ఆంధ్రప్రదేశ్‌క‌రోనాతో మాజీ ఎంపీ స‌బ్బం హ‌రి క‌న్నుమూత‌

క‌రోనాతో మాజీ ఎంపీ స‌బ్బం హ‌రి క‌న్నుమూత‌

Sabbam Hari
క‌రోనా మ‌హ‌మ్మారి వారూ వీర‌నే తేడా లేకుండా అంద‌రినీ బ‌లిగొంటోంది. ఈ వైర‌స్ బారిన ప‌డి సామాన్య జ‌నం నుంచి ప్ర‌ముఖుల వ‌ర‌కూ మృత్యువాత ప‌డుతున్నారు. తాజాగా విశాఖ‌ప‌ట్నం మాజీ ఎంపీ సబ్బం హ‌రి క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. కొద్ది రోజుల క్రిత‌మే కొవిడ్ సూచ‌న‌లు క‌నిపించ‌డంతో ప‌రీక్ష చేయించుకున్నారు. దీంతో.. ఆయ‌న‌కు పాజిటివ్ రిపోర్టు వ‌చ్చింది.

ఈ నేప‌థ్యంలో వైద్యుల సూచన‌ల మేర‌కు హోం ఐసోలేష‌న్లో ఉన్నారు. కానీ.. ప‌రిస్థితి ఇబ్బందిక‌రంగా మార‌డంతో.. విశాఖ‌లోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. కొన్ని రోజులుగా ట్రీట్మెంట్ తీసుకుంటున్న‌ప్ప‌టికీ.. ఆరోగ్యంలో మార్పు రాలేదు. నిన్న‌టి నుంచి ప‌రిస్థితి మ‌రింత విష‌మించ‌డంతో.. ఇవాళ మ‌ధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. క‌రోనాతోపాటు ఇత‌ర ఆరోగ్య స‌మ‌స్య‌లు కూడా సబ్బం హ‌రి మృతికి కార‌ణ‌మ‌య్యాయ‌ని వైద్యులు తెలిపిన‌ట్టు స‌మాచారం.

స‌బ్బం హ‌రికి రాజ‌కీయాల్లో సుదీర్ఘ‌మైన అనుభ‌వం ఉంది. విశాఖ కాంగ్రెస్ లో ఆయ‌న కీల‌క నేత‌గా ప‌నిచేశారు. ఆ త‌ర్వాత వైఎస్ చ‌నిపోయిన‌ప్పుడు.. జ‌గ‌న్ కు అండ‌గా ఉన్నారు. ఓదార్పు యాత్ర‌లో సైతం జ‌గ‌న్ తో క‌లిసి న‌డిచారు. కానీ.. ఆ త‌ర్వాత ప‌రిణామాలు మారిపోవ‌డంతో జ‌గ‌న్ కు దూర‌మ‌య్యారు. ఆ త‌ర్వ‌త టీడీపీలో చేరారు.

గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భీమిలీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్ప‌టి నుంచి ఇంటికే ప‌రిమితం అయ్యారు. రాజ‌కీయాల్లో సీనియ‌ర్ నేత‌గా ఉన్న ఆయ‌న‌.. ఇలా క‌రోనా బారిన ప‌డి ప్రాణాలు కోల్పోవ‌డం ప‌ట్ల తీవ్ర ఆవేద‌న వ్య‌క్తమ‌వుతోంది. స‌బ్బం హ‌రి మృతిప‌ట్ల ప‌లువురు రాజ‌కీయ నేత‌లు సంతాపం తెలిపారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....

Tammineni Sitaram : తమ్మినేని సీతారాం నకిలీ పత్రాల ముఠాతో జట్టు.. భూకబ్జా కేసులో వెలుగులోకి దారుణ నిజాలు..

వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు శాసనసభాపతిగా ఉన్న తమ్మినేని సీతారాం భూకబ్జాలకు పాల్పడ్డారు. చాపురం పంచాయతీ లోని బలగ గ్రామ పరిధిలో కట్ట కనక లింగేశ్వర రావు కొనుగోలు చేసిన భూమిని సీతారాం...

Most Popular

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....
Exit mobile version