Homeజాతీయ వార్తలుATM : ఏటీఎంలపై సైబర్‌ దాడి.. రెండు మూడు రోజులు నగదుకు తిప్పలే?

ATM : ఏటీఎంలపై సైబర్‌ దాడి.. రెండు మూడు రోజులు నగదుకు తిప్పలే?

ATM : సామాజిక మాధ్యమాలు, టెక్నాలజీ వినియోగం పెరిగిన నేటి రోజుల్లో ఫేక్‌ న్యూస్‌ వ్యాప్తి కూడా వేగంగా జరుగుతోంది. భారత్‌–పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో, భారతదేశంలోని ఏటీఎంలపై రాన్సమ్‌వేర్‌ దాడులు జరిగాయని, మే 12 వరకు సేవలు నిలిచిపోతాయని సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు వైరల్‌ అవుతున్నాయి.

సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, ముఖ్యంగా వాట్సాప్, టెలిగ్రామ్‌లలో ఒక తప్పుడు సందేశం విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. భారతదేశంలోని ఏటీఎంలపై రాన్సమ్‌వేర్‌ దాడులు జరిగాయని, దీని కారణంగా మూడు రోజులపాటు (మే 12, 2025 సోమవారం వరకు) ఏటీఎం సేవలు నిలిచిపోతాయని ఈ సందేశం పేర్కొంది. ఈ దాడులు కేవలం భారత్‌ను మాత్రమే కాక, ప్రపంచవ్యాప్తంగా 74 ఇతర దేశాలను కూడా లక్ష్యంగా చేసుకున్నాయని మరింత ఆసక్తికరంగా చెప్పబడింది. ఈ వార్తలు ప్రజల్లో గందరగోళం, ఆందోళనను రేకెత్తించాయి, ముఖ్యంగా భారత్‌–పాకిస్తాన్‌ ఉద్రిక్తతల సమయంలో.

Also Read : ఏటీఎం వినియోగదారులకు బ్యాడ్ న్యూస్.. రేపట్నుంచి బ్యాలెన్స్ చెక్ చేసినా బాదుడే

పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌..
ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్‌ చెక్‌ విభాగం ఈ వార్తలను అధికారికంగా ఖండించింది. ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో, ‘ఏటీఎంలపై రాన్సమ్‌వేర్‌ దాడులు జరిగాయని వస్తున్న వార్త తప్పుడు సమాచారం స్పష్టంగా ఖండించింది. దేశంలో ఎలాంటి సైబర్‌ దాడులు జరగలేదని, ఏటీఎం సేవలు యథావిధిగా కొనసాగుతాయని పీఐబీ స్పష్టం చేసింది. సామాజిక మాధ్యమాల్లో వచ్చే సమాచారాన్ని నమ్మే ముందు దాని నిజానిజాలను ధృవీకరించుకోవాలని ప్రజలను కోరింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) కూడా ఈ వార్తలను తోసిపుచ్చింది, బ్యాంకింగ్‌ వ్యవస్థలు సురక్షితంగా ఉన్నాయని ధృవీకరించింది.

ఫేక్‌ న్యూస్‌ వ్యాప్తికి కారణాలు
సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు సమాచారం వేగంగా వ్యాప్తి చెందడానికి అనేక కారణాలు ఉన్నాయి. మొదట, భారత్‌–పాకిస్తాన్‌ ఉద్రిక్తతలు ప్రజల్లో ఆందోళనను పెంచాయి. దీనిని ఆసరాగా చేసుకుని భయాందోళనలను రేకెత్తించే వార్తలు సృష్టించబడుతున్నాయి. రెండోది వాట్సాప్‌ వంటి ప్లాట్‌ఫామ్‌లలో సమాచారాన్ని ఫార్వార్డ్‌ చేయడం సులభం, దీని వల్ల తప్పుడు వార్తలు వైరల్‌ అవుతాయి. మూడోది, సామాన్య ప్రజల్లో సైబర్‌ దాడులపై అవగాహన తక్కువగా ఉండటం వల్ల ఇలాంటి వార్తలను సులభంగా నమ్ముతారు. గీలో కొందరు ఈ ఫేక్‌ న్యూస్‌ వెనుక రాజకీయ కారణాలు లేదా ఆర్థిక లబ్ధి కోసం ఉద్దేశపూర్వకంగా వ్యాప్తి చేసే ప్రయత్నాలు ఉండవచ్చని ఊహాగానాలు వ్యక్తం చేశారు.

ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
సైబర్‌ నిపుణులు, ఫేక్‌ న్యూస్‌ను గుర్తించడానికి, ఎదుర్కోవడానికి ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

సమాచార మూలాన్ని ధృవీకరించండి: వార్తలు విశ్వసనీయ మీడియా సంస్థల నుంచి∙వచ్చాయా లేక అనధికారిక మూలాల నుండి వచ్చాయా అని తనిఖీ చేయండి.

Also Read : ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా లో చార్జీలు పెంపు…మే 1 నుంచి అమలు…

పీఐబీ, ఆర్‌బీఐ వంటి అధికారిక ఖాతాలను తనిఖీ చేయండి: ఎక్స్‌లో పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ (ః్కఐఆఊ్చఛ్టిఇజ్ఛిఛిజు) వంటి ఖాతాలు తప్పుడు వార్తలను ఖండిస్తూ నిరంతరం సమాచారాన్ని అందిస్తాయి.

ఫార్వార్డ్‌ చేయడానికి ముందు ఆలోచించండి: తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి, సందేశాలను షేర్‌ చేయడానికి ముందు రెండుసార్లు ఆలోచించండి.

సాంకేతిక అవగాహన పెంచుకోండి: రాన్సమ్‌వేర్, సైబర్‌ దాడుల గురించి ప్రాథమిక జ్ఞానం సమాచారాన్ని విశ్లేషించడంలో సహాయపడుతుంది.

భౌగోళిక ఉద్రిక్తతల్లో ఫేక్‌ న్యూస్‌ ప్రమాదం
భారత్‌–పాకిస్తాన్‌ ఉద్రిక్తతల వంటి సున్నితమైన సమయాల్లో ఫేక్‌ న్యూస్‌ కేవలం గందరగోళాన్ని సృష్టించడమే కాక, ఆర్థిక నష్టాలు, సామాజిక అశాంతిని కూడా కలిగించవచ్చు. ఉదాహరణకు, ఏటీఎంలు పనిచేయవని నమ్మి ప్రజలు ఒకేసారి నగదు ఉపసంహరణకు పరుగెత్తవచ్చు, దీనివల్ల బ్యాంకులపై ఒత్తిడి పెరుగుతుంది. అంతేకాక, ఇలాంటి వార్తలు దేశ భద్రతా వ్యవస్థలపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. ఎక్స్‌లో ఒక యూజర్‌ ఇలా పేర్కొన్నారు: ‘ఫేక్‌ న్యూస్‌ ఒక కొత్త రకం యుద్ధం. దీనిని ఎదుర్కోవడానికి ప్రజలు సమాచార యోధులుగా మారాలి.‘

Exit mobile version