spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Gadapa Gadapaki YSRCP: మోగని సామాజిక న్యాయభేరి.. ముఖం చాటేస్తున్న ప్రజలు

Gadapa Gadapaki YSRCP: మోగని సామాజిక న్యాయభేరి.. ముఖం చాటేస్తున్న ప్రజలు

Gadapa Gadapaki YSRCP: గడపగడపకూ వైసీపీ ప్రభుత్వం కార్యక్రమం ఫెయిలైంది. మంత్రుల సామాజిక న్యాయభేరి సైతం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోవడంలేదు. ప్రజలు ముఖం చాటేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రమాదం తప్పదా? అంటూ సగటు వైసీపీ నాయకులు, కార్యకర్తలకు తొలుస్తున్న ప్రశ్నలు ఇవి. మూడేళ్లలో చేసిన పనులు చెప్పేందుకు ‘గడపగడపకు వైసీపీ ప్రభుత్వం’ బాట పట్టిన ప్రజాప్రతినిధులకు నిలదీతలు, ప్రజల నుంచి ఛీత్కారాలు ఎదురయ్యాయి. దీంతో కేబినెట్ లోని 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రులు సామాజిక న్యాయభేరి యాత్రకు సిద్ధమయ్యారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభమైన యాత్రకు జన సమీకరణ చేయడం నేతలకు పెద్ద ఇబ్బందిగా మారింది. 17 మంది మంత్రులు వచ్చేసరికే సగానికి పైగా జనం సభా స్థలం నుంచి వెళ్లిపోతున్నారు. పోలీసులు గేట్లు వేసి ఆపాలని చూసినా జనం ఆగలేదు. వాళ్లను తోసుకుంటూ వెళ్లిపోతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శుక్రవారం జరిగిన వైసీపీ సామాజిక భేరిలో అయితే చివరకు ఖాళీ కుర్చీలు చూసుకొని మంత్రులు ప్రసంగాలు చేయాల్సి వచ్చింది. పథకాలు ఆపేస్తామని డ్వాక్రా మహిళలను బెదిరగొడుతూ, ఉపాధి పనులు నిలిపివేస్తామని కూలీలను అదరగొడుతూ మంత్రుల సభలను విజయవంతం చేసేందుకు అధికారులు చెమటోర్చుతున్నారు. విశాఖపట్నంలో శుక్రవారం పూర్తిగా డ్వాక్రా మహిళలతో ‘యాత్ర’ సభను లాగించేశారు. విశాఖలో తిరిగి మొదలైన యాత్ర రాజమహేంద్రవరానికి సాయంత్రం నాలుగు గంటలకు చేరుకుంటుందని చెప్పారు. దీనికోసం మధ్యాహ్నం రెండుగంటల నుంచే వివిధ బస్సులలో తీసుకొచ్చి మహిళలు, వృద్ధులను కూర్చోపెట్టారు. కానీ 6 గంటలైనా మంత్రుల బస్సు రాకపోవడంతో జనం తిరుగుముఖం పట్టారు. సుమారు రాత్రి 7 గంటలకు మంత్రుల బస్సు వచ్చింది. అప్పటికే సగం జనం వెళ్లిపోయారు. ఎందుకు జనాన్ని తీసుకొచ్చి ఇబ్బంది పెడతారని పోలీసులతో మహిళలు వాగ్వాదానికి దిగారు. ఈ సభ జన సమీకరణకు మండలానికి 15 ప్రైవేట్‌ బస్సుల వరకూ ఏర్పాటు చేశారు. ఇక, మంత్రుల బస్సుయాత్రతో కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలీసులు షాపులు మూసివేయించారు. బస్సులు కాంప్లెక్స్‌కు రాకుండా దారి మళ్లించారు. కిలోమీటరు నడిచివెళ్లి బస్సు ఎక్కాల్సి రావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Gadapa Gadapaki YSRCP
Gadapa Gadapaki YSRCP

మహిళల సమీకరణ..

