Homeఆంధ్రప్రదేశ్‌హెరిటేజ్ లో ‘కరోనా’పై చంద్రబాబు స్పందించాలి

హెరిటేజ్ లో ‘కరోనా’పై చంద్రబాబు స్పందించాలి


హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ లో ఉన్న హెరిటేజ్ మిల్క్ ప్రాజెక్టులో పని చేస్తున్న కొందరు ‘కరోనా’ బారిన పడ్డారంటూ జరుగుతున్న ప్రచారంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించాలని వైసీపీ నేత అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. హెరిటేజ్ మిల్క్ ప్రాజెక్టు ద్వారా లక్షలాది మందికి పాలప్యాకెట్లు తీసుకు వెళతారు కనుక ఇలాంటి చోట ‘కరోనా’ బాధితులు ఉంటే విస్తృతంగా వ్యాపించే ప్రమాదం ఉందని అన్నారు. కనుక, తక్షణమే ఈ విషయమై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబుకు ఉందని అన్నారు. కేంద్రానికి, రాష్ట్రానికి చాలా సలహాలు ఇచ్చే చంద్రబాబు, తమ సంస్థలో వైరస్ బాధితులు ఉన్నారన్న ప్రచారంపై వివరణ ఇవ్వకపోతే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు తికమకపడే అవకాశం ఉంది కనుక దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఉప్పల్ లోని హెరిటేజ్ మిల్క్ ప్రాజెక్టులో సుమారు 40 మందికి కరోనా సోకిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో సంస్థ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులలో ఆందోళన నెలకొంది. సంస్థ నిర్వాహకులు ఈ సంఘటనపై స్పందించ లేదు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Team India Test Cricket

Team India Test Cricket: ఈ గాయపడ్డ సింహాలను నమ్ముకుంటే.. లంకా దహనం అయినట్టే..

Team India Test Cricket: వైట్ బాల్ ఫార్మాట్ లో టీమిండియా చెప్పుకునే స్థాయిలో విజయాలు సాధించలేకపోతోంది. అలాగని రెడ్ బార్ ఫార్మాట్లో అదరగొట్టడం లేదు.. కాకపోతే వచ్చే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్...
Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: కాక్రోచ్ సరే.. నీట్ ప్రశ్న పత్రాల లీకేజీ మాటేంటి జగన్?!

Jagan Mohan Reddy: దేశంలోనే నీట్ ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం పెద్ద వివాదమే రేపింది. చివరకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా విద్యార్థి లోకం పోరాటం చేసింది. జనతా కాక్రోచ్...
YSR Congress

YSR Congress: పార్టీకి డ్యామేజ్.. వైసీపీ సీనియర్ల ఆవేదన అదే!

YSR Congress: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎటు వెళ్తుందో తెలియడం లేదు. ఆ పార్టీ సీనియర్లలో ఆందోళన అదే. ప్రజా పోరాటాలు చేయడం లేదు. ప్రజా ఆందోళనలు నిర్వహించడం లేదు.. జాతీయస్థాయిలో జరుగుతున్న...
OnePlus N6x

OnePlus N6x: ట్రావెల్ చేసేవారికి సూపర్ ఫోన్.. ఒక్కసారి చార్జింగ్ చేస్తే..

OnePlus N6x: భారత్ లో ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్ అందుబాటులోకి వస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా OnePlus కంపెనీ కొత్త ఫోన్ తీసుకురావడానికి సిద్ధమవుతోంది. అయితే ఈ ఫోన్ రిలీజ్...
EPFO News

EPFO News: 20 రోజుల్లోపై డబ్బు జమకాకపోతే 12 శాతం వడ్డీ..

EPFO News: ప్రభుత్వేతర, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కల్పించేందుకు ఉద్యోగుల భవిష్యనిథి చాలా ఉపయోగకరంగా ఉంటోంది. ప్రతి నెల...
Oktelugu Epaper