Rupee Journey: 75 ఏళ్ల స్వాతంత్య్రం.. 75 రూపాయలు పతనం.. రూ.4 నుంచి రూ.80 వరకు రూపాయి ప్రయాణం!

Rupee Journey: డాలర్‌తో పోల్చితే.. రూపాయి విలువ రోజురోజుకూ పడిపోతుండడం టెన్షన్‌ పెడుతోంది. అయితే భారతదేశం 75 ఏళ్ల స్వాతంత్య్రంలో ఆర్థికంగా చాలా పురోగతి సాధించింది. 2047 నాటికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మార్చాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ఈ 75 ఏళ్లలో భారత కరెన్సీ కూడా చాలా ముందుకు వచ్చింది. ఏ దేశ కరెన్సీ ఆ దేశ ఆర్థిక వ్యవస్థ బలాన్ని కొలవడానికి బేరోమీటర్‌గా పరిగణించబడుతుంది. 75 ఏళ్లలో భారత కరెన్సీ డాలర్‌తో పోలిస్తే.. […]

Written By: Raghava Rao Gara, Updated On : August 16, 2022 3:47 pm
Follow us on

Rupee Journey: డాలర్‌తో పోల్చితే.. రూపాయి విలువ రోజురోజుకూ పడిపోతుండడం టెన్షన్‌ పెడుతోంది. అయితే భారతదేశం 75 ఏళ్ల స్వాతంత్య్రంలో ఆర్థికంగా చాలా పురోగతి సాధించింది. 2047 నాటికి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మార్చాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ఈ 75 ఏళ్లలో భారత కరెన్సీ కూడా చాలా ముందుకు వచ్చింది. ఏ దేశ కరెన్సీ ఆ దేశ ఆర్థిక వ్యవస్థ బలాన్ని కొలవడానికి బేరోమీటర్‌గా పరిగణించబడుతుంది. 75 ఏళ్లలో భారత కరెన్సీ డాలర్‌తో పోలిస్తే.. రూ.4 నుంచి రూ.80 చేరుకుంది.

Rupee Journey

1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు ఒక డాలర్‌ విలువ కేవలం 4 రూపాయలకు సమానం. ఆ తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ ఎన్నో ఒడిదుడుకులను చవిచూసింది. 1960లో ఆహారం, పారిశ్రామిక ఉత్పత్తిలో తిరోగమనం ఆర్థిక రంగాన్ని ప్రభావితం చేసింది. ఆర్థిక సంక్షోభం నుంచి ఆహార ధాన్యాలు, పారిశ్రామిక ఉత్పత్తి తగ్గింపు వరకు ఎదుర్కోవలసి వచ్చింది. భారత్‌–చైనా యుద్ధం, భారత్‌–పాకిస్తాన్‌ యుద్ధం చెల్లింపు సంక్షోభానికి దారితీసింది. ఖరీదైన దిగుమతి బిల్లుల కారణంగా భారతదేశ విదేశీ మారక నిల్వలు ఖాళీగా ఉండేవి. భారత్‌ డిఫాల్ట్‌ అంచున ఉంది. అప్పుడు దివంగత ప్రధాని ఇందిరాగాంధీ రూపాయి విలువను తగ్గించాలని నిర్ణయించారు. ఆ తర్వాత ఒక డాలర్‌తో రూపాయి విలువ 4.76 నుంచి 7.5 రూపాయలకు పడిపోయింది.

Also Read: YCP Leaders romance : వైసీపీ నేతల వికృత శృంగార చేష్టలు తప్పు కాదు.. సర్టిఫికెట్ ఇచ్చిన ఒక ప్రముఖ వెబ్ సైట్ అధినేత

1991లో మరో ఆర్థిక సంక్షోభం..
1991లో మరోసారి భారత ఆర్థిక వ్యవస్థ సంక్షోభం ఎదుర్కొంది. దిగుమతి అవసరాలను తీర్చడానికి విదేశీ మారక నిల్వలు లేవు.. అప్పు కట్టేందుకు డబ్బులు లేవు. భారత్‌ మళ్లీ డిఫాల్ట్‌ అంచున నిలిచింది. ఆ తర్వాత చారిత్రక ఆర్థిక సంస్కరణ నిర్ణయం తీసుకున్నారు. సంక్షోభాన్ని నివారించడానికి, రెండు దశల్లో రూపాయి విలువను తగ్గించింది. మొదట 9 శాతం, తరువాత 11 శాతం. ఈ విలువ తగ్గింపు తర్వాత ఒక డాలర్‌తో రూపాయి విలువ 26 రూపాయలుగా మారింది. అంటే స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో రూపాయి విలువ రూ.4 నుంచి రూ.79 నుంచి రూ.80 స్థాయికి దిగజారింది. అంటే 75 ఏళ్లలో రూపాయి 75 రూపాయలు బలహీనపడింది.

Rupee Journey

బలహీనతకు అనేక కారణాలు..
డాలర్‌తో పోల్చినప్పుడు రూపాయి విలువ బలహీన పడడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముడి చమురు దిగుమతులు పెరగడంతో వాణిజ్యలోటు పెరిగింది. ఇది దాదాపు 31 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. అయితే భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు భారతదేశానికి ఎలాంటి నష్టం జరగలేదు. ప్రపంచవ్యాప్త ఆర్థిక సంక్షోభం కారణంగా 2008లో రూపాయి మరింత బలహీనపడింది. 2009లో 46.4 స్థాయిలో ఉన్న రూపాయి, 2022లో రూ.79.5 స్థాయికి దిగజారింది. గతంలో ఎన్నడూ లేనంతగా నరేంద్రమోదీ ప్రధాని అయ్యాక రూపాయి పతనం అంచున చేరింది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత రేటు పెరిగింది. రూపాయి బలహీన పడడానికి ప్రధాన కారణం వాణిజ్య లోటు. ఈ క్రమంలో రాబోయే 25 ఏళ్లలో దేశం అందరికంటే ముందుండాలని ప్రధాని పిలుపునిచ్చారు. కాగా, ఇప్పుడు రూపాయి విలువ తగ్గే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే ఆర్‌బీఐ వద్ద విదేశీ మారకద్రవ్య నిల్వలకు కొరత లేదు.

Also Read: Chandrababu: చంద్రబాబు నయా ఫార్ములా..ఒక కుటుంబానికి ఒకటే టిక్కెట్

Tags