మద్యం షాపులను వదలని సీఎం జగన్!

ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఆదాయం పెంచుకునే మార్గాలనే అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా ఏపీలో చేపట్టిన రివర్స్‌ టెండరింగ్‌ విధానం సరికొత్త సత్ఫలితాలను ఇస్తోంది. తాజాగా లిక్కర్ బిజినెస్‌లోనూ రివర్స్ టెండరింగ్ విధానం ప్రభుత్వానికి డబ్బు ఆదా చేసిందని ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ప్రకటించారు. ఏకంగా రూ.108 కోట్లను లిక్కర్ దందాలో ప్రభుత్వం ఆదా చేసిందని ఆయన వెల్లడించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు లిక్కర్ బిజినెస్‌లోనూ రివర్స్ టెండరింగ్ సిస్టమ్ ఫాలో […]

Written By: NARESH, Updated On : November 20, 2020 1:38 pm
Follow us on

ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఆదాయం పెంచుకునే మార్గాలనే అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా ఏపీలో చేపట్టిన రివర్స్‌ టెండరింగ్‌ విధానం సరికొత్త సత్ఫలితాలను ఇస్తోంది. తాజాగా లిక్కర్ బిజినెస్‌లోనూ రివర్స్ టెండరింగ్ విధానం ప్రభుత్వానికి డబ్బు ఆదా చేసిందని ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ప్రకటించారు. ఏకంగా రూ.108 కోట్లను లిక్కర్ దందాలో ప్రభుత్వం ఆదా చేసిందని ఆయన వెల్లడించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు లిక్కర్ బిజినెస్‌లోనూ రివర్స్ టెండరింగ్ సిస్టమ్ ఫాలో అయ్యామని తెలిపారు.

Also Read: వైసీపీ సైలెంట్‌గా ఎందుకు సైడ్‌ అయినట్లు..?

ఏపీలోని డిమాండ్‌ ఉన్న ఏరియాల్లో అధిక మొత్తాలకు టెండర్లు వేసి మద్యం దుకాణాలను పొంది.. ఆ తర్వాత యథేచ్ఛగా మద్యం ధరలను పెంచి మందు ప్రియుల జేబుల కొల్లగొడుతున్న వారికి చెక్ పెట్టేందుకు కొన్ని మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహిస్తూ వస్తోంది. అయితే.. ఈ మధ్య  దుకాణాలకు అద్దెకు తీసుకున్న మడిగలకు గత ఆర్థిక సంవత్సరం (2019–-2020) రూ.671.04 కోట్ల అద్దెను ప్రభుత్వం చెల్లించింది.

అయితే.. ఈ షాపుల ఎంపికలోనూ రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేశామని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి వెల్లడించారు. దాంతో 2020–2021 ఆర్థిక సంవత్సరానికి గాను మద్యం దుకాణాల రెంట్‌పై రూ.108 కోట్ల ఆదా అయ్యిందని నారాయణ స్వామి వివరించారు. ‘సీఎం జగన్ ఇచ్చిన హామీ ప్రకారం దశల వారీగా రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు చేస్తున్నాం.. గతంలో మద్యం షాపులు రెంటుకు తీసుకున్నాం. అధిక రెంట్లకు షాపులు తీసుకున్నారని సీఎం జగన్ దృష్టిలో పెట్టా. దాంతో ఆయన రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేయాలన్నారు.

Also Read: పవన్ మిత్రుడి వరకేనా.. పొత్తుకు పనికిరాడా..?

దాంతో రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.108.84 కోట్లు ఆదా అయ్యింది. 2019–20లో షాపులకు 671.04 కోట్ల రూపాయల రెంటు చెల్లించాం. అదే రివర్స్ టెండరింగ్ ద్వారా 2020–21కి కేవలం 562.2 కోట్ల రూపాయిలు చెల్లిస్తున్నాం. దాదాపు 16.22 శాతం ప్రభుత్వ నిధులు ఆదా చేశాం..’ అని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి తెలిపారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్