Allu Arjun Politics : ఈరోజు ఉదయం నుండి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే వార్త సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ప్రచారం జరుగుతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అల్లు అర్జున్ ఏంటి ?, రాజకీయాల్లోకి రావడం ఏంటి?, చాలా విడ్డూరంగా ఉందే, పాన్ ఇండియా లెవెల్ లో భారీ కాంబినేషన్ సినిమాలు చేస్తూ , పీక్ రేంజ్ కెరీర్ ని వదులుకొని ఆయన ఎందుకు రాజకీయాల్లోకి వస్తారు?, అసలు వచ్చే సూచనలు కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదే?, అసలు ఏమి జరుగుతోంది అంటూ అభిమానులు సైతం షాక్ కి గురయ్యారు. ఎందుకంటే ఈ వార్త ని ప్రచురించింది ఒక టాప్ వెబ్ సైట్, ఒక రాజకీయ పార్టీ కి చెందినది కాబట్టే, ఈ రేంజ్ లో సీరియస్ గా తీసుకున్నారు నెటిజెన్స్. అంతే కాదు , ఆ వెబ్ సైట్ కి వచ్చిన సమాచారం ప్రకారం రీసెంట్ గానే అల్లు అర్జున్ ముంబై లో ప్రశాంత్ కిషోర్ ని కలిశారట.
2019 ఎన్నికల్లో జగన్ సీఎం అవ్వడానికి , అదే విధంగా ఈ ఏడాది తమిళనాడు లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి సినీ నటుడు విజయ్ సీఎం అవ్వడానికి ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీలు ఏ రేంజ్ లో పనికొచ్చాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇతనితో అల్లు అర్జున్ రాజకీయ అరంగేట్రం చేయడానికి రూట్ మ్యాప్ సిద్ధం చేయమని రిక్వెస్ట్ చేశారట. అంతే కాదు , అల్లు అర్జున్ మామయ్య చంద్ర శేఖర్ రెడ్డి కూడా రాజకీయ పరంగా చాలా ప్రోత్సాహాన్ని అందిస్తున్నట్టు చెప్పుకొచ్చింది సదరు వెబ్ సైట్. అయితే ఈ వార్తలపై అల్లు అర్జున్ పీఆర్ టీం స్పందించింది. అల్లు అర్జున్ కి వ్యక్తిగత మ్యానేజర్ గా పని చేస్తున్న శరత్ చంద్ర మాట్లాడుతూ ‘మీరు ప్రచారం చేస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు’ అంటూ రిప్లై ఇచ్చారు.
దీంతో అల్లు అర్జున్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు అనే వార్తల ప్రచారానికి చెక్ పడింది. అయితే నిప్పు లేనిదే పొగ రాదని పెద్దలు అంటుంటారు. అల్లు అర్జున్ ప్రశాంత్ కిషోర్ తో ఎలాంటి సంప్రదింపులు జరపకపోయుంటే , ఇలాంటి వార్తలు ఈ సమయం లో ఎందుకు వస్తాయి?, కచ్చితంగా ఎదో జరుగుతోంది, సోషల్ మీడియా లో లీక్ అయిపోవడం వల్ల, అల్లు అర్జున్ పీఆర్ టీం కావాలనే ఇలా అబద్దం చెప్పి ఉండొచ్చు కదా.. అల్లు అర్జున్ ఇప్పట్లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు లేవు, ఆయన టార్గెట్ 2034 ఎన్నికలు కాబట్టి , అల్లు అర్జున్ అప్పుడే ఈ విషయం పై సోషల్ మీడియా లో చర్చ ఎందుకు అనే ఉద్దేశ్యంతోనే తన పీఆర్ టీం తో ఇలా చెప్పించి ఉండచ్చేమో అనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారు నెటిజెన్స్.
There is no truth to this information.
— Sarath Chandra Naidu (@imsarathchandra) July 10, 2026
