Homeజాతీయ వార్తలుMoinabad Farmhouse- TRS MLAs: మొయినాబాద్ ఎపిసోడ్ ఆఖర్లో డబుల్ గేమ్ ఆడింది ఎవరు? ప్లేట్...

Moinabad Farmhouse- TRS MLAs: మొయినాబాద్ ఎపిసోడ్ ఆఖర్లో డబుల్ గేమ్ ఆడింది ఎవరు? ప్లేట్ ఫిరాయించిన ఆ ఎమ్మెల్యే ఎవరు?

Moinabad Farmhouse- TRS MLAs: తెలంగాణలో రాజకీయాలు అనుహ్యంగా మారుతున్నాయి. బుధవారం రాత్రి మొయినాబాద్ లోని పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో చోటు చేసుకున్న పరిణామాలు థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయి.. ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీల మధ్య వాదోపవాదాలకు దారితీస్తున్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్లో అధికార టీఆర్ఎస్ నేతల మాటలు ఒక విధంగా.. అందుకు భిన్నంగా బిజెపి నాయకుల వ్యాఖ్యలు ఉండటం ఆసక్తికరంగా మారింది. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్టు చెబుతున్న నందకుమార్ అలియాస్ నందు వైపే వెళ్ళన్నీ చూపిస్తున్నాయి. నందుకు టిఆర్ఎస్ నేతలతో పాటు బిజెపి నాయకులకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది.

Moinabad Farmhouse- TRS MLAs
Moinabad Farmhouse- TRS MLAs

డీల్ ఏదైనా సరే

అనునిత్యం హై ప్రొఫైల్ వ్యక్తులతో తిరిగే నందకుమార్ డీల్స్ కుదరచడంలో దిట్ట. గతంలో హైదరాబాద్ నగర పరిధికి చెందిన ఎమ్మెల్యేకు మొయినాబాద్ శివారులో ఫామ్ హౌస్ కూడా సమకూర్చి పెట్టాడని, ఇందుకు ప్రతిగా ఆయన సదరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ పరిధిలో తనకు అనుకూలమైన వ్యక్తికి మునిసిపల్ చైర్మన్ పదవి దక్కించుకున్నాడని వినికిడి. ఇక డీల్ ఏదైనా సరే దాన్ని పూర్తి చేసే వరకు నందు ప్రయత్నిస్తూనే ఉంటాడని పొలిటికల్ సర్కిల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. కేంద్ర మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు కిషన్ రెడ్డితో నందుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇదే సమయంలో టిఆర్ఎస్ నాయకులతోనూ సంబంధాలు ఉన్నాయి. తాజాగా ఆ నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఒకరు నందుతో అత్యంత సమితంగా ఉంటారని తెలుస్తోంది. వాస్తవానికి ఫామ్ హౌస్ కు నలుగురు ఎమ్మెల్యేలతో పాటు అధికార పార్టీ చెందిన ఎంపీ కూడా హాజరు కావాల్సి ఉంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన సదర్ ఎంపీ కూడా ఈ మీటింగ్ కు రావాల్సి ఉన్నప్పటికీ.. ఆఖరి నిమిషంలో కుదరని చెప్పినట్టు తెలుస్తోంది.. అంతేకాదు మరో ఇద్దరు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఈ భేటీకి హాజరు కావాల్సి ఉందని, అనివార్య కారణాల వల్ల రాలేదన్న మాట రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఇక నందకుమార్ కు హైదరాబాద్ శివారు చంద్ర టిఆర్ఎస్ ఎమ్మెల్యే కుమారులతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది.

ఆ ఎమ్మెల్యే చొరవ తోనే

నందుకు సహితంగా ఉండే టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరి చెరువుతో ఈ భేటీ మొదలైనట్టు తెలుస్తోంది. దీనికి కాస్త ముందుగా తమ భేటీ అయ్యే విషయాన్ని సొంత పార్టీకి చెందిన కీలక నేతతో షేర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఈ స్కెచ్ ఎవరిది అన్న ప్రశ్నకు సూటి సమాధానం మాత్రం లభించడం లేదు.. పోలీసు వర్గాలు వెల్లడించిన వివరాలపై రాజకీయ వర్గాల్లో భిన్నమైన సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ ఘటనపై టిఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్యమైన నేత చేసిన విశ్లేషణ మాత్రం ఆసక్తికరంగా ఉంది. ” ఒకటి టిఆర్ఎస్ ఎమ్మెల్యే చొరవతో ఈ సమావేశం మొదలైంది. విచిత్రంగా ఆఖరి నిమిషంలో ఆ ఎమ్మెల్యే ప్లేటు ఫిరాయించాడు. డబుల్ గేమ్ ఆడాడు” అంటూ సదరు నేత పేర్కొన్నారు.

Moinabad Farmhouse- TRS MLAs
Moinabad Farmhouse- TRS MLAs

ప్రగతి భవన్ డైరెక్షన్లో నేనా

వాస్తవానికి ఆ ఎమ్మెల్యే టిఆర్ఎస్ లో నంబర్ 2 గా వెలుగొందుతున్న వ్యక్తికి అత్యంత సన్నితంగా ఉంటాడు. సొంత నియోజకవర్గాన్ని వదిలిపెట్టి హైదరాబాదులోనే చక్కర్లు కొడుతూ ఉంటాడు. పైగా తన నియోజకవర్గంలో తన అనుచరులతోనే సమాంతర పాలన సాగిస్తూ ఉంటాడు. సెటిల్మెంట్లు చేయడంలో మాత్రం దిట్ట. ఎమ్మెల్యే అయిన తర్వాత హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో భారీగా భూములు కొన్నాడు. ఈ ప్రాంతంలో ముందుగానే ప్రాజెక్టులు వస్తున్నాయని తెలుసుకున్నాడో ఏమో గాని.. ఇప్పుడు ఆయన కొన్న ఎకరం భూమి విలువ 40 కోట్లకు పై మాటే. నడ మంత్రపు సిరి రావడంతో విలాసాలకు బాగా అలవాటు పడ్డాడు. హై ప్రొఫైల్ జీవితాన్ని అనుభవిస్తున్నాడు. ఎక్కువగా సినీ తారలతో ఫంక్షన్లలో పాల్గొంటాడు. ఈ క్రమంలోనే ఈ ఎమ్మెల్యేకు, నందకుమార్ కు పరిచయం ఏర్పడిందని, ఈ భేటీకి దారి తీసింది అని పొలిటికల్ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం ఉంది.. అయితే చివరి నిమిషంలో ప్రగతి భవన్ నుంచి ఫోన్ రావడంతో అతడు తప్పుకున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ ఎపిసోడ్ తర్వాత ఎమ్మెల్యే ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం గమనార్హం.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Delhi Protests

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...
Team India Bowling

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
OG 2 Animation Video

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...
KCR And Revanth Reddy

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Oktelugu Epaper