వైసీపీ మం త్రులు శుక్రవారం గాజువాకలో నిర్వహించిన ‘సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర’ సభలో స్వయం సహాయక సంఘాల సభ్యులే కనిపించారు. సభకు హాజరైన వారిలో 90 శాతానికిపైగా డ్వాక్రా మహిళలే ఉన్నారు. గాజువాక సభకు చుట్టుపక్కల ప్రాంతాల్లో గల ప్రతి రిసోర్స్‌ పర్సన్‌ (ఆర్‌పీ) తమ పరిధిలోని మహిళా సంఘాల సభ్యులను తీసుకురావాలని జీవీఎంసీ యూసీడీ అధికారులు ఆదేశించారు. దీంతో ఉదయం ఎనిమిది గంటలకే నాయకులు ఏర్పాటు చేసిన బస్సులు, ఆటోల్లో మహిళలు సభా వేదిక వద్దకు చేరుకున్నారు. సభకు వచ్చిన మహిళలను ఆర్‌పీలు గ్రూపు ఫొటోలు తీసి తమ ఉన్నతాధికారులకు పంపించడం కనిపించింది. బస్సు యాత్రలో మంత్రుల ప్రసంగాలు కూడా ఏమంత ఆకట్టుకునేలా లేవు. కరోనా సమయంలో ఒక్క కుటుంబం కూడా రాష్ట్రంలో కన్నీళ్లు కార్చలేదని రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించడంతో అక్కడున్న వారంతా బిక్క ముఖం వేయాల్సి వచ్చింది.

Also Read: Power Cuts Again AP: మళ్లీ విద్యుత్ కోతలు..భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం

ఊసులేని ‘గడపగడప’

సామాజిక న్యాయ భేరీ బస్సు యాత్ర పుణ్యమా అని గడపగడపకూ వైసీపీ ప్రభుత్వం కార్యక్రమం బెడద తప్పిందని వైసీపీ ప్రజాప్రతినిధులు వ్యాఖ్యానిస్తున్నారు. అసలు చాలా నియోజకవర్గాల్లో కార్యక్రమం తూతూమంత్రంగా జరిపించారు. ఎక్కడికక్కడే ప్రజలు నిలదీస్తుండడం, మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో గ్రామాల సందర్శనకు నేతలు భయపడ్డారు. కార్యక్రమ నిర్వహణలో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తమకు సేఫ్ జోన్ గా నిలిచే గ్రామాలను ఎంపిక చేసుకుంటున్నారు. తాజాగా బస్సు యాత్ర పేరిట కొంతమంది ప్రజాప్రతినిధులు తప్పించుకుంటున్నారు. కార్యక్రమానికి జన సమీకరణ పేరుతో గడపగడపకూ వైసీపీ ప్రభుత్వం కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటున్నారు.

Also Read: 3 Years of Jagan Governance: జగన్ పాలనకు మూడేళ్లు.. ఎన్నో వివాదాలు.. సంక్షేమ ఫలాలు

Recommended Videos:
ఎన్టీఆర్ నట విశ్వరూపానికి  నిదర్శనాలు ఇవే || Sr NTR Birthday Special Video || NTR Satha Jayanthi
ఎఫ్ 3 మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ || F3 Movie First Day Collections || Ok Telugu Entertainment

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Ram Gopal Varma: ఆ హీరోను చంపేస్తా…ఆర్జీవీ కి చెప్పిన ఫ్యాక్షనిస్టు…వైరల్ వీడియో…

Ram Gopal Varma: 'శివ' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ దశాదిశా మార్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ...అప్పటి వరకు తెలుగు సినిమాలు అంటే ఒక మూస ధోరణి కథలతో సాగేవిగా ఉండేవి...కానీ...

YSRCP: వైసీపీలో కాపు నేతల తిరుగుబాటు!

YSRCP: కాపు అస్త్రంతో కూటమిని చీల్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఇప్పుడు అదే కాపు అస్త్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గుచ్చుకోబోతోంది. కూటమిని ఇరకాటంలో పెట్టేందుకు, కాపు ఓటు బ్యాంకు ను ఆకట్టుకోవడానికి...

Nagarjuna: రాజమౌళి – అఖిల్ కాంబోను సెట్ చేయాలని చూసిన నాగార్జున…జక్కన్న రియాక్షన్ ఇదేనా…

Nagarjuna: దర్శక ధీరుడు రాజమౌళి చేసే ప్రతి సినిమా విషయంలో చాలా క్లారిటి ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమా సక్సెస్ ను సాధించాడానికి గల ముఖ్య...

Music Directors: ఈ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కి తిరుగులేదా…

Music Directors: సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లకు చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఒక సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తుంటారు. ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమాని...

Jagan Mohan Reddy: జగన్ కోసం ఢిల్లీలో రంగంలోకి ఆ సీనియర్!

Jagan Mohan Reddy: అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం వేరేలా ఉంటుంది. కోల్పోతే అసలు విషయం తెలిసి వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అదే ఎదురైంది. ఒకప్పుడు ఢిల్లీలో అడుగుపెడితే చాలు రాచమర్యాదలు...
Oktelugu Epaper
Exit mobile version