జాతీయ వార్తలుKCR- Revanth Reddy: అంతా కేసీఆర్ డైరెక్షన్ లోనే.. నాడు రేవంత్ రెడ్డి.. నేడు ఆ...

KCR- Revanth Reddy: అంతా కేసీఆర్ డైరెక్షన్ లోనే.. నాడు రేవంత్ రెడ్డి.. నేడు ఆ నలుగురు బుక్?

KCR- Revanth Reddy: మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగిన ఘటనకు.. గతంలో రేవంత్ రెడ్డియ ఘటనకు సంబంధం ఉందా? నాడు డబ్బు కలకలం సృష్టించగా.. నేడు కూడా అదే స్థాయిలో డబ్బు కట్టలు లభ్యం కావడం దేనికి సంకేతం? వీటి వెనుక ఉన్నది ఎవరు? గతంలో జరిగిన ఘటనకు ఇప్పటి ఘటనకు సారుప్యత ఏమున్నది? రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది.

KCR- Revanth Reddy
KCR- Revanth Reddy

2015 మే 31.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ఇంట్లో.. ఇప్పుడు నలుగురు ఎమ్మెల్యేలతో మొయినాబాద్ ఫామ్ హౌస్ లో.. డబ్బులు తీసుకునేందుకు అంగీకరించి.. వాటితో తమ వద్దకు రప్పించుకుని మరీ పోలీసులకు పట్టించిన ఘటనలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అప్పట్లో రేవంత్ ని పట్టించేందుకు ముందస్తుగానే ప్లాన్ చేసిన స్టీఫెన్సన్.. అందుకు పక్కాగా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. అతడి ఇంట్లో పట్టుకోవాలని నిఘా కెమెరాలు అమర్చి రేవంత్ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ప్రతి క్షణాన్ని రికార్డు అయ్యేలా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థికి ఓటు వేసేందుకు గాను రేవంత్ డబ్బుల ఎర చూపడం, వారి మధ్య సంభాషణ మొత్తాన్ని రికార్డు చేశాక పోలీసులు వచ్చి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అరెస్టు చేయడం తెలిసింది. దీంతో రేవంత్ ఏ విధంగానో తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. తాను రోడ్డుపై ఉండగా పోలీసులు కొట్టి స్టీఫెన్సన్ ఇంటికి తీసుకెళ్లారని రేవంత్ ఆరోపించినా వీడియో దృశ్యాలను బయట పెట్టడంతో మరో మాట మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది.

– తాజా ఎపిసోడ్ లో

ఇప్పుడు నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేల వ్యవహారం కూడా 2015 నాటి ఘటన తలపిస్తోంది. ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతోనే తాము పక్కాగా ఆపరేషన్ నిర్వహించామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర చెబుతున్నారు. పార్టీ మారితే 100 కోట్ల నగదు తో పాటు కాంట్రాక్టులు ఇస్తామంటూ తమను ప్రలోభ పెట్టారని చెప్పిన ఎమ్మెల్యేలు ఆపరేషన్లు పాత్రధారులు అయ్యారు. డబ్బులు ఇస్తామన్న వ్యక్తులను రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కి రప్పించి అక్కడ ముందుగానే కెమెరాలు అమర్చి డబ్బుల విషయంపై చర్చలు జరిపారు. అంత పోలీసుల ప్లాన్ ప్రకారం జరగడం, వారు వచ్చి దాడి చేయడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు కూడా ఆ వ్యక్తులు తమకు సంబంధం లేదని చెప్పడానికి వీల్లేని విధంగా రికార్డుల్లో ఇరికించారు.

KCR- Revanth Reddy
KCR- Revanth Reddy

ఈ రెండు సందర్భాల్లోనూ డబ్బులు ఇచ్చేందుకు వెళ్లిన వారే అడ్డంగా బుక్ అయ్యారు. అప్పట్లో రేవంత్ రెడ్డి కేసు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. కూడా అది ఆయనను వెంటాడుతూనే ఉంది. తాజా సంఘటన వెనుక బిజెపి నాయకుల ప్రమేయం ఉందని టిఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు.. అయితే ఇది మునుముందు ఎవరి మెడకు చుట్టుకుంటుందో తెలియదు గానీ.. ఈ రెండు ఘటనల్లోనూ టిఆర్ఎస్ నాయకత్వం తమ ప్రణాళికను పక్కాగా అమలు చేసింది. ఎప్పుడైతే పోలీసులు వచ్చి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారో.. వెంటనే ఆ నలుగురు ఎమ్మెల్యేలకు ఫోన్లు రావడంతో హుటాహుటిన ప్రగతి భవన్ వెళ్ళిపోయారు. అంటే ఈ ఘటన ప్రగతి భవన్ డైరెక్షన్లోనే జరిగిందని తెలుస్తోంది.

 

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...

Most Popular

Delhi Protests

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...
Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...
ISI Agents In India

ISI Agents In India: అమాయక హిందువులే పాకిస్తాన్ ఐఎస్ఐ టార్గెట్.. ఎంతటి దుర్మార్గానికి పాల్పడిందంటే..

ISI Agents In India: సరిహద్దుల్లో మారణ హోమం సృష్టిస్తూ ఉంటుంది. మన సైనికులపై దాడులకు పాల్పడుతూ ఉంటుంది. ప్రశాంతమైన మనదేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. నకిలీ నగదు.....

13-year-old boy : కమీషన్ ఇస్తేనే పనిచేస్తారా.. 13 ఏళ్ల బాలుడి ప్రశ్నకు కలెక్టర్ కు నోటి మాట...

13-year-old boy : అది కలెక్టర్ కార్యాలయం.. కలెక్టర్.. ఇతర అధికారులు ప్రజల సమస్యలు వింటున్నారు. ప్రజలు కూడా తమ సమస్యలను చెప్పుకోవడానికి అక్కడికి వచ్చారు. వారంతా కూడా తమ సమస్యల మీద...

Malla Reddy : మల్లారెడ్డి హ్యాండిచ్చాడు.. బీఆర్ఎస్ కారాలు మిరియాలు.. ట్విస్ట్ అదిరింది కదూ

Malla Reddy : మైక్ పట్టుకుంటే చాలు మల్లారెడ్డి కేటీఆర్.. కెసిఆర్.. హరీష్ రావు మీద పొగడ్తల వర్షం కురిపిస్తూ ఉంటారు. నూరేళ్లు కాదు వెయ్యిళ్లు బతకాలని కోరుతుంటారు. తెలంగాణ రాష్ట్రాన్ని బాగు...