https://oktelugu.com/

Global Warming: భారత దేశంలో ఐదు నగరాలు త్వరలో కనుమరుగు.. ఆ నగరాలు ఏంటో తెలుసా.. కారణాలు ఇవే..!

గ్లోబల్‌ వార్మింగ్‌(Global warming) ప్రపంచ దేశాలకు పెను ముప్పుగా మారుతోంది. పెరుగుతున్న కాలుష్యం కారణంగా.. అనేక దేశాల్లో సముద్ర మట్టాలు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో అనేక నగరాలకు ముంపు ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే సముద్ర మట్టాలు పెరుగుతుండడంతో సమీపంలోని ప్రాంతాలు కోతకు గువుతున్నాయి. అలలు తీరానికి పోటెత్తుతున్నాయి.

Written By: , Updated On : January 27, 2025 / 05:53 PM IST
Global Warming

Global Warming

Follow us on

Global Warming: గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రపంచానికి పెను సవాల్‌గా మారింది. భూమిపై పెరుగుతున్న కాలుష్యం(Polution)కారణంగా అతివృష్టి, అనావృష్టితోపాటు కాలాలు మారుతున్నాయి. చలికాలంలో ఎండగా, వేసవిలో వర్షాలు కురుస్తున్నాయి. వానాకాలంలో ఎండదు దంచి కొడుతున్నాయి. ఈ గ్లోబల్‌వార్మింగ్‌ కారణంగా సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. జలచరాలు అంతరించిపోతున్నాయి. కాలుష్య నియంత్రణకు ప్రపంచ దేశాలు తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగా మారుతున్నాయి. ఇక ఈ గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగానే అనేక దీర్ఘకాలిక వ్యాధులు పెరుగుతున్నాయి. కొత్త కొత్త వైరస్‌లు పుట్టుకొస్తున్నాయి. మన దేశంలో కూడా గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రభావం కనిపిస్తోంది. దీంతో సముద్రమట్టాలు పెరుగుతున్నాయి. చిన్న పిల్లలు, పెద్దవారు అని తేడా లేకుండా జనం వ్యాధులబారిన పడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ గ్లోబల్‌వార్మింగ్‌ కారణంగా 20100 నాటికి దేశంలో ఐదు నగరాలు నీటిలో మునిగిపోయే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనుమరుగయ్యే నగరాలు.. కారణాలు తెలుసుకుందాం.

ముంబై:
ముంబై(Mumbai) మహారాష్ట్ర రాష్ట్రంలోని అత్యంత ప్రధానమైన నగరం. ఇది సముద్రతీర ప్రాంతంలో ఉంది. సముద్ర మట్టానికి కేవలం 1.5 మీటర్ల ఎత్తులోనే ఉంది. సముద్ర మట్టం పెరిగే ధోరణి వల్ల ముంబై నీటిలో మునిగిపోవడానికి ప్రమాదం ఉంది. గ్లోబల్‌ వార్మింగ్‌ వలన ఆర్ధిక నగరంలో మరింత ఇబ్బందులు కలగవచ్చు.

కోచ్చి..
కేరళలోని కొచ్చి(Cochi) కూడా సముద్రతీరంలో ఉన్న నగరం. గత కొంతకాలంగా కోచ్చిలో సముద్ర మట్టం పెరుగుతోంది. 2050 వరకు, కోచ్చి నగరం కొంత భాగం నీటిలో మునిగే అవకాశం ఉంది.

చెన్నై..
చెన్నై(Chennai) కూడా తమిళనాడులో సముద్రతీరంలో ఉన్న నగరం. అంతకుముందు గ్లోబల్‌ వార్మింగ్‌ వలన హిమాలయాల నుంచి∙మంచు చెరుకు వలన సముద్ర స్థాయి పెరుగుతుంది. దీని ప్రభావం చెన్నైపై కూడా పడుతుంది.

కలకత్తా:
ప్రపంచవ్యాప్తంగా మరింత పొడిబారే సమయంలో ఖడగ్‌పూర్, ఇతర నగరాలు కూడా నీటిలో మునిగే ప్రమాదంలో ఉన్నాయి. గ్లోబల్‌ వార్మింగ్‌ వలన పుష్కలంగా వరదలు వస్తే, ఈ నగరం కూడా నీటిలో మునిగిపోవచ్చు.

విశాఖపట్నం:
విశాఖపట్నం కూడా సముద్రతీరంలో ఉంది. సముద్ర మట్టం పెరుగుతోన్న నేపథ్యంలో, ఇక్కడ కూడా వరదలు పెరిగే అవకాశం ఉంది.

ప్రధాన కారణాలు:
గ్లోబల్‌ వార్మింగ్‌ వలన చలికాలంలో మంచు కరిగి సముద్ర స్థాయి పెరిగిపోతుంది. సముద్ర మట్టం పెరుగుదల: ఈ పెరుగుదల వలన సముద్రతీర ప్రాంతాలు మునిగిపోతాయి. వాతావరణ మార్పుల వల్ల తుఫాన్లు మరియు భారీ వర్షాలు ఎక్కువ అవుతూ, నగరాలను నీటితో ముంచేస్తాయి. ఈ కారణాలు పర్యావరణాన్ని ప్రభావితం చేస్తూ, సతతంగా నగరాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.