రైతన్న ‘చక్కా జామ్‌’ : రోడ్ల దిగ్బంధనం

వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని రైతులు చేపట్టిన ఉద్యమం ఇంకా నడుస్తూనే ఉంది. ఏమాత్రం విరామం చెప్పకుండా రైతులు తమ నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. ఇందులో భాగంగా నేడు ‘చక్కా జామ్‌’ కార్యక్రమం చేపట్టారు. రైతు సంఘాల పిలుపు మేరకు రహదారుల దిగ్బంధనం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులు రహదారులను దిగ్బంధిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం 3 గంటల వరకు కొనసాగనుంది. మహారాష్ట్రలోని నాసిక్‌, హరియాణాలోని పానిపట్‌, పంజాబ్‌లోని అమృత్‌సర్‌, మొహాలితోపాటు […]

Written By: Srinivas, Updated On : February 6, 2021 4:07 pm
Follow us on


వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని రైతులు చేపట్టిన ఉద్యమం ఇంకా నడుస్తూనే ఉంది. ఏమాత్రం విరామం చెప్పకుండా రైతులు తమ నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. ఇందులో భాగంగా నేడు ‘చక్కా జామ్‌’ కార్యక్రమం చేపట్టారు. రైతు సంఘాల పిలుపు మేరకు రహదారుల దిగ్బంధనం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులు రహదారులను దిగ్బంధిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం 3 గంటల వరకు కొనసాగనుంది. మహారాష్ట్రలోని నాసిక్‌, హరియాణాలోని పానిపట్‌, పంజాబ్‌లోని అమృత్‌సర్‌, మొహాలితోపాటు దేశవ్యాప్తంగా పలు నగరాల్లో రైతు మద్దతుదారులు రోడ్లపై బైఠాయించారు.

Also Read: బ్రేకింగ్: ఎమ్మెల్యే పదవికి గంటా శ్రీనివాసరావు రాజీనామా

రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీ తర్వాత రైతులు చేపడుతున్న అతిపెద్ద ఆందోళన ఇదే. ఢిల్లీ, ఉత్తర్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లకు ఈ కార్యక్రమం నుంచి మినహాయింపు ఇచ్చారు. ఢిల్లీ-హరియాణా సరిహద్దుల్లోని కుండ్లీ వద్ద రైతులు రోడ్డుపై బైఠాయించారు. అంబులెన్స్‌లు, అత్యవసర సర్వీసులకు చక్కా జామ్ నుంచి మినహాయించిన విషయం తెలిసిందే. పంజాబ్‌లోని సంగ్రూర్, బర్నాలా, బంటిండా సహా 15 జిల్లాల్లో 33 చోట్ల ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న భారత్ కిసాన్ యూనియన్ జనరల్ సెక్రెటరీ సుఖ్‌దేవ్ సింగ్ కొక్రికలన్ తెలిపారు. రిపబ్లిక్ డే హింసను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేశారు.

అంతేకాదు.. ఢిల్లీ వ్యాప్తంగా మెట్రో స్టేషన్లలో సిబ్బంది అప్రమత్తమయ్యారు. పరిస్థితుల దృష్ట్యా ఖాన్‌ మార్కెట్‌, నెహ్రూ ప్లేస్‌, మండీ హౌస్‌, ఐటీవో, ఇండియా గేట్‌ స్టేషన్ల ఎంట్రీ, ఎగ్జిట్‌ గేట్లను మూసివేశారు. అవసరమైతే మరికొన్ని స్టేషన్లలోనూ ముందుజాగ్రత్త చర్యలు చేపడతామని తెలిపారు. అటు సింఘు, టిక్రీ సరిహద్దుల్లోనూ భారీగా భద్రత బలగాలు పహారా కాస్తున్నాయి. కాగా.. ‘చక్కా జామ్‌’కు కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా 50 వేలకుపైగా భద్రతా సిబ్బందిని మోహరించారు.

Also Read: మా గ్రామాలను తెలంగాణలో కలపండి

ఢిల్లీ పోలీసులు, రిజర్వ్ పోలీస్ ఫోర్స్, పారామిలటరీ దళాలను భద్రతకు వినియోగిస్తున్నారు. ఐటీబీపీ, సీఆర్పీఎఫ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌తోపాటు ప్రత్యేక దళాలు స్వాత్, ఎన్‌ఎస్జీల సాయం కూడా తీసుకుంటున్నారు. రాజధాని సహా సరిహద్దుల్లోని వివిధ ప్రాంతాల్లో బాంబ్, డాగ్ స్క్యాడ్‌లను అందుబాటులో ఉంచారు. ఎర్రకోట, ఇండియా గేట్, పార్లమెంట్ సహా చరిత్రాత్మక కట్టడాలు, మతపరమైన ప్రదేశాలపై డేగ కన్నుతో నిఘా పెట్టారు. ఢిల్లీకి నాలుగు సరిహద్దుల్లో జరిగే ఆందోళనలను వేలాది సీసీటీవీ కెమెరాలతో మొత్తం కార్యక్రమాన్ని సెంట్రల్ సీ4ఐ కంట్రోల్ రూమ్, సబ్-కంట్రోల్ రూమ్‌ల పర్యవేక్షించనున్నారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్