ఆంధ్రప్రదేశ్‌చిత్తూరు జిల్లాలో నియంత మంత్రి?

చిత్తూరు జిల్లాలో నియంత మంత్రి?

చిత్తూరు జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి తన కనుసన్నల్లో ఉంచుకుంటున్నారు. ప్రభుత్వ నిర్ణయాలతో సంబంధం లేకుండా విధానపరమైన నిర్ణయాలు అమలు చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలోకి అడుగుపెట్టాలంటే కొవిడ్ నెగెటివ్ రిపోర్టు లేకుండా వస్తే అనుమతి నిరాకరిస్తున్నారు.

మంత్రి ఆదేశాలు ధిక్కరిస్తే అంతే సంగతి. నిజానికి ఒక జిల్లాకు మరో జిల్లాకు మంత్రుల ఆదేశాలు సహజమే. కానీ ఇక్కడ అంతర్రాష్ర్ట సరిహద్దులు ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకుని ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తే వాలిడిటీ ఉంటుంది.

ఏపీ వాసుల్ని ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్టు ఉంటేనే రానిస్తామని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన ఎవరో మంత్రి ప్రకటన చేయలేదు. అధికారికంగా ఢిల్లీ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. బెంగాల్ లాంటి రాష్ర్టాలు కూడా అధికారికంగా ఆంక్షలు విధించాయి. ఏపీ సర్కారు మాత్రం లాక్ డౌన్ సమయం నిబంధనలు మినహా ఆర్టీపీసీఆర్ టెస్టులు ఉంటేనే ఎవరినైనా ఏపీలోకి రానిస్తామన్న నిబంధనలు పెట్టలేదు. చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి చెప్పిందే వేదం అన్నట్లుగా చెబుతున్నారు.

చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కంట్రోల్ చేయడానికి ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే ఆర్టీపీసీఆర్ టెస్టులు ఉంటేనే రానివ్వడమే మేలని నిర్ణయింుకుని ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో మంత్రులు కాస్త పలుకుబడి ఉన్న వారందరు ఇలా ప్రాంతాలుగా పంచేసుకుని సొంత ప్రభుత్వాలు నడుపుతున్నారు. దీనిపై ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంటుందో ఎందుకు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Himalayan Disaster: హిమాలయాల్లో విపత్తు.. వాతావరణ మార్పులతో ముప్పు!

Himalayan Disaster: ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో కుంభవృష్టి, వరదలు, కొండచరియలు విధ్వంసం సృష్టించాయి. ఇంతకు ముందు డోడా, కిష్వార్‌ ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ఉత్తరాఖండ్, హిమాచల్‌...

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...
Oktelugu Epaper
Exit mobile version