టు తెలుస్తోంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్