Homeఅంతర్జాతీయంDurandhar Movie Controversy: దావూద్ ఇబ్రహీం చెప్పలేడు.. పాకిస్తాన్ విప్పలేదు.. ఒక్క ఇండియన్ సినిమాతో ఇంత...

Durandhar Movie Controversy: దావూద్ ఇబ్రహీం చెప్పలేడు.. పాకిస్తాన్ విప్పలేదు.. ఒక్క ఇండియన్ సినిమాతో ఇంత విధ్వంసమా

Durandhar Movie Controversy: నిజమే..దురందర్ రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమా మనదేశంలో ఉన్న కుహనా లౌకికవాదులకు చుక్కలు చూపించింది. కమ్మీలకు, కాంగీలకు నోరు మెదపలేని పరిస్థితి కల్పించింది. ఇది కేవలం సినిమానే కాదు.. అంతకుమించి.. దెబ్బకు బాలీవుడ్ ముఠా కూడా సైలెంట్ అయిపోయింది. ఖాన్ లు ఈ సినిమా గురించి ఒక్క ట్వీట్ చేయలేదు. కనీసం మాట కూడా మాట్లాడలేదు. ఈ సినిమా ద్వారా రణ్వీర్ సింగ్ ఒకసారి గా ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు. అతడు ఈ సినిమా తర్వాత డాన్ 3 చేయాలి. కానీ బాలీవుడ్ అతనికి సపోర్ట్ చేయడం లేదు. ఈ సినిమాలో అతడు నటిస్తాడా.. లేదా అనేది తెలియాల్సి ఉంది.

దురంధర్ సినిమా కేవలం ఇండియన్ సినిమా మార్కెట్లోనే కాదు.. చివరికి పాకిస్తాన్ దేశానికి కూడా చుక్కలు చూపించింది. ఈ సినిమా విడుదలైన తర్వాత పాకిస్తాన్లో విపరీతంగా ఓటిటి ద్వారా చూశారు. పాకిస్తాన్ పాలకుల దుర్మార్గాన్ని కళ్ళకు కట్టినట్టు ఆ సినిమా చూపించడంతో.. పాకిస్థాన్లో విపరీతమైన చర్చ నడుస్తోంది. అది అంతర్గత పోరుకు కారణమయ్యే అవకాశం లేకపోలేదని అక్కడి రాజకీయ వర్గాలు అంటున్నాయి. దురంధర్ సినిమా తర్వాత పాకిస్తాన్ మీద దాడులు పెరిగిపోయాయి. అంతర్గతంగా ఉగ్రవాదులు జరిపే విధ్వంసాలతో పాటు పాకిస్తాన్లో ఉండబోమంటూ బలూచిస్తాన్ వేర్పాటు వాదులు చేస్తున్న ఉద్యమాలు కూడా హింసాత్మకంగా మారుతున్నాయి.

దురంధర్ సినిమాలో బడే బాయ్ పాత్ర దావూద్ ఇబ్రహీం ను పోలి ఉంటుంది. ఇంతవరకు బాలీవుడ్ లో దావూద్ ఇబ్రహీం పాత్ర గురించి ఏ దర్శకుడు కూడా ఇంత స్పష్టంగా చెప్పలేదు. దావూద్ ఇబ్రహీం ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్నాడు. అనారోగ్యం వల్ల మంచానికే పరిమితమయ్యాడు. కనీస మాట కూడా మాట్లాడే పరిస్థితి లేదు. అతడు చుట్టూ అనుచరులు ఉంటున్నారు. అతడు ఇది కావాలని చెప్పలేడు. వారే తెలుసుకొని ఆ సమయంలో అతని అవసరం తీరుస్తున్నారు. దురంధర్ సినిమా విడుదలైన తర్వాత బడే బాయ్ పాత్రలో చాలామంది దావూద్ ఇబ్రహీం ను ఐడెంటిఫై చేసుకున్నారు. అయితే ఈ సినిమా గురించి పాకిస్థాన్లో విపరీతమైన చర్చ నడుస్తున్న నేపథ్యంలో.. సాయుధ అజ్ఞాత దళాలు దావూద్ ఇబ్రహీం మీద దాడి చేసే అవకాశం ఉందని పాకిస్థాన్ బయపడుతోంది.

బయటికి ఈ విషయం అధికారికంగా తెలియకపోయినప్పటికీ అంతర్గత వర్గాలు మాత్రం ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఎందుకంటే కరుడుగట్టిన ఉగ్రవాదులు మొత్తం పాకిస్థాన్లోనే ఉంటున్నారు.. అమెరికా చేసిన దాడి వల్ల లాడెన్ చనిపోయాడు. అతడిని అమెరికా దళాలు చంపింది పాకిస్తాన్లోనే. ఆల్కైదా మంచి మొదలు పెడితే హిజిబుల్ ముజాహిద్ ఇన్ వరకు అన్ని ఉగ్రవాద సంస్థల అధిపతులు తలదాచుకున్నది పాకిస్థాన్ లోనే. అలాంటప్పుడు దురంధర్ సినిమాను స్ఫూర్తిగా తీసుకొని అజ్ఞాత సాయుధ దళాలు కాల్పులకు పాల్పడితే అప్పుడు పరిస్థితి ఏంటో తెలియక పాకిస్తాన్ కలవర పడుతోంది. ఒక సినిమా ఇండియన్ సినిమా మార్కెట్ మాత్రమే కాదు.. పాకిస్తాన్ దేశానికి కూడా చుక్కలు చూపించింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version