Viveka Murder Case: పిటిషన్లతో ప్లాన్ చేస్తున్నారు.. కొలిక్కిరాని వివేకా కేసు

Viveka Murder Case: సంచలనం సృష్టించిన వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు వైఎస్. వివేకానందరెడ్డి హత్య కేసులో రోజుకో ట్విస్టు షాకునిస్తోంది. రెండేళ్ల పాటు నిందితులు ఎవరో కనిపెట్టకపోవడంతో కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్లిపోయింది. వెంటనే చార్జిషీటు దాఖలు చేసిన అధికారులు అనుమానితులకు అందులో చేర్చి విచారణ జరిపించారు. ఈ క్రమంలో వీరిని కేసునుంచి తప్పించేందుకు భారీ వ్యూహాలే తెరవెనుక నడుస్తున్నట్లు తెలుస్తోంది. నిందితులు క్వాష్ పిటిషన్ వేసుకోవడంతో కేసు కొలిక్కిరావడం లేదు. అనేక పిటిషన్లు వేయడం […]

Written By: Neelambaram, Updated On : December 3, 2021 12:47 pm
Follow us on

Viveka Murder Case: సంచలనం సృష్టించిన వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు వైఎస్. వివేకానందరెడ్డి హత్య కేసులో రోజుకో ట్విస్టు షాకునిస్తోంది. రెండేళ్ల పాటు నిందితులు ఎవరో కనిపెట్టకపోవడంతో కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్లిపోయింది. వెంటనే చార్జిషీటు దాఖలు చేసిన అధికారులు అనుమానితులకు అందులో చేర్చి విచారణ జరిపించారు. ఈ క్రమంలో వీరిని కేసునుంచి తప్పించేందుకు భారీ వ్యూహాలే తెరవెనుక నడుస్తున్నట్లు తెలుస్తోంది. నిందితులు క్వాష్ పిటిషన్ వేసుకోవడంతో కేసు కొలిక్కిరావడం లేదు. అనేక పిటిషన్లు వేయడం కారణంగా అసలు విషయం పక్కదారి పట్టే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. అసలు కేసు విషయం పక్కన పెట్టి క్వాష్ పిటిషన్ల విచారణ నిర్వహించడంతో వివేక హత్యకేసు విచారణ ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉంది.

Viveka Murder Case

కేసులో అప్రువర్ గా మారిన వివేకానంద కారు డ్రైవరు షేక్ దస్తగిరి ఇప్పటికే పోలీసులకు అన్ని విషయాలు వివరించారు. బెంగళూరు లాండ్ విషయంలో వాటా ఇవ్వని కారణంగానే వివేకానందరెడ్డిని హత్యకు ప్లాన్ చేసినట్లు ప్రాథమిక విచారణలో ఒప్పుకున్నాడు. గంగిరెడ్డి హత్యకు ప్లాన్ చేశాడని.. రూ.40కోట్లు ఇస్తానన్నాడని.. అయినా.. తాను హత్య చేసేందుకు ఒప్పుకోలేదని వివరించాడు.ఈ క్రమంలో విచారణలో బడా నేతల పేర్లు ప్రస్తావించాడు. ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, గుజ్జుల ఊమాశంకర్ తో కలిసి వివేకానందను హత్య చేసినట్లు దస్తగిరి ఒప్పుకున్నాడు.
Also Read: ఏపీ నిధుల దాహానికి కేంద్రం బిగ్ షాక్..

ఈ క్రమంలో దస్తగిరి, గంగిరెడ్డి , దస్తగిరి క్వాష్ పిటిషన్లతో కేసునుంచి తప్పించుకునే ఆలోచన చేస్తున్నారని బీసీఐ అధికారులు భావిస్తున్నారు. కేసు విచారణను ఆలస్యం చేసేందుకు ఇద్దరూ కలిసి అనవసరపు పిటిషన్లు వేస్తూ.. విచారణను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీ హైకోర్టులో ఒకేరోజు రెండు పిటిషన్లు దాఖలు అయ్యాయి. అందులో ఒకటి ఎర్ర గంగిరెడ్డిది కాగా.. ఆయన దస్తగిరి ఇచ్చిన వాగ్మూలంలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. గతంలోనే బెయిల్ పై విడుదల కాగా.. ఇప్పుడు తనకు కేసుతో సంబంధం లేదని కోర్టులో పిటిషన్ వేశారు. ఇదే క్రమంలో దస్తగిరి అప్రూవర్ గా మారేందుకు అంగీకరించొద్దని.. మరో పిటిషన్ దాఖలు అయ్యింది. అంటే.. ఒక్క కీలక కేసు నుంచి నిందితులు తప్పించుకునేందుకు అనేక రకాల పిటిషన్లు దాఖలు చేస్తూ.. వివేకా హత్యకేసును నీరుగారుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Also Read: వాళ్లతో ‘పంచాయితీ’.. జగన్ కు మంచిది కాదా?

Tags