Homeఆంధ్రప్రదేశ్‌YCP MP's and MLA's : 22 మంది వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల‌కు ప‌ద‌వీగండం.. ఏడీఆర్...

YCP MP’s and MLA’s : 22 మంది వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల‌కు ప‌ద‌వీగండం.. ఏడీఆర్ రిపోర్టు ఏం చెబుతోంది?

YCP MLA Audio leaked

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక‌రిద్ద‌రు కాదు.. ఏకంగా 22 మంది ప్ర‌జాప్ర‌తినిధులు ప‌ద‌వీ గండం ఎదుర్కొంటున్నారు. 18 మంది ఎమ్మెల్యేలు, న‌లుగురు ఎంపీల ప‌ద‌విపై క‌త్తి వేళాడుతోంది. దీంతో.. ఏం జ‌ర‌గ‌బోతోంది అనే టెన్ష‌న్ వారిలో నెల‌కొంది. ఏడీఆర్ రిపోర్టులో ఈ 22 మంది పేర్లు ఉన్నాయి. ఏం జ‌రుగుతోంది? వాళ్ల పదవికి వచ్చిన ముప్పు ఏంటీ? అన్న‌ది చూద్దాం.

దేశంలోని ప్ర‌జాప్ర‌తినిధుల‌పై ఉన్న క్రిమిన‌ల్ కేసుల‌ను వేగంగా ప‌రిష్క‌రించాల‌ని ఆ మధ్య సుప్రీం కోర్టు ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో వారిపై ఉన్న కేసుల విచార‌ణ వేగంగా కొన‌సాగుతోంది. ఈ మేర‌కు ప్ర‌జాస్వామిక సంస్క‌ర‌ణ‌ల సంఘం (ఏడీఆర్) ఓ నివేదిక విడుద‌ల చేసింది. దేశంలో మొత్తం 363 మంది ఎంపీలు, ఎమ్మెల్యేల‌పై క్రిమిన‌ల్ కేసులు ఉన్న‌ట్టు వెల్ల‌డించింది. వీరిలో ఎంపీలు 67 మంది కాగా.. ఎమ్మెల్యేలు 296 మంది ఉన్నారు.

ఇందులోనూ కేంద్రంలోని అధికార పార్టీదే అగ్ర‌తాంబూలంగా ఉంది. మొత్తం 363 మందిలో.. బీజేపీకి చెందిన 83 మందిపై క్రిమిన‌ల్ కేసులు ఉన్నాయి. ఆ త‌ర్వాత స్థానం కాంగ్రెస్ పార్టీది. ఈ పార్టీ నుంచి గెలిచిన వారిలో 47 మందిపై కేసులున్నాయి. తృణ‌మూల్ కాంగ్రెస్ కు చెందిన 25 మంది కూడా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఇటు వైసీపీ నుంచి కూడా 22 మంది ప్ర‌జాప్ర‌తినిధులు క్రిమిన‌ల్ కేసులు ఎదుర్కొంటున్నారు.

వైసీపీకి చెందిన వారిలో ఎంపీలు మిథున్ రెడ్డి, మార్గాని భ‌ర‌త్‌, బెల్లాన చంద్ర‌శేఖ‌ర్ ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ ఉన్నారు. ఇక‌, ఎమ్మెల్యేల్లో మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి, పి. ర‌వీంద్ర‌నాథ్ రెడ్డి స‌హా మొత్తం 18 మందిపై కేసులు ఉన్నాయి. టీడీపీ నుంచి గెలిచిన క‌ర‌ణం బ‌ల‌రాం, వాసుప‌ల్లి గ‌ణేష్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. అటు తెలంగాణ‌లో బీజేపీ ఎంపీ సోయం బాపూరావు, కాంగ్రెస్ ఎంపీ కోమ‌టిరెడ్డి, టీఆర్ఎస్ ఎంపీ మాలోతు క‌విత ఉన్నారు.

వీరంద‌రిపై విచార‌ణ కొన‌సాగుతోంది. ప్ర‌జాప్రాతినిథ్య చ‌ట్టంలోని సెక్ష‌న్ 8 (1, 2, 3)లో పేర్కొన్న నేరాల కింద‌కు వ‌చ్చే కేసుల వివ‌రాల‌ను ఏడీఆర్ రిపోర్టు వెల్ల‌డించింది. ఈ సెక్ష‌న్ ప్ర‌కారం ప్ర‌జాప్ర‌తినిధుల‌పై నేరం రుజువై, శిక్ష ప‌డితే.. వారిపై అన‌ర్హ‌త వేటు ప‌డుతుంది. అంటే.. వారి ప‌ద‌వి ఊడిపోతుంది. ఇప్పుడు ఇదే భ‌యం అంద‌రికీ ప‌ట్టుకుంది. కేసుల విచార‌ణ వేగ‌వంతం కావ‌డంతో.. ఏం జ‌రుగుతుందోన‌ని భ‌య‌ప‌డుతున్నారు. మ‌రి, కోర్టు వీరిని దోషులుగా తేలుస్తుందా? నిర్దోషులుగా గుర్తిస్తుందా? అన్న‌ది చూడాలి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Hot vs Cold Shower: వేడి నీరు.. చల్లటి నీరు.. ఏ స్నానం మంచిది..

Hot vs Cold Shower: ప్రతిరోజూ స్నానం చేయడం వల్ల కేవలం శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మాత్రమే కాదు.. మానసికంగా కూడా ఉల్లాసంగా ఉంటుంది. అయితే వేడినీటితో స్నానం చేయడం మంచిదా?...

Today 28 July 2026 Horoscope: ఈ రాశి వారికి ఈ రోజు పదోన్నతి వచ్చే అవకాశం.....

Today 28 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై పూర్వాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారు ఈ రోజు అనుకోకుండా ధన లాభం...

Bangladesh Army : మారిన బంగ్లాదేశ్ సైన్యం.. భారత్ కు డేంజర్ బెల్స్

Bangladesh Army : భారతదేశంతో సుమారు 4,096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకునే బంగ్లాదేశ్‌ పుట్టుకకు మనమే కారణం. భారత సైన్యం చొరవతోనే ఆ దేశం పుట్టింది. ఆ కృతజ్ఞతతో ఇంతకాలం మనతో సత్సంబంధాలు...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం: కష్టపడ్డ బొద్దింకల కాళ్లు విరిగాయి.. స్వార్థ బొద్దింకలు...

Cockroach Janata Party : ఢిల్లీలోని జంతర్ మంతర్.. అతని పేరు జునైద్.. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడు కాక్రోచ్ జనతా పార్టీ...

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...
Oktelugu Epaper
Exit mobile version