Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu On Rayalaseema: రాయలసీమ పై పట్టుకు చంద్రబాబు ఆరాటం

Chandrababu On Rayalaseema: రాయలసీమ పై పట్టుకు చంద్రబాబు ఆరాటం

Chandrababu On Rayalaseema: రాయలసీమ పై చంద్రబాబు ఫోకస్ పెంచారు. వచ్చే ఎన్నికల్లో గణనీయమైన సీట్లు సాధించాలని భావిస్తున్నారు. బలమైన అభ్యర్థులను బరిలోదించాలని డిసైడ్ అయ్యారు. పొత్తులు ఉన్నా లేకపోయినా..ఆర్థిక, అంగ బలం ఉన్న నేతల కోసం అన్వేషిస్తున్నారు. ప్రధానంగా రాజకీయ నేపథ్యమున్న కుటుంబాలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

సాధారణంగా రాయలసీమ అంటేనే వైసిపికి పట్టున్న ప్రాంతం. గత ఎన్నికల్లో దాదాపు స్వీప్ చేసింది ఆ పార్టీ. అందుకే ఈసారి ఆ దూకుడుకు కట్టడి చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. వీలైనన్ని ఎక్కువ సీట్లు రాయలసీమ నుండి పొందాలని వ్యూహాలు రూపొందిస్తున్నారు. వైసిపి బాధిత వర్గాలను చేరదీయాలని చూస్తున్నారు. ముఖ్యంగా జగన్ సొంత సామాజిక వర్గం తోనే వైసీపీని ఢీకొట్టాలని నిర్ణయించుకున్నారు.

అనంతపురంలో జెసి బ్రదర్స్, కడపలో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కుటుంబం అండదండలు తీసుకోవాలని చూస్తున్నారు. కర్నూలులో సైతం రెడ్డి సామాజిక వర్గాన్ని టిడిపి వైపు మళ్లించేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే రాష్ట్రవ్యాప్త ప్రాజెక్టుల సందర్శనను రాయలసీమ నుంచి శ్రీకారం చుట్టారు. పనిలో పనిగా కీలక నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు.

కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం టిడిపి అభ్యర్థిగా భూపేష్ రెడ్డిని చంద్రబాబు ప్రకటించారు. ఈయన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సోదరుడి కుమారుడు. గత ఎన్నికల తర్వాత ఆదినారాయణ రెడ్డి బిజెపిలో చేరారు. ఆయన సోదరుడు కుమారుడు భూపేష్ రెడ్డి మాత్రం టిడిపిలోనే ఉండిపోయారు. అయితే భూపేష్ రెడ్డినే తన రాజకీయ వారసుడిగా ఆదినారాయణ రెడ్డి ప్రకటించారు. గత ఎన్నికల్లో ఆదినారాయణ రెడ్డి, రామ సుబ్బారెడ్డి టిడిపిలోనే ఉండేవారు. రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నా.. చంద్రబాబు వీరిద్దరిని ఏకతాటిపైకి తీసుకొచ్చారు. ఆదినారాయణ రెడ్డిని కడప ఎంపీగా.. రామసుబ్బారెడ్డిని జమ్మలమడుగు అభ్యర్థిగా పోటీ చేయించారు. కానీ అనూహ్యంగా ఇద్దరూ ఓడిపోయారు. టిడిపికి దూరమయ్యారు. ఇప్పుడు భూపేష్ రెడ్డి అభ్యర్థి కావడం.. గతంలో రాజకీయ వారసుడి గా ప్రకటించడంతో ఆదినారాయణ రెడ్డి సపోర్టు ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రాయలసీమ వ్యాప్తంగా ఉన్న 52 నియోజకవర్గాల్లో ఇదే ఫార్ములాతో చంద్రబాబు ముందుకెళ్లాలని భావిస్తున్నారు. మరి అది ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Sun Facts

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Samsung Galaxy S26 FE

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...
Balakrishna Injury

Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్...
Tollywood Directors

Tollywood Directors: బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేసే ఉద్దేశ్యం లేని తెలుగు దర్శకులు వీళ్లే…

Tollywood Directors: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లు కొందరు తెలుగు హీరోలు అవకాశం ఇవ్వకపోవడంతో బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా వంశీ పైడిపల్లి తెలుగు స్టార్...
Oktelugu Epaper