CM Vijay bumper offer: తమిళనాడు సీఎం విజయ్ తన పాలనలో విభిన్నమైన మార్కుని చూపిస్తూ సంచలనాలు సృష్టిస్తున్నాడు. ఆయన తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఇప్పటూ వరకు దేశం లో ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకోనివి , ట్రెండ్ సెట్ చేసేవి. సరిగ్గా వాటిని అమలు చేస్తే , హిస్టరీ క్రియేట్ చేసిన వాడు అవుతాడు విజయ్. దేవాలయాలు , స్కూల్స్ , బస్సు స్టాప్స్ పరిసరాల్లో మద్యం దుకాణాలను తీసివేయాలని ఆర్దర్లు జారీ చేయడం, అమ్మా క్యాంటీన్స్ ని ఆధునీకరణ చేయమని ఆదేశించడం వంటివి జనాలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక నేడు ఆయన తీసుకున్న మరో సంచలన నిర్ణయం తమిళనాడు లో పెను మార్పులకు దారి తీయొచ్చని అంటున్నారు విశ్లేషకులు. అవినీతి నిర్మూలన కోసం ఆయన తీసుకున్న సంచలన నిర్ణయం, దేశం లో అన్ని రాష్ట్రాలు పాటిస్తే , సాధ్యమైనంత వరకు అవినీతి నిర్మూలన చేయొచ్చు.
లంచం తీసుకుంటే కానీ పని చెయ్యని ప్రభుత్వ అధికారులు ప్రతీ రాష్ట్రం లోనూ ఉంటారు. తన రాష్ట్రంలో అలాంటి అవినీతిపరుల ఆటలను అరికట్టించేందుకు విజయ్ ఒక కోట్ల ప్లాన్ వేశాడు. ఎవరైనా ప్రభుత్వ అధికారి అవినీతి చేసినట్టు ఆధారాలతో సహా నాకు ఫిర్యాదు చేస్తే, వాళ్లకు లక్ష రూపాయిల బహుమానాన్ని ఆయన ప్రకటించాడు. ఈ ఫిర్యాదుల కోసం ఆయన ప్రత్యేకంగా ఒక హెల్ప్ లైన్ నెంబర్ , వెబ్ సైట్ పోర్టల్ ని కూడా లాంచ్ చేశాడు. దేశం లో ఎక్కడా కూడా గతం లో ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి ని చూడలేదు, ఒకవేళ చూసుంటే కామెంట్ చేయండి. ఇదంతా పక్కన పెడితే విజయ్ ఆలోచన అద్భుతం గానే ఉంది , కానీ ఎంత వరకు ఆచరణలో పెడుతాడో చూద్దాం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన అమలు చేస్తున్న స్కీమ్స్ ని గ్రౌండ్ లెవెల్ లో జనాలకు అధికారులు తీసుకెళ్లలేక పోతున్నారని సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
