Homeఆంధ్రప్రదేశ్‌AP Govt: టెన్త్...

AP Govt: టెన్త్ పరీక్షల్లో ఏడు పేపర్లు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

AP Govt: ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది కూడా పదవ తరగతి పరీక్షల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ప్రతి సంవత్సరం పదవ తరగతి విద్యార్థుల పరీక్షలను 11 పేపర్లతో నిర్వహిస్తారు. కానీ కరోనా కారణంగా గత ఏడాది కేవలం 7 పేపర్లను మాత్రమే నిర్వహించాలని నిర్ణయించింది. అదే విధంగా ఈ ఏడాది కూడా విద్యార్ధులపై మానసిక ఒత్తిడి తగ్గించాలనే ఉద్దేశంతో గత ఏడాది లాగానే ఈ ఏడాది కూడా 7 పేపర్లతోనే పరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.

AP Govt
AP Govt

ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. పాఠశాల ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్ శుక్రవారం జీవో నెంబర్ 79 ను విడుదల చేసారు. 2020-21 లో టెన్త్ పరీక్షలను కరోనా కారణంగా నిర్వహించలేక విద్యార్థులను ఆల్ పాస్ గా ప్రకటించారు. ముందు సంవత్సరం విద్యార్థులు సాధించిన గ్రేడ్ ఆధారంగా ఆ ఏడాది టెన్త్ విద్యార్థులకు గ్రేడ్లు నిర్వహించారు.

కరోనా కారణంగా ఈ ఏడాది కూడా ఆలస్యంగా స్కూల్ లు స్టార్ట్ అయ్యాయి. దీంతో విద్యార్ధులపై ఒత్తిడి పెరిగింది. తక్కువ సమయంలో ఎక్కువ సిలబస్ కంప్లీట్ చేయాల్సి రావడంతో విద్యార్ధులపై భారం ఎక్కువగా పడి ఒత్తిడికి గురి అయ్యారు. అందుకే పదొవ తరగతి విద్యార్థులకు 2021-22 ఏడాది కూడా 7 పేపర్లకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది.

కరోనా కారణంగా 2019-20, 2020-21 లో కూడా టెన్త్ పరీక్షలను 7 పేపర్లకు కుదిస్తున్నట్టు నిర్ణయం తీసుకున్న కూడా కరోనా ఉదృతి ఎక్కువుగా ఉండడం వల్ల పరీక్షలను నిర్వహించలేక పోయారు. అందుకే విద్యార్థులకు ఆల్ పాస్ చేసి గ్రేడ్లు ఇచ్చారు. ఈ ఏడాది కూడా 7 పేపర్ల నిర్ణయం తీసుకోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలపై ఒత్తిడి తగ్గుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Amravati farmers: ఏపీలో ప్ర‌తిప‌క్షాల‌ను ఒకే వేదిక మీద‌కు తెచ్చిన అమ‌రావ‌తి రైతులు..

మరి మళ్ళీ థర్డ్ వేవ్ అంటున్న నేపథ్యంలో ఈ ఏడాది అయినా అనుకున్న విధంగా పరీక్షలను నిర్వహించ గలుగుతారో లేదో వేచి చూడాలి. అంతా బాగుంటే ఈ ఏడాది టెన్త్ విద్యార్థులకు ఏడూ పేపర్లతోనే పరీక్షలు జరగనున్నాయి. ఒకవేళ కరోనా ఆపద మళ్ళీ ఉంటే ఈసారి కూడా ముందు తరగతి ఆధారంగానే గ్రేడ్లు నిర్వహించే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Also Read: Janasena: విశాఖ స్టీల్ ప్లాంట్ అస్ర్తంగా జనసేన డిజిటల్ యుద్ధం

Get notified whenever we post something new!

Continue reading

Indian Tradation: మ‌హిళ‌లు బొట్టు పెట్టుకోవ‌డం వెన‌క ఉన్న ఆరోగ్య సూత్రం ఇదే..!

Indian Tradation: ఈ ప్రపంచంలో అనేక దేశాల్లో అనేక రకాల సంప్రదాయాలు ఉంటాయి. వివిధ దేశాల్లో వివిధ రకాల సంప్రదాయాలు మనకు కనిపిస్తాయి. ఏ సంప్రదాయం ఎలా ఉన్నా కానీ వాటి వెనుక ఏదో ఒక ఆరోగ్య రహస్యం దాగి ఉంటుందని మన పెద్దలు చెబుతారు. ఆ సంప్రదాయాలను పాటించాలని కూడా పేర్కొంటారు. అదే...

Jasmine: ఆడవాళ్లు తలలో మల్లెపూలు పెట్టుకోవడానికి సైంటిఫిక్ రీజన్ ఉందా..?

Jasmine: హిళలు తలలో పూలు పెట్టుకోవడం సాధారణ విషయమే. అయితే ఎక్కువ మంది ఆడవాళ్లు మల్లెపూలను తలలో పెట్టుకోవడాన్ని ఇష్టపడుతుంటారు. అయితే చాలా మంది అందం కోసమే ఆడవాళ్లు తలలో మల్లెపూలు పెట్టుకుంటారని భావిస్తారు. కానీ ఆడవాళ్లు మల్లెపూలను ఇష్టపడం వెనుక ఓ సైంటిఫిక్ రీజన్ ఉందని మాత్రం తెలియదు. మల్లెపూలను పూలలోనే రాణిగా పిలుస్తుంటారు....

Lucky Stone By Date Of Birth: జ‌న్మించిన నెల‌ను బ‌ట్టి ఏ రాయి ధ‌రించాలో తెలుసుకోండి.. ఇలా చేస్తే అదృష్టం మీ వెంటే..

Lucky Stone By Date Of Birth: జ‌నాల‌కు ఉండే న‌మ్మ‌కాల‌లో రంగురాళ్ల‌ను ధ‌రించ‌డం కూడా ఒక‌టి. వీటిని ధ‌రిస్తే త‌మ‌కు అదృష్టం క‌లిసి వ‌స్తుంద‌ని, తాము అనుకున్న ప‌నులు అవుతాయ‌ని అనుకుంటారు. కాగా ఇందులో పుట్టిన నెల‌ను బ‌ట్టి ఏ రంగురాళ్ల‌ను ధ‌రిస్తే అదృష్టం క‌లిసి వ‌స్తుందో తెలుసుకోవ‌చ్చు. జ‌న‌వ‌రిలో పుడితే గోమేదికం...

Enjoy exclusive access to all of our content

Get an online subscription and you can unlock any article you come across.

Enjoy the benefits of exclusive reading

Exit mobile